అన్వేషించండి

Pakistan Fear: భారత్ త్రిశూల్ విన్యాసాలు చూసి వణికిపోతున్న పాక్ - యుద్ధం చేయబోతున్నారని గగ్గోలు - ఇంత భయమా?

Panic Pakistan : పాకిస్తాన్ భయంతో వణికిపోతోంది. భారత్ యుద్ధం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోందని అనుమానిస్తోంది. దానికి కారణం త్రిశూర్ ఎక్సర్ సైజులే.

Pakistan Issues Second NOTAM Amid India Trishul  Exercise:  భారత్ తన సైనిక సన్నద్థతా విన్యాసాలు  ‘త్రిశూల్ 2025’ చేస్తూండటంతో పాకిస్తాన్ కు వణుకు పుడుతోంది. యుద్ధం చేయడానికి సన్నాహాలు చేసుకుంటోందని భయపడుతోంది. అందుకే  పాకిస్తాన్ ‘పానిక్ & ప్రీకాషన్’ స్థితికి వెళ్లిపోయింది.  రెండో  సారి NOTAM (Notice to Airmen) సంకేతాలు జారీ చేసింది. ఐదు రోజుల్లో రెండోసారి విమానాల ప్రయాణాలపై నిషేధాలు విధించిన ఈ NOTAM, నవంబర్ 1 నుంచి 30 వరకు అమలులో ఉంటుంది. దక్షిణ, తీర ప్రాంతాల్లో పెద్ద భాగం విమానాల ప్రయాణాలకు మూసివేసింది.  

త్రిశూల్ 2025 భారత్ త్రివిధ దళాల బలోపేతం కోసం చేపట్టే ఎక్సర్ సైజ్.   20,000 మంది సైనికులు, రాఫెల్‌లు, ట్యాంకులు ఇందులో పాలు పంచుకుంటున్నాయి. భారత్‌లో ‘త్రిశూల్ 2025’ వ్యాయామం అక్టోబర్ 30 నుంచి నవంబర్ 11 వరకు 12 రోజులు జరుగుతోంది. గుజరాత్  లోని సర్ క్రీక్ ప్రాంతం, రాజస్థాన్, గుజరాత్‌లో ఈ   విన్యాసాలు జరుగుతున్నాయి.  భారత సైన్యం, నావికాదళం, వాయుసేన మూడు విభాగాలు కలిసి పాల్గొంటున్న ఈ ఎక్సర్ సైజ్‌ ను దక్షిణ కమాండ్ సైనికులు లీడ్ చేస్తున్నారు.  20,000కి పైగా సైనికులు, T-90S, అర్జున్ ట్యాంకులు, హౌఇట్జర్‌లు, మిస్సైల్ సిస్టమ్‌లు, ఆక్రమణ హెలికాప్టర్లు, రాఫెల్, సుఖోయ్-30MKI ఫైటర్‌లు, AWACS (ఎయిర్‌బోర్న్ అర్లీ వార్నింగ్), మిడ్-ఎయిర్ రిఫ్యూయలర్లు, RPAలు, ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లు పాల్గొంటున్నాయి. 

ఇవన్నీ చూస్తున్న పాకిస్తాన్.. భారత్ యుద్ధ సన్నాహాలు చేసుకుంటోందని కంగారు పడుతోంది.  దక్షిణ, తీర ప్రాంతాల్లో విమానాల నిషేధం విధిచింది.  పాకిస్తాన్ మొదటి NOTAM అక్టోబర్ 28, 29న జారీ చేసింది. కరాచీ, లాహోర్  విమాన రూట్లను ఓ రోజు మూసివేసింది.  . ఇప్పుడు రెండో NOTAM, నవంబర్ 1 నుంచి 30 వరకు అమలులోకి వచ్చింది. దీనిలో దక్షిణ, తీర ప్రాంతాల్లో పెద్ద భాగం విమానాల ప్రయాణాలను నిలిపివేశారు.  

ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం, ఈ NOTAM భారత్‌కు ‘డిటరెన్స్ సిగ్నల్’గా పంపించారు. భారత్ విన్యాసాలు చేస్తున్నట్లుగా చేసి.. దక్షిణ ఎయిర్‌బేస్‌లు, నావల్ ఫ్లీట్లపై దాడుల అవకాశం ఉందని పాకిస్తాన్ భావిస్తోంది.   ఇస్లామాబాద్ తన విమాన, సముద్ర సరిహద్దులను రక్షించాలని నిర్ణయించుకుంది.  పాకిస్తాన్ అన్ని సైనిక విభాగాలను నవంబర్ 30 వరకు రెడ్ అలర్ట్‌పై ఉంచింది. తీర ప్రాంతాల్లో సర్వైలెన్స్ పెంచారు, ఉత్తర అరేబియన్ సీలో నావల్, వాయు ఆస్తులను రీపొజిషన్ చేశారు.     

మే 2025లో పహాల్గాం టెర్రర్ అటాక్‌కు ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టడం, టెర్రర్ హబ్‌లు, ఎయిర్‌బేస్‌లపై దాడులు చేశారు. ఈ కారణంగా  త్రిశూల్ వ్యాయామం పాకిస్తాన్‌లో ఆందోళన కలిగించింది. దసరా సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సర్ క్రీక్‌లో సైనిక శిబిరంలో పాక్‌ను హెచ్చరించడం కూడా దీనికి కారణం. భారత్ ఈ ఎక్సర్ సైజ్‌ను భార త్‘రొటీన్’గా చెబుతున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం భయపడిపోతోంది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
తక్కువ ధరలో టాటా హారియర్ ఈవీ AWD వేరియంట్: ఫియర్ లెస్+ QWD 75 లాంచ్, ఫీచర్లు ఇవే!
తక్కువ ధరలో టాటా హారియర్ ఈవీ AWD వేరియంట్: ఫియర్ లెస్+ QWD 75 లాంచ్, ఫీచర్లు ఇవే!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Embed widget