అన్వేషించండి

పాకిస్థాన్ గాజులు తొడుక్కుని కూర్చోలేదు,అణుబాంబులు వేస్తుంది - పీవోకే వివాదంపై ఫరూక్ అబ్దుల్లా

Pak Occupied Kashmir: పీవోకేని భారత్‌లో కలిపేసుకుంటే పాకిస్థాన్‌ చూస్తూ కూర్చోదని అణుదాడి చేస్తుందని ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pak Occupied Kashmir Issue: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని (Pak Occupied Kashmir) త్వరలోనే భారత్‌లో కలిపేస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. దీనిపై జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. పీఓకేని ఆక్రమిస్తుంటే చూస్తూ కూర్చోడానికి పాకిస్థాన్ గాజులు తొడుక్కోలేదని, అణుబాంబులతో మనపై దాడి చేస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రక్షణశాఖ ఎలా అనుకుంటే అలా చేయొచ్చని కానీ వాటి పర్యవసానాలనూ దృష్టిలో పెట్టుకోవాలని హెచ్చరించారు. 

"రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని భారత్‌లో కలిపేస్తామని చెబుతున్నారు. చేస్తే చేయనివ్వండి. అడ్డుకోడానికి మేమెవరం. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. అలా చేస్తుంటే ఊరుకోడానికి పాకిస్థాన్‌ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. పాక్ వద్ద అణు బాంబులున్నాయి. వాటిని భారత్‌పై ప్రయోగించే ప్రమాదముంది"

- ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత 

ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు కూడా భారత్‌లో కలిసిపోయేందుకు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. భారత్‌లో తమని కలిపేయాలంటూ స్థానిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. 

"ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే. త్వరలోనే భారత్‌లో కలిపేసుకుంటాం. భారత్‌ శక్తి సామర్థ్యాలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ ప్రతిష్ఠ పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. అందుకే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలూ భారత్‌లో కలిసిపోవాలనే కోరుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు"

- రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ మంత్రి

విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ కూడా PoK అంశంపై స్పందించారు. ఇది భారత్‌లో భాగమే అని తేల్చి చెప్పారు. త్వరలోనే దీనిపై ఓ తీర్మానం తీసుకొచ్చే అవకాశముందని వెల్లడించారు. భారతీయుల్ని పాక్ ఆక్రమిత కశ్మీర్‌ గురించి మర్చిపోయే విధంగా చేశారని, ఇప్పుడిప్పుడే వాళ్లకి నిజాలు అర్థమవుతున్నాయని స్పష్టం చేశారు. 

"పాక్ ఆక్రమిత కశ్మీర్‌ మన భారత్‌లో భాగమే. దీనికి సంబంధించిన తీర్మానం భారత్‌ వద్ద ఉంది. అలాంటప్పుడు అది పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా ఎలా ఉంటుంది..? వేరేవరికో ఆ ప్రాంతంపై అధికారం ఎందుకు ఉంటుంది..? ఇంట్లో సరైన వ్యక్తి లేకపోతే వేరెవరో వచ్చి ఆ ఇంటిని దోచేసుకుంటారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ కూడా అలాగే మన చేతుల్లో నుంచి వెళ్లిపోయింది"

- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
 

Also Read: ED Raids: మంత్రి సెక్రటరీ ఇంట్లో కుప్పలుగా నోట్ల కట్టలు, గది నిండా పరిచి ఉన్న కరెన్సీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
Amit Shah on Waqf properties: 2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs GT Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 8వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamSunita Williams Best Home Coming | నాసాలో చికిత్స తర్వాత ఇంటికి వచ్చిన సునీతా విలియమ్స్ | ABP DesamDigvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP DesamRCB vs GT Match preview IPL 2025 | నేడు గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ మ్యాచ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
Amit Shah on Waqf properties: 2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌ బోర్డులకు భారీగా ఆస్తులను కాంగ్రెస్ ఇచ్చేసింది: లోక్‌సభలో అమిత్ షా సంచలన ఆరోపణలు
Waqf Bill: ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
Telangana High Court: కోర్టుకు వస్తారా? జైలుకు పంపమంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..!
కోర్టుకు వస్తారా? జైలుకు పంపమంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..!
IPL 2025 GT VS RCB Result Update: బ‌ట్ల‌ర్ అన్ బీటెన్ ఫిఫ్టీ.. రాణించిన సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్.. జీటీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఆర్సీబీకి ప‌రాభ‌వం..
బ‌ట్ల‌ర్ అన్ బీటెన్ ఫిఫ్టీ.. రాణించిన సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్.. జీటీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఆర్సీబీకి ప‌రాభ‌వం..
Nellore Crime News: నెల్లూరు రైళ్లలో సిక్కా గ్యాంగ్ దోపిడీ! పట్టాలపై నాణెం పెట్టి ఎలా దోచుకుంటారంటే?
నెల్లూరు రైళ్లలో సిక్కా గ్యాంగ్ దోపిడీ! పట్టాలపై నాణెం పెట్టి ఎలా దోచుకుంటారంటే?
Embed widget