అన్వేషించండి

పాకిస్థాన్ గాజులు తొడుక్కుని కూర్చోలేదు,అణుబాంబులు వేస్తుంది - పీవోకే వివాదంపై ఫరూక్ అబ్దుల్లా

Pak Occupied Kashmir: పీవోకేని భారత్‌లో కలిపేసుకుంటే పాకిస్థాన్‌ చూస్తూ కూర్చోదని అణుదాడి చేస్తుందని ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pak Occupied Kashmir Issue: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని (Pak Occupied Kashmir) త్వరలోనే భారత్‌లో కలిపేస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. దీనిపై జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. పీఓకేని ఆక్రమిస్తుంటే చూస్తూ కూర్చోడానికి పాకిస్థాన్ గాజులు తొడుక్కోలేదని, అణుబాంబులతో మనపై దాడి చేస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రక్షణశాఖ ఎలా అనుకుంటే అలా చేయొచ్చని కానీ వాటి పర్యవసానాలనూ దృష్టిలో పెట్టుకోవాలని హెచ్చరించారు. 

"రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని భారత్‌లో కలిపేస్తామని చెబుతున్నారు. చేస్తే చేయనివ్వండి. అడ్డుకోడానికి మేమెవరం. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. అలా చేస్తుంటే ఊరుకోడానికి పాకిస్థాన్‌ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. పాక్ వద్ద అణు బాంబులున్నాయి. వాటిని భారత్‌పై ప్రయోగించే ప్రమాదముంది"

- ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత 

ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు కూడా భారత్‌లో కలిసిపోయేందుకు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. భారత్‌లో తమని కలిపేయాలంటూ స్థానిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. 

"ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే. త్వరలోనే భారత్‌లో కలిపేసుకుంటాం. భారత్‌ శక్తి సామర్థ్యాలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ ప్రతిష్ఠ పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. అందుకే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలూ భారత్‌లో కలిసిపోవాలనే కోరుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు"

- రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ మంత్రి

విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ కూడా PoK అంశంపై స్పందించారు. ఇది భారత్‌లో భాగమే అని తేల్చి చెప్పారు. త్వరలోనే దీనిపై ఓ తీర్మానం తీసుకొచ్చే అవకాశముందని వెల్లడించారు. భారతీయుల్ని పాక్ ఆక్రమిత కశ్మీర్‌ గురించి మర్చిపోయే విధంగా చేశారని, ఇప్పుడిప్పుడే వాళ్లకి నిజాలు అర్థమవుతున్నాయని స్పష్టం చేశారు. 

"పాక్ ఆక్రమిత కశ్మీర్‌ మన భారత్‌లో భాగమే. దీనికి సంబంధించిన తీర్మానం భారత్‌ వద్ద ఉంది. అలాంటప్పుడు అది పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా ఎలా ఉంటుంది..? వేరేవరికో ఆ ప్రాంతంపై అధికారం ఎందుకు ఉంటుంది..? ఇంట్లో సరైన వ్యక్తి లేకపోతే వేరెవరో వచ్చి ఆ ఇంటిని దోచేసుకుంటారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ కూడా అలాగే మన చేతుల్లో నుంచి వెళ్లిపోయింది"

- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
 

Also Read: ED Raids: మంత్రి సెక్రటరీ ఇంట్లో కుప్పలుగా నోట్ల కట్టలు, గది నిండా పరిచి ఉన్న కరెన్సీ

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సాయంత్రం 5 గంటలకు రండి, నిజాలేంటో తేల్చేద్దాం.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి ఛాలెంజ్
సాయంత్రం 5 గంటలకు రండి, నిజాలేంటో తేల్చేద్దాం.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి ఛాలెంజ్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?
రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV లేదా Curvv EV - ఏది బెస్ట్ ఛాయిస్?
Embed widget