అన్వేషించండి

Nara Lokesh: సీఎం జగన్ ఉచితాలు తీసేశారు, టీడీపీ అధికారంలోకి వస్తే వారికి 500 యూనిట్లు కరెంట్ ఫ్రీ: నారా లోకేశ్

Nara Lokesh: టీడీపీ అధికారంలోకి వచ్చాక మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా అందిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేస్తామన్నారు.

Nara Lokesh: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో చెబుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. 19వ రోజు పాదయాత్రలో భాగంగా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం, పిచ్చాటూరు మండలాల్లో లోకేశ్ పర్యటించారు. నారాయణవనం మండలం రాళ్ల కాల్వ, గోవిందప్ప నాయుడు కండ్రిగ, కైలాసకోన రహదారి, అరణ్యం కండ్రిగ, కృష్ణంరాజు కండ్రిగ, ఐఆర్ కండ్రిగల మీదుగా లోకేశ్ పాదయాత్ర సాగింది.

లోకేశ్‌ను కలిసి మొర పెట్టుకున్న ఎస్సీ మహిళలు

యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేశ్ ని కలిసిన పలువురు ఎస్సీ మహిళలు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించారు. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ కాలనీల్లోని దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన హామీని నెరవేర్చుకోలేక పోయారని తెలిపారు. వైసీపీ సర్కారు విద్యుత్ రాయితీని తొలగించిందని లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న నారా లోకేశ్.. తాము అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల వరకు ఎలాంటి షరతులు లేకుండా ఎస్సీ కాలనీల్లోని దళితులకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వెదురు కళాకారులతో లోకేశ్ మాట్లాడారు. గోవిందప్ప కండ్రిగలో స్థానికులతో అరణ్యం కండ్రిగలో దాసరి, పద్మశాలి వర్గీయులతో, పలమనగళంలో ముస్లింలతో మాట్లాడారు.

మరమగ్గాలకు 500 యూనిట్లు ఫ్రీ

పాదయాత్రలో భాగంగా చినరాజకుప్పంలో మాట్లాడిన లోకేశ్.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నేతన్నలను, రైతులను మోసం చేశారని, సబ్సిడీలు ఎత్తేశారని విమర్శించారు.  వైసీపీ హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారని, రాష్ట్రానికి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

తిరుపతి టీడీపీ నేతలతో లోకేశ్ భేటీ

పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేశ్ ను కలిశారు. విత్తలతుడుకు క్యాంప్ ఆఫీసులో నారా లోకేశ్ ను టీడీపీ నేతలు కలిశారు. యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్, పాదయాత్ర ఏర్పాట్లు సహా ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహా యాదవ్, మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర ఏర్పాట్లను నారా లోకేశ్ కు వారు వివరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Elections 2026: పొత్తుల్లో ఉన్నా.. డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ - తమిళ రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైల్ - ఇలా ఎలా ?
పొత్తుల్లో ఉన్నా.. డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ - తమిళ రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైల్ - ఇలా ఎలా ?
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
Visakhapatnam Crime News: భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Visakhapatnam Crime News: భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
IPL 2026 MI Vs KKR Result Update: ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Most Cheapest Diesel SUVs: దేశంలోనే అతి తక్కువ ధరలో డీజిల్ ఆటోమేటిక్ SUV ఏది? టాప్ 5 కార్ల వివరాలివే
దేశంలోనే అతి తక్కువ ధరలో డీజిల్ ఆటోమేటిక్ SUV ఏది? టాప్ 5 కార్ల వివరాలివే
Embed widget