అన్వేషించండి

Nara Lokesh: సీఎం జగన్ ఉచితాలు తీసేశారు, టీడీపీ అధికారంలోకి వస్తే వారికి 500 యూనిట్లు కరెంట్ ఫ్రీ: నారా లోకేశ్

Nara Lokesh: టీడీపీ అధికారంలోకి వచ్చాక మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా అందిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేస్తామన్నారు.

Nara Lokesh: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో చెబుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. 19వ రోజు పాదయాత్రలో భాగంగా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం, పిచ్చాటూరు మండలాల్లో లోకేశ్ పర్యటించారు. నారాయణవనం మండలం రాళ్ల కాల్వ, గోవిందప్ప నాయుడు కండ్రిగ, కైలాసకోన రహదారి, అరణ్యం కండ్రిగ, కృష్ణంరాజు కండ్రిగ, ఐఆర్ కండ్రిగల మీదుగా లోకేశ్ పాదయాత్ర సాగింది.

లోకేశ్‌ను కలిసి మొర పెట్టుకున్న ఎస్సీ మహిళలు

యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేశ్ ని కలిసిన పలువురు ఎస్సీ మహిళలు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించారు. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ కాలనీల్లోని దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన హామీని నెరవేర్చుకోలేక పోయారని తెలిపారు. వైసీపీ సర్కారు విద్యుత్ రాయితీని తొలగించిందని లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న నారా లోకేశ్.. తాము అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల వరకు ఎలాంటి షరతులు లేకుండా ఎస్సీ కాలనీల్లోని దళితులకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వెదురు కళాకారులతో లోకేశ్ మాట్లాడారు. గోవిందప్ప కండ్రిగలో స్థానికులతో అరణ్యం కండ్రిగలో దాసరి, పద్మశాలి వర్గీయులతో, పలమనగళంలో ముస్లింలతో మాట్లాడారు.

మరమగ్గాలకు 500 యూనిట్లు ఫ్రీ

పాదయాత్రలో భాగంగా చినరాజకుప్పంలో మాట్లాడిన లోకేశ్.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నేతన్నలను, రైతులను మోసం చేశారని, సబ్సిడీలు ఎత్తేశారని విమర్శించారు.  వైసీపీ హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారని, రాష్ట్రానికి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

తిరుపతి టీడీపీ నేతలతో లోకేశ్ భేటీ

పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేశ్ ను కలిశారు. విత్తలతుడుకు క్యాంప్ ఆఫీసులో నారా లోకేశ్ ను టీడీపీ నేతలు కలిశారు. యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్, పాదయాత్ర ఏర్పాట్లు సహా ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహా యాదవ్, మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర ఏర్పాట్లను నారా లోకేశ్ కు వారు వివరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Raghav Chadha : ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
Women Reservation Implementation: లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
Who is Rinkoo Singh Rahee: అవినీతిపై పోరాటమే ఆ ఐఏఎస్ చేసిన పాపం - రింకూ సింగ్ రాహీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.
అవినీతిపై పోరాటమే ఆ ఐఏఎస్ చేసిన పాపం - రింకూ సింగ్ రాహీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.
West Bengal Latest News:పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women Reservation Implementation: లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Raghav Chadha : ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
Rajya Sabha YSRCP: బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Perni Kittu: పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
Nara Lokesh in Delhi: అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
Embed widget