అన్వేషించండి

Nara Lokesh: సీఎం జగన్ ఉచితాలు తీసేశారు, టీడీపీ అధికారంలోకి వస్తే వారికి 500 యూనిట్లు కరెంట్ ఫ్రీ: నారా లోకేశ్

Nara Lokesh: టీడీపీ అధికారంలోకి వచ్చాక మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా అందిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేస్తామన్నారు.

Nara Lokesh: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో చెబుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. 19వ రోజు పాదయాత్రలో భాగంగా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం, పిచ్చాటూరు మండలాల్లో లోకేశ్ పర్యటించారు. నారాయణవనం మండలం రాళ్ల కాల్వ, గోవిందప్ప నాయుడు కండ్రిగ, కైలాసకోన రహదారి, అరణ్యం కండ్రిగ, కృష్ణంరాజు కండ్రిగ, ఐఆర్ కండ్రిగల మీదుగా లోకేశ్ పాదయాత్ర సాగింది.

లోకేశ్‌ను కలిసి మొర పెట్టుకున్న ఎస్సీ మహిళలు

యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేశ్ ని కలిసిన పలువురు ఎస్సీ మహిళలు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించారు. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ కాలనీల్లోని దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన హామీని నెరవేర్చుకోలేక పోయారని తెలిపారు. వైసీపీ సర్కారు విద్యుత్ రాయితీని తొలగించిందని లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న నారా లోకేశ్.. తాము అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల వరకు ఎలాంటి షరతులు లేకుండా ఎస్సీ కాలనీల్లోని దళితులకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వెదురు కళాకారులతో లోకేశ్ మాట్లాడారు. గోవిందప్ప కండ్రిగలో స్థానికులతో అరణ్యం కండ్రిగలో దాసరి, పద్మశాలి వర్గీయులతో, పలమనగళంలో ముస్లింలతో మాట్లాడారు.

మరమగ్గాలకు 500 యూనిట్లు ఫ్రీ

పాదయాత్రలో భాగంగా చినరాజకుప్పంలో మాట్లాడిన లోకేశ్.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నేతన్నలను, రైతులను మోసం చేశారని, సబ్సిడీలు ఎత్తేశారని విమర్శించారు.  వైసీపీ హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారని, రాష్ట్రానికి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

తిరుపతి టీడీపీ నేతలతో లోకేశ్ భేటీ

పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేశ్ ను కలిశారు. విత్తలతుడుకు క్యాంప్ ఆఫీసులో నారా లోకేశ్ ను టీడీపీ నేతలు కలిశారు. యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్, పాదయాత్ర ఏర్పాట్లు సహా ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహా యాదవ్, మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర ఏర్పాట్లను నారా లోకేశ్ కు వారు వివరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget