అన్వేషించండి

Nara Lokesh: సీఎం జగన్ ఉచితాలు తీసేశారు, టీడీపీ అధికారంలోకి వస్తే వారికి 500 యూనిట్లు కరెంట్ ఫ్రీ: నారా లోకేశ్

Nara Lokesh: టీడీపీ అధికారంలోకి వచ్చాక మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా అందిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేస్తామన్నారు.

Nara Lokesh: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో చెబుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. 19వ రోజు పాదయాత్రలో భాగంగా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం, పిచ్చాటూరు మండలాల్లో లోకేశ్ పర్యటించారు. నారాయణవనం మండలం రాళ్ల కాల్వ, గోవిందప్ప నాయుడు కండ్రిగ, కైలాసకోన రహదారి, అరణ్యం కండ్రిగ, కృష్ణంరాజు కండ్రిగ, ఐఆర్ కండ్రిగల మీదుగా లోకేశ్ పాదయాత్ర సాగింది.

లోకేశ్‌ను కలిసి మొర పెట్టుకున్న ఎస్సీ మహిళలు

యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేశ్ ని కలిసిన పలువురు ఎస్సీ మహిళలు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించారు. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ కాలనీల్లోని దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన హామీని నెరవేర్చుకోలేక పోయారని తెలిపారు. వైసీపీ సర్కారు విద్యుత్ రాయితీని తొలగించిందని లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న నారా లోకేశ్.. తాము అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల వరకు ఎలాంటి షరతులు లేకుండా ఎస్సీ కాలనీల్లోని దళితులకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వెదురు కళాకారులతో లోకేశ్ మాట్లాడారు. గోవిందప్ప కండ్రిగలో స్థానికులతో అరణ్యం కండ్రిగలో దాసరి, పద్మశాలి వర్గీయులతో, పలమనగళంలో ముస్లింలతో మాట్లాడారు.

మరమగ్గాలకు 500 యూనిట్లు ఫ్రీ

పాదయాత్రలో భాగంగా చినరాజకుప్పంలో మాట్లాడిన లోకేశ్.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నేతన్నలను, రైతులను మోసం చేశారని, సబ్సిడీలు ఎత్తేశారని విమర్శించారు.  వైసీపీ హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారని, రాష్ట్రానికి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

తిరుపతి టీడీపీ నేతలతో లోకేశ్ భేటీ

పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేశ్ ను కలిశారు. విత్తలతుడుకు క్యాంప్ ఆఫీసులో నారా లోకేశ్ ను టీడీపీ నేతలు కలిశారు. యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్, పాదయాత్ర ఏర్పాట్లు సహా ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహా యాదవ్, మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర ఏర్పాట్లను నారా లోకేశ్ కు వారు వివరించారు.

టాప్ హెడ్ లైన్స్

Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget