News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

MP Nusrat Jahan: సొంత ఇళ్లు కట్టిస్తామంటూ మోసం - 28 కోట్లు స్వాహా చేశారని ఎంపీ నుస్రత్ పై కేసు నమోదు

MP Nusrat Jahan: సొంత ఇళ్లు కట్టిస్తామంటూ ప్రజలను మోసం చేశారని తృణమూల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ పై కేసు నమోదు అయింది. మొత్తం 429 మంది నుంచి రూ.28 కోట్లు మోసం చేశారని ఆరోపించారు. 

FOLLOW US: 
Share:

MP Nusrat Jahan: సొంత ఇళ్లు కట్టిస్తామని చెబుతూ.. ప్రజలను మోసం చేశారని తృణమూల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ పై కేసు నమోదు అయింది. మొత్తం 429 మంది వద్ద నుంచి ఇల్లు కట్టిస్తామని దాదాపు రూ.28 కోట్ల మేర మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు దీనిపై గరియాహట్ పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు ఆమెపై అలిపోర్ కోర్టులో కూడా కేసు దాఖలు చేశారు. అయితే ఈ అంశంపై ఎంపీ నుస్రత్ జహాన్ ను సంప్రదించగా.. ఆమె స్పందించలేదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కూడా మౌనం వహిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..?

నుస్రత్ జహాన్ డైరెక్టర్ గా ఉన్న కంపెనీ తక్కువ ధరకే సొంత ఇల్లు కట్టిస్తామంటూ హామీ ఇచ్చింది. ఉత్తర 24 పరగణాలు జిల్లాలో కేవలం రూ.5.55 లక్షలకు త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ ఇస్తామని చెప్పింది. అలాగే వీటిని 2018లోగా కొనుగోలు దారులకు అందిస్తామని తెలిపింది. దీంతో దాదాపు 429 మంది సంస్థ చెప్పిన నగదును చెల్లించారు. దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వాటిని అందించలేదు. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయిచారు. 

మరోవైపు ఈడీకి ఫిర్యాదు చేసిన శంకుదేవ్ పాండా

బీజేపీ నేత సంకూ దేబ్  పాండా ఇటీవల నుస్రత్ జహాన్‌పై ఈడీకి ఫిర్యాదు చేశారు. 20 కోట్ల రూపాయలకు పైగా నుస్రత్ మోసం చేసిందని ఆరోపించారు. 429 మంది నుంచి 5 లక్షల 55 వేల రూపాయలు తీసుకున్న నుస్రత్ సంస్థ.. బదులుగా ఫ్లాట్ ఇవ్వాలని ఒప్పందం చేసుకుంది. కానీ, డబ్బు డిపాజిట్ చేసిన వ్యక్తులకు ఆ ఫ్లాట్ లభించలేదని ఆరోపించారు. ఫిర్యాదుదారులు సెవెన్ సెన్సెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డబ్బు ఇచ్చారని ఆరోపించారు. ఆ సంస్థకు నుస్రత్ నాయకురాలు. ఈ ఘటనపై ఈడీకి ఫిర్యాదు చేశారు. నుస్రత్‌పై వచ్చిన మోసంపై ఈడీ విచారణ జరిపించాలని బీజేపీ నేత శంకుదేవ్ పాండా డిమాండ్ చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో ప్రయోజనం లేకపోవడంతో ఈడీని ఆశ్రయించాను అని బీజేపీ నేత పేర్కొన్నారు. ఈ విషయమై నుస్రత్‌ జహాన్‌ను సంప్రదించగా, ఫోన్‌లో స్పందన లేదు.

మరోవైపు ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించడానికి నుస్రత్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఫిర్యాదును కేంద్ర ఏజెన్సీకి నివేదించినట్లు పేర్కొంటున్నందున, న్యాయవాదులతో మాట్లాడిన తర్వాతే ఫిర్యాదుపై నుస్రత్ జహాన్ స్పందిస్తారని సమాచారం. 

Published at : 01 Aug 2023 10:20 PM (IST) Tags: MP NUSRAT West Bengal News Case Filed on West Bengal MP Case on MP Nusrat Nusrat Jahan Cheating Case

ఇవి కూడా చూడండి

RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు

RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు

Credit Card: సిబిల్‌ స్కోర్‌లో మీరు 'పూర్‌' అయినా క్రెడిట్‌ కార్డ్‌ కచ్చితంగా వస్తుంది, బ్యాంకులు పిలిచి మరీ ఇస్తాయి

Credit Card: సిబిల్‌ స్కోర్‌లో మీరు 'పూర్‌' అయినా క్రెడిట్‌ కార్డ్‌ కచ్చితంగా వస్తుంది, బ్యాంకులు పిలిచి మరీ ఇస్తాయి

ABP Desam Top 10, 4 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 4 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఈ ఈడీ సోదాలు - కేజ్రీవాల్ విమర్శలు

బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఈ ఈడీ సోదాలు - కేజ్రీవాల్ విమర్శలు

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

టాప్ స్టోరీస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...