అన్వేషించండి

Andhra News: 'పవన్ కు ఏపీలో కనీసం ఓటు, ఆధార్ లేదు' - ప్రధానికి తాము కూడా లెటర్ రాస్తామన్న మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh: గృహ నిర్మాణం పేరిట అక్రమాలు జరిగాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాని మోదీకి లేఖ రాయడంపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. అభివృద్ధి పవన్ కు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.

Minister Jogi Ramesh Comments on Pawan Kalyan: రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మిస్తుంటే అది జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు కనిపించడం లేదా.? అంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ప్రధాని మోదీకి (PM Modi), పవన్ లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కు అసలు ఏపీలో ఆధార్ కార్డు, ఓటు కార్డు లేవని.. ఆయన చంద్రబాబు కోసమే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 'ఏ ఆధారాలతో పవన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆయన చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తున్నాం. ఏపీలో జరిగిన అభివృద్ధి మరే రాష్ట్రంలోనూ జరగలేదు. కేవలం పట్టాలతోనే సరిపెట్టకుండా 21 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. ఇప్పటికే చాలా చోట్ల గృహ ప్రవేశాలు కూడా చేశారు. ఏం స్కాం జరిగిందో పవన్ చెప్పాలి.' అని నిలదీశారు. 

ప్రధానికి లేఖ రాస్తాం

అక్క చెల్లెమ్మలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని, పవన్ కల్యాణ్ లేవనెత్తిన 13 అంశాలకు సమాధానాలను మీడియా ద్వారా అందజేస్తున్నట్లు మంత్రి జోగి రమేష్ తెలిపారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసం ఏ పనైనా చేస్తారని, స్కిల్ డెవలప్మెంట్ స్కాం మీద పవన్ ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో పవన్ కు సైతం వాటా ఉంది. చంద్రబాబు కొట్టేసిన డబ్బులో పవన్ కల్యాణ్ కు ఎంత ముట్టిందో విచారణ చేయాలని తాము కూడా ప్రధాని మోదీకి లేఖ రాయబోతున్నామని చెప్పారు. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో విచారణ కోరతామన్నారు. చంద్రబాబు ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసినప్పుడు ఎందుకు పవన్ అడగలేదని నిలదీశారు. '14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారో పవన్ ప్రశ్నించారా.?. పవన్ కు బుద్ధి ఉంటే చంద్రబాబును ప్రశ్నించాలి. ఏ గ్రామానికైనా వెళ్దాం. ఏ సంక్షేమ పథకం ఎవరు అమలు చేశారో ప్రజలనే అడుగుదాం.' అంటూ సవాల్ చేశారు. ప్రజలను మోసం చేసిన అప్పటి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కూడా భాగస్వామేనని, వీరి పాపం పండిందని అన్నారు. 'సీఎం జగన్ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రధానికి లేఖ రాస్తారా.?. చంద్రబాబు, లోకేశ్ దోచుకున్న డబ్బుల మీద లేఖ రాయి.' అంటూ హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో ఎంత మంది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, జగన్ సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. 

కాగా, ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) 5 పేజీల లేఖ రాశారు. దీనిపై సీబీఐ (CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని లేఖలో పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. 'వైసీపీ పాలనలో భూ సేకరణ పేరిట రూ.32,141 కోట్లు దుర్వినియోగం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ సేకరణలో కీలకంగా వ్యవహరించారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సైతం లబ్ధిదారులకు పూర్తిగా ఇవ్వలేదు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తైతే 86,984 మందికే ఇళ్లు ఇచ్చారు. వీటన్నింటిపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి.' అని లేఖలో కోరారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: New Year Celebrations: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ - మందుబాబులకు గుడ్ న్యూస్, వేడుకల సందర్భంగా పోలీసుల కఠిన ఆంక్షలు

టాప్ హెడ్ లైన్స్

Breaking News:పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
Yograj VS Kapil Dev Controversy: యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
Mbappe VS Paraguayan Senator: ఎంబాప్పేపై పరాగ్వే మహిళా సెనేటర్ తిట్ల పురాణం.. జైల్లో పెడతానంటూ ఓపెన్ వార్నింగ్, ఫ్రెంచ్ కోచ్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్!
ఎంబాప్పేపై పరాగ్వే మహిళా సెనేటర్ తిట్ల పురాణం.. జైల్లో పెడతానంటూ ఓపెన్ వార్నింగ్, ఫ్రెంచ్ కోచ్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్!
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Embed widget