అన్వేషించండి

Maoists Another proposal: ఫిబ్రవరికల్లా ఆయుధాలు వదిలేస్తాం వేటాడవద్దు - 3 రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టుల బహిరంగ లేఖ!

Maoists : ఆయుధాలను వదిలేస్తామని సమయం ఇవ్వాలని మావోయిస్టులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. కానీ కేంద్రం మార్చి 31వరకు డెడ్ లైన్ పెట్టుకుంది.

Maoists  letters to government: ఆపరేషన్ కగార్‌తో కకావికలం అవుతున్న మావోయిస్టులు చివరి ప్రయత్నంగా మరో సారి ప్రభుత్వాలకు లేఖలు రాశారు.  మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు తాత్కాలికంగా నిలిపివేస్తే, ఆయుధాలు  వదిలేస్తామని ప్రతిపాదించారు. 

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట విడుదలైన ఈ లేఖలో, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. దేశం, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ, సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, ఆయుధాలు త్యజించాలని పార్టీ నాయకత్వం ఇటీవల తీర్మానించిందని లేఖలో తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యులు సతీశ్  , చంద్రన్న కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారని, ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం ఆయుధాలు వదిలేయాలని భావిస్తోందని పేర్కొన్నారు.

అయితే, ఈ నిర్ణయాన్ని సమష్టిగా అమలు చేయడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు.  పార్టీ  సహచరులను సంప్రదించి పద్ధతి ప్రకారం సందేశాలు తెలియజేయడానికి కొంత సమయం పడుతుందని వివరించారు. ఈ సమయాన్ని అడగడానికి ఇతర ఉద్దేశాలు లేవని, త్వరగా కమ్యూనికేట్ చేయడానికి వేరే సులభ మార్గాలు లేకపోవడమే కారణమని స్పష్టం చేశారు.
 
లేఖలో మావోయిస్టులు భద్రతా బలగాలు తమ కార్యకలాపాలు నిలిపివేస్తే, మా అన్ని కార్యకలాపాలను పూర్తిగా నిలిపేస్తామని హామీ ఇచ్చారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలను  నిర్వహించబోమని, ఆయుధాలు త్యజించే తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ హామీతో పాటు, మూడు రాష్ట్రాల్లోని భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు తాత్కాలికంగా ఆపేసి, మావోయిస్టులకు సమయం కల్పించాలని కోరారు.                    
 
గత కొన్ని రోజులుగా ఛత్తీస్‌గఢ్‌లోనే గతేడాది 200కి పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించారు.   పార్టీ కేంద్ర కమిటీ నుంచి వచ్చిన ఈ నిర్ణయం, మావోయిస్టు ఉద్యమానికి ముగింపుగా మారవచ్చని భావిస్తున్నారు. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు లేదా కేంద్ర భద్రతా సంస్థలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే కేంద్రం మాత్రం ఎలాంటి మినహాయిపులు ఇచ్చేది లేదని.. అయితే లొంగిపోవాలి లేకపోతే ఎన్ కౌంటర్ కావాలన్నట్లుగా పాలసీ తీసుకుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.              

మావోయిస్టు పార్టీలో అగ్రనేతలంతా వరుసగా హ తమవుతున్నారు.  అనేక కీలక దాడులకు నేతృత్వం వహించిన హిడ్మా లాంటి వాళ్లు కూడా ఎన్ కౌంటర్ కావడంతో మిగిలిన వారు భరోసాగా ఉండలేకపోతున్నారు. మారుతున్న పరిస్థితుల్లో ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలన్న సూచనలు ఎక్కువగా వస్తున్నాయి.  లేకపోతే మార్చి 31 నాటికి నక్సలైట్లు అనే వాళ్లు లేకుండా నిర్మూలిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో అందరూ ఫిబ్రవరి వరకూ గడువు ఇస్తే ఆయుధాలు వదిలేస్తామని సంకేతాలు పంపించారు. కానీ ప్రభుత్వాల వైపు నుంచి స్పందన రావడం మాత్రం అసాధ్యం అనుకోవచ్చు.       

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
Embed widget