అన్వేషించండి

Maoists Another proposal: ఫిబ్రవరికల్లా ఆయుధాలు వదిలేస్తాం వేటాడవద్దు - 3 రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టుల బహిరంగ లేఖ!

Maoists : ఆయుధాలను వదిలేస్తామని సమయం ఇవ్వాలని మావోయిస్టులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. కానీ కేంద్రం మార్చి 31వరకు డెడ్ లైన్ పెట్టుకుంది.

Maoists  letters to government: ఆపరేషన్ కగార్‌తో కకావికలం అవుతున్న మావోయిస్టులు చివరి ప్రయత్నంగా మరో సారి ప్రభుత్వాలకు లేఖలు రాశారు.  మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు తాత్కాలికంగా నిలిపివేస్తే, ఆయుధాలు  వదిలేస్తామని ప్రతిపాదించారు. 

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట విడుదలైన ఈ లేఖలో, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. దేశం, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ, సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, ఆయుధాలు త్యజించాలని పార్టీ నాయకత్వం ఇటీవల తీర్మానించిందని లేఖలో తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యులు సతీశ్  , చంద్రన్న కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారని, ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం ఆయుధాలు వదిలేయాలని భావిస్తోందని పేర్కొన్నారు.

అయితే, ఈ నిర్ణయాన్ని సమష్టిగా అమలు చేయడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు.  పార్టీ  సహచరులను సంప్రదించి పద్ధతి ప్రకారం సందేశాలు తెలియజేయడానికి కొంత సమయం పడుతుందని వివరించారు. ఈ సమయాన్ని అడగడానికి ఇతర ఉద్దేశాలు లేవని, త్వరగా కమ్యూనికేట్ చేయడానికి వేరే సులభ మార్గాలు లేకపోవడమే కారణమని స్పష్టం చేశారు.
 
లేఖలో మావోయిస్టులు భద్రతా బలగాలు తమ కార్యకలాపాలు నిలిపివేస్తే, మా అన్ని కార్యకలాపాలను పూర్తిగా నిలిపేస్తామని హామీ ఇచ్చారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలను  నిర్వహించబోమని, ఆయుధాలు త్యజించే తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ హామీతో పాటు, మూడు రాష్ట్రాల్లోని భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు తాత్కాలికంగా ఆపేసి, మావోయిస్టులకు సమయం కల్పించాలని కోరారు.                    
 
గత కొన్ని రోజులుగా ఛత్తీస్‌గఢ్‌లోనే గతేడాది 200కి పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించారు.   పార్టీ కేంద్ర కమిటీ నుంచి వచ్చిన ఈ నిర్ణయం, మావోయిస్టు ఉద్యమానికి ముగింపుగా మారవచ్చని భావిస్తున్నారు. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు లేదా కేంద్ర భద్రతా సంస్థలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే కేంద్రం మాత్రం ఎలాంటి మినహాయిపులు ఇచ్చేది లేదని.. అయితే లొంగిపోవాలి లేకపోతే ఎన్ కౌంటర్ కావాలన్నట్లుగా పాలసీ తీసుకుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.              

మావోయిస్టు పార్టీలో అగ్రనేతలంతా వరుసగా హ తమవుతున్నారు.  అనేక కీలక దాడులకు నేతృత్వం వహించిన హిడ్మా లాంటి వాళ్లు కూడా ఎన్ కౌంటర్ కావడంతో మిగిలిన వారు భరోసాగా ఉండలేకపోతున్నారు. మారుతున్న పరిస్థితుల్లో ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలన్న సూచనలు ఎక్కువగా వస్తున్నాయి.  లేకపోతే మార్చి 31 నాటికి నక్సలైట్లు అనే వాళ్లు లేకుండా నిర్మూలిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో అందరూ ఫిబ్రవరి వరకూ గడువు ఇస్తే ఆయుధాలు వదిలేస్తామని సంకేతాలు పంపించారు. కానీ ప్రభుత్వాల వైపు నుంచి స్పందన రావడం మాత్రం అసాధ్యం అనుకోవచ్చు.       

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: గోల్కొండలో బాలికపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న యువకుడు.. పిలిచి సత్కరించిన సీపీ సజ్జనార్
గోల్కొండలో బాలికపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న యువకుడు.. పిలిచి సత్కరించిన సీపీ సజ్జనార్
Podharillu Serial Today April 7th:మాధవ్‌ పెళ్లి చూపులు ఏమయ్యాయి..? అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారా లేదా...?
పొదరిల్లు: మాధవ్‌ పెళ్లి చూపులు ఏమయ్యాయి..? అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారా లేదా...?
Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!

వీడియోలు

Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్
CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Embed widget