అన్వేషించండి

Lok Sabha Elections 2024: అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహమిదే, ఆచితూచి అడుగులు

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ ఓ వ్యూహాన్ని అనుసరిస్తోంది.

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంది. టార్గెట్ 370 ని సాధించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. అందుకే...అభ్యర్థుల ఎంపిక నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థనే తయారు చేసుకుంది. ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకునేందుకు ఓ టీమ్‌ని ఏర్పాటు చేసింది. అంతే కాదు. అంతర్గతంగా ఎన్నో చర్చలు జరిపింది. ఎన్నో లెక్కలు వేసుకుంది. వీటితో పాటు ఉన్నత స్థాయిలో సమావేశాలు నిర్వహించింది. అప్పుడు కానీ అభ్యర్థులను ఎంపిక చేయలేదు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫిబ్రవరి 29న రాత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాని ఫైనలైజ్ చేయడంపై చర్చించారు. అయితే..అంతకు ముందు క్షేత్రస్థాయిలో నుంచి ఒక్కో అభ్యర్థి గురించి ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంది బీజేపీ. ఇందుకు Namo Appని వినియోగించుకుంది. స్థానిక ఎంపీ పని తీరు ఎలా ఉందో చెప్పాలంటూ ఒపీనియన్ పోల్ పెట్టింది. అంతే కాదు. ఒక్కో ప్రాంతంలో ప్రజలకు ఎక్కువగా నచ్చిన ముగ్గురు నేతల పేర్లను సేకరించింది. స్థానిక ప్రజలకు ఆయా నేతలు ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు..? వాళ్ల పని తీరు ఎలా ఉంది..? అనే కోణాల్లో అభిప్రాయాలు సేకరించింది. దాదాపు రెండేళ్లుగా ఈ ఫీడ్‌బ్యాక్‌ ప్రక్రియని కొనసాగిస్తూనే ఉంది బీజేపీ. కేవలం ఈ ఫీడ్‌బ్యాక్‌పైనే ఆధారపడకుండా కొన్ని సర్వే ఏజెన్సీలనూ రంగంలోకి దింపింది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో సర్వే చేయించింది. 

కొంత మంది మంత్రులకూ ఈ పని పురమాయించింది హైకమాండ్. పార్లమెంట్ నియోజకవర్గాలకు వెళ్లి అక్కడి ఎంపీలకు ఏ మేర చరిష్మా ఉందో తెలుసుకోవాలని తేల్చి చెప్పింది. ఇలా సర్వే ఏజెన్సీలు,మంత్రులు, ప్రజలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అభ్యర్థుల జాబితాని సిద్ధం చేసుకుంది. ఎంపీల పని తీరు అత్తెసరుగా ఉందని తెలిస్తే వాళ్లకి మరోసారి టికెట్‌ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోడవం లేదని తెలుస్తోంది. దాదాపు 60-70 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్‌ దక్కకపోవచ్చని సమాచారం. వాళ్ల స్థానంలో కొత్త వారికి అవకాశాలిస్తారని తెలుస్తోంది. OBC వర్గానికి చెందిన వాళ్లకే ఎక్కువగా టికెట్‌లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ 85 మంది OBCలకే ఎంపీ టికెట్‌లు ఇచ్చింది. ఈ సారీ అదే ఫార్ములాని అనుసరించనుంది. రాత్రి 11 గంటల వరకూ మేధోమథనం చేసిన హైకమాండ్...2019లో సాధించిన స్థానాల కన్నా కచ్చితంగా ఎక్కువగా గెలుచుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 370కి తక్కువ కాకుండా చూసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ వరుస పెట్టి పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేస్తున్నారు. పదేళ్లలో ఎంతో చేశామని ప్రచారం మొదలు పెట్టారు. అటు అమిత్ షా కూడా ప్రచారానికి అంతా సిద్ధం చేస్తున్నారు. 

Also Read: BJP Parliament Candidate List : నేడే వంద మంది బీజేపీ పార్లమెంట్ సభ్యుల తొలి జాబితా- తెలంగాణ నుంచి 9 పేర్లు ఉండే అవకాశం!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోనున్న టీడీపీ
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోనున్న టీడీపీ
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ABP Desam Smart Ed Conclave 2026: జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉండాలి, రిస్క్ లేకపోతే లైఫ్ లేదు: స్కోప్ సీఈవో అప్పల్ల సాయికిరణ్
జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉంటే చాలు - ABP Desam Smart Ed Conclave లో అప్పల్ల సాయికిరణ్

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోనున్న టీడీపీ
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోనున్న టీడీపీ
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget