అన్వేషించండి

KRMB Projects : తెలంగాణ ప్రాజెక్టులిస్తేనే తామిస్తామన్న ఏపీ ! కేఆర్ఎంబీ గెజిట్ అమలుపై మళ్లీ మొదటికొచ్చిన వివాదం !

కేఆర్ఎంబీ గెజిట్ అమలు చేయడానికి ప్రాజెక్టుల్ని అప్పగించడానికి రెండు ప్రభుత్వాలు సిద్దంగా లేవు. తెలంగాణ ఇస్తే తామిస్తామటూ ఏపీ జీవో జారీ చేసింది. తెలంగాణ కమిటీ వేసింది.

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు గెజిట్ నోటిఫికేషన్ అమలుపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. అమలుకు అంగీకరిస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు జారీ చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం ఓ జీవో జారీ చేసింది.  శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఆరు కాంపోనెంట్‌లను అప్పగించేందుకు జీవోలో అంగీకారం తెలిపింది. అయితే ఇక్కడ ఓ షరతు పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం 9 కాంపోనెంట్‌లను అప్పగించిన వెంటనే తాము ఆరు కాంపోనెంట్‌లను ఇస్తామని ఏపీ ప్రభుత్వం జీవోలో తెలిపింది. ఆఫీస్‌లు, సిబ్బంది, ప్లాంట్‌, ఎక్విప్‌మెంట్‌ అప్పగించేందుకు అంగీకారం తెలిపింది. జూరాలతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని.. లేదంటే తమకు ఇబ్బందులు వస్తాయని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి స్పష్టం చేసింది. 

Also Read : రాజకీయ విమర్శలపై ప్రతిపక్షాలు, మీడియాకు ఏపీ డీజీపీ పరువు నష్టం నోటీసులు ! దేశంలోనే మొదటి సారి !

అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. సీఎం సహా ఉన్నతాధికారులతో మరోసారి చర్చించిన తర్వాతే ప్రాజెక్టుల అప్పగింతపై ముందడుగు వేసే అవకాశం ఉంది. అందుకే  కేఆర్‌ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ మరింత సమయం తీసుకునే అవకాశం కనిపిస్ోతంది ఈఎస్సీ మురళీధర్‌రావు ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. ఈ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే తెలంగాణ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా విద్యుత్ ప్రాజెక్టులు చేర్చడంపైనే రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడుతోంది. 

Also Read : టీఆర్ఎస్‌కు ఆదాయం ఎక్కువ.. టీడీపీకి ఖర్చెక్కువ ! ప్రాంతీయ పార్టీల జమాఖర్చుల్లో చిత్రాలెన్నో !

ప్రభుత్వాల నిర్ణయం ఎలా ఉన్నా ఈ నెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి వస్తుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు రోజుల కిందటే కటించింది. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకోనున్నట్లు కేఆర్‌ఎంబీ తెలిపింది.  శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. ప్రాజెక్టుల వారీగా సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా ముసాయిదా తయారు చేసింది. 

Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని నియమించడం.. తెలంగాణ ఇస్తే తామిస్తామంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో  .. ఇప్పుడు కృష్ణా బోర్డు ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.  దసరా రోజు నుంచి గెజిట్ అమలు ప్రారంభమవుతుందని ఇప్పటికే ప్రకటించింది. ఈ జల వివాదాలు కేఆర్ఎంబీ గెజిట్ విడుదలైన తర్వాత కూడా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలాఖరుకు పీఆర్సీ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Samson Explosive Fifty: అఫ్గాన్‌ను చిత్తు చేసి సిరీస్ కొల్లగొట్టిన భారత్, శ్రేయ‌స్ ఖాతాలో స్వదేశంలో తొలి ట్రోఫీ .. స‌త్తా చాటిన నితీశ్, అభిషేక్, ఇషాన్..
అఫ్గాన్‌ను చిత్తు చేసి సిరీస్ కొల్లగొట్టిన భారత్, శ్రేయ‌స్ ఖాతాలో స్వదేశంలో తొలి ట్రోఫీ .. స‌త్తా చాటిన నితీశ్, అభిషేక్, ఇషాన్..
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Embed widget