అన్వేషించండి

PM Road Accident Relief Scheme: రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

PM Rahat Yojana | ప్రధానమంత్రి సహాయ పథకం కింద, ప్రమాదం జరిగిన తేదీ నుండి 7 రోజుల వరకు ఒక్కొక్కరికి ఆస్పత్రి ఖర్చులు ₹1.5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది.

PM Rahat Yojana Cashless Treatment | న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానినరేంద్ర మోదీ 'పీఎం రాహత్' (PM Rahat) పథకానికి ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి 7 రోజుల పాటు గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందుతుంది.

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలోని ఏ కేటగిరీ రహదారిపై ప్రమాదం జరిగినా, అర్హులైన ప్రతి బాధితుడికి PM Rahat Yojana పథకం వర్తిస్తుంది. అంటే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు లేదా గ్రామీణ రోడ్లు - ఇలా ఏ ప్రాంతంలో ప్రమాదం జరిగినా బాధితులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. పీఎం రాహత్ పథకం కింద ఎవరికైనా సరే ప్రమాదం బాధితులకు నిర్ణీత మొత్తం వరకు ఉచిత చికిత్స అందుతుంది. అయితే పథకం రూల్స్ ఇక్కడ తెలుసుకోండి. 

పీఎం రాహత్ పథకానికి సంబంధించిన రూల్స్ 
పీఎం రాహత్ పథకం కింద, ప్రమాదం జరిగిన రోజు నుండి 7 రోజుల వరకు ఒక్కో వ్యక్తికి 1.5 లక్షల రూపాయల వరకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ చెల్లింపు నేరుగా మోటారు వాహనాల ప్రమాద నిధి (Motor Vehicle Accident Fund) నుండి ఆసుపత్రికి వెళ్తుంది. ఈ పథకం కింద ప్రాణాపాయం లేని కేసుల్లో గరిష్టంగా 24 గంటల వరకు, తీవ్రమైన కేసుల్లో 48 గంటల వరకు 'స్టెబిలైజేషన్' చికిత్స అందించనున్నారు. ఆ తర్వాత కూడా 7 రోజుల వ్యవధిలోపు క్యాష్‌లెస్‌ చికిత్స అందుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. దీనికి పోలీసు ధృవీకరణ అవసరం అవుతుంది. సాధారణ కేసుల్లో 24 గంటల లోపు, తీవ్రమైన కేసుల్లో 48 గంటల లోపు పోలీసుల నిర్ధారణ జరగాలి. తద్వారా చికిత్స అందించడంలో ఎటువంటి ఆటంకం కలగకుండా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతుంది. 

గోల్డెన్ అవర్‌లో చికిత్సపై ప్రాధాన్యత
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో ప్రతి ఏటా వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో చాలా మంది సకాలంలో చికిత్స అందకపోవడం వల్లే చనిపోతున్నారు. ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్) లోపు గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చగలిగితే సుమారు 50 శాతం మరణాలను నివారించవచ్చని పరిశోధనల్లో తేలింది. ఈ లక్ష్యంతోనే 112 హెల్ప్‌లైన్ ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌తో అనుసంధానం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులు, బాటసారులు లేదా అక్కడ ఉన్న ఎవరైనా సరే 112 నెంబర్‌కు డయల్ చేసి సమీపంలోని ఆసుపత్రి వివరాలను తెలుసుకోవచ్చు. బాధితుల కోసం అంబులెన్స్ సహాయం కోరవచ్చు.

ఏడు రోజుల గడువు ముగిసిన తర్వాత కూడా బాధితుడి పరిస్థితి విషమంగా ఉంటే, మెరుగైన చికిత్సను వారి వ్యక్తిగత భీమా (Health Insurance) లేదా ఇతర ప్రభుత్వ పథకాల (ఆయుష్మాన్ భారత్ వంటివి) కిందకు మార్చుకునే వీలుంది. పీఎం రాహత్ పథకం అమలులో నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) కీలక పాత్ర పోషిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
International Women Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ హక్కులేంటో తెలుసుకోండి; ప్రతి స్త్రీకి ఇవి చాలా అవసరం!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ హక్కులేంటో తెలుసుకోండి; ప్రతి స్త్రీకి ఇవి చాలా అవసరం!
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Former CMs in Union Cabinet: కేంద్ర కేబినెట్‌లో మాజీ సీఎంలే ఎక్కువ - నితీష్‌తో కలిపి ఎనిమిది మంది - తర్వాత చంద్రబాబూ కలుస్తారా?
కేంద్ర కేబినెట్‌లో మాజీ సీఎంలే ఎక్కువ - నితీష్‌తో కలిపి ఎనిమిది మంది - తర్వాత చంద్రబాబూ కలుస్తారా?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget