By: ABP Desam | Updated at : 26 Jun 2023 03:03 PM (IST)
Edited By: jyothi
కోతులను తరిమికొట్టడానికి ఎలుగుబంటి వేషం, ప్రతి కుటుంబం నుంచి రోజుకొకరు ( Image Source : ANI Twitter )
UP Farmers: దుక్కి దున్నింది మొదలు పంట చేతికి వచ్చే మార్కెట్ కు వెళ్లి డబ్బు చేతిలో పడే వరకూ రైతులు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు. కల్తీ విత్తనాలు, వర్షాలు లేకపోవడం లేదంటే పంట కొట్టుకుపోయేలా కురవడం, పంటకు పురుగు ఆశించడం, ఎరువుల ధరలు పెరగడం, పంట కోతలో ఇబ్బందులు, మార్కెట్ల మాయాజాలం, దళారుల దోపిడీ ఇలా ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటే గానీ రైతు చేతికి పంట డబ్బులు రావు. ఆరుగాలం శ్రమిస్తే గానీ బుక్కెడు బువ్వ దొరకదు. కల్తీ విత్తనాలను దాటుకుని, పురుగు ఆశించకుండా కాపాడుకుంటూ పంట మంచి దిగుబడి వచ్చేలా కష్టపడితే.. పందులు, కోతులు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యకు ఉత్తరప్రదేశ్ లోని లఖింపుర్ ఖేరి ప్రాంత రైతులు చూపిన పరిష్కారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Uttar Pradesh | Farmers in Lakhimpur Kheri's Jahan Nagar village use a bear costume to prevent monkeys from damaging their sugarcane crop
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 25, 2023
40-45 monkeys are roaming in the area and damaging the crops. We appealed to authorities but no attention was paid. So we (farmers)… pic.twitter.com/IBlsvECB2A
కోతుల నుంచి పంటను రక్షించుకునేందుకు ఉత్తరప్రదేశ్ లోని లఖింపుర్ ఖేరి రైతులు వినూత్న ఆలోచన చేశారు. కోతులు పంటను నాశనం చేస్తున్నాయని, ఆ సమస్యకు పరిష్కారం చూపాలని లఖింపుర్ ఖేరి రైతులు ఎన్నో సార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. కానీ ఎప్పట్లాగే వారి నుంచి ఎలాంటి సాయం అందలేదు. పంట ఏపుగా పెరిగింది, దిగుబడి చక్కగా వస్తుందని సంబరపడే లోపే కోతులు వచ్చి పంటను నాశనం చేస్తూ అవస్థల పాలు చేస్తున్నాయి. ఈ సమస్యతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు వారే ఓ పరిష్కారం కనుగొన్నారు. అవసరం ఆవిష్కరణకు కన్న తల్లి వంటిది అనే నానుడిని నిజం చేస్తూ.. లఖింపుర్ ఖేరి రైతులు చేసిన ఆలోచన ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకుంటోంది.
లఖింపుర్ ఖేరిలోని జహాన్ నగర్ గ్రామానికి చెందిన రైతులు స్వయంగా ఎలుగుబంటి దుస్తులు కొనుగోలు చేశారు. ఆ ఎలుగు బంటి దుస్తులు ధరించి పొలాల్లో కూర్చుంటున్నారు. ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో వస్తున్న కోతులు పంటను నాశనం చేస్తుండటంతో ఈ ఆలోచన చేశామని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇలా ఎలుగుబంటి వేషం వేసుకుని పొలాల్లో కూర్చుంటే కోతులు భయపడి అటు వైపు రావడం లేదని అన్నదాతులు తెలిపారు. అయితే రైతుల కుటుంబంలో నుంచి రోజుకొకరి చొప్పున ఇలా వేషం వేసుకుని పొలాల్లో తిరుగుతున్నారు. రూ. 4 వేల రూపాయలు పెట్టిన కొన్న ఈ ఎలుగుబంటి దుస్తులతో మంచి ఫలితం వస్తోందని, కోతులు అటు వైపు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే అని, అధికారులు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా ఎలుగుబంటి వేషం వేసుకుని పొలాల్లో కూర్చుంటే ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా కోతులు గుంపుగా వచ్చి దాడి చేసే ప్రమాదం ఉంటుందని స్థానికులు భయపడుతున్నారు. ఆలోపు అధికారులు తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.
Cyclone Michaung Updates: మిగ్జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు
Manipur Violence: మణిపూర్లో మళ్లీ అలజడి, రెండు తెగల మధ్య కాల్పులు - 13 మంది మృతి
Mizoram Election Results 2023: ఒకప్పుడు ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్, ఇప్పుడు మిజోరం సీఎం - ఎవరీ లల్దుహోమ?
Chandrababu Srisailam Tour: మిగ్జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Sleeping on Floor Benefits : అసలు నేలమీద పడుకుంటే ఎంత మంచిదో తెలుసా?
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
/body>