అన్వేషించండి

Online Gaming Ban: బెట్టింగ్ యాప్స్‌కు దిబిడి దిబిడే- ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం!

Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీలపై దృష్టి పెడుతుంది. కొత్త బిల్లులో ఆన్లైన్ గేమింగ్ నిషేధం ఉంది.

 Online Gaming Bill:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను శిక్షార్హమైన నేరంగా మారనుంది. ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టవచ్చు. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ద్వారా ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రిస్తారు. ఈ చర్యతో లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలపై దృష్టి సారించనున్నారు. దీంతో గేమింగ్ పరిశ్రమలో పారదర్శకత, నియంత్రణ పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కొత్త బిల్లులో కొన్ని ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించే నిబంధనలను కూడా చేర్చారు. అంటే వ్యసనం, ఆర్థిక నష్టం లేదా సమాజంలో అశాంతిని ప్రోత్సహించే గేమ్‌లను నిషేధించవచ్చు.

గేమింగ్ పరిశ్రమపై ప్రభావం

ఈ బిల్లు ఉద్దేశ్యం ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో నియమాలను నిర్ణయించడం, వినియోగదారులకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడం. ప్రస్తుతం, గేమింగ్ కంపెనీలపై స్పష్టమైన నిబంధనలు లేకపోవడం వల్ల వినియోగదారులు తరచుగా దోపిడీకి గురవుతున్నారు. మోసాలకు గురవుతున్నారు.

కొత్త చట్టం వచ్చిన తర్వాత, కోట్ల మంది వినియోగదారులు చురుకుగా ఉన్న భారతదేశ ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఎటువంటి నిబంధనలు లేకుండా వర్చువల్ మనీ, రియల్ క్యాష్ గేమ్‌లు లేదా బెట్టింగ్‌కు సంబంధించిన గేమ్‌లను నడుపుతున్న కంపెనీలు తమ విధానాలను మార్చుకోవాలి.

ఏయే గేమ్‌లపై నిషేధం విధించవచ్చు?

జూదం లేదా బెట్టింగ్‌ను ప్రోత్సహించే గేమ్‌లను నిషేధించే నిబంధన బిల్లులో ఉంది. వర్చువల్ మనీ లేదా రియల్ క్యాష్ బెట్టింగ్‌పై ఆధారపడి ఉంటాయి. ఆటగాళ్ల వ్యసనాన్ని పెంచే గేమ్‌లు,  ఆర్థికంగా నష్టాన్ని కలిగించే గేమ్స్‌పై కొరడా ఝలిపించనున్నారు. హింసాత్మక లేదా అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోనున్నారు. రూల్స్ పాటించకుండా సమాజంపై ప్రభావం చూపే  ఇలాంటి గేమ్‌లను నడుపుతున్న కంపెనీలపై నేరుగా ప్రభావం చూపుతుంది.

భారతదేశ ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ దాదాపు 3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది.  అటువంటి పరిస్థితిలో, కొత్త చట్టం నిజమైన కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అదే సమయంలో, పరిశ్రమ ఇప్పుడు చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లో ప నిచేయడం వల్ల విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం కూడా పెరుగుతుంది.

దీంతోపాటు రాజస్థాన్‌లోని కోట-బుండిలో రూ.1507 కోట్లతో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. కటక్ -భువనేశ్వర్‌ మధ్య ఆరు లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ రింగ్ రోడ్డు నిర్మించడానికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుకు రూ.8,307 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, "రాజస్థాన్‌లోని కోట-బుండి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని రూ.1,507 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ టెర్మినల్ భవనం 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 3200 మీటర్ల పొడవైన రన్‌వేతో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం సంవత్సరానికి 20 లక్షల మంది ప్రయాణికులు ఉంటారు. 2 సంవత్సరాలలోపు దీన్ని పూర్తి చేయడమే లక్ష్యం. "2014 వరకు భారతదేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయి. గత 11 సంవత్సరాలలో ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైంది" అని అన్నారు. "ఇప్పుడు భారతదేశంలో 162 క్రియాశీల విమానాశ్రయాలు ఉన్నాయి."

కోటా-బుండి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం గురించి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, "కోటా ఒక పారిశ్రామిక, విద్యా కేంద్రం. విద్యా రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు కోటాను క్రమం తప్పకుండా సందర్శిస్తారు. ఇక్కడ విమానాశ్రయం కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఉన్న విమానాశ్రయం పాతది. అందుతే అప్‌డేట్‌ అవసరం."

ఒడిశాలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM)లో రూ. 8,307.74 కోట్ల వ్యయంతో 6-లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ క్యాపిటల్ రీజియన్ రింగ్ రోడ్ (భువనేశ్వర్ బైపాస్ - 110.875 కి.మీ) నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. "ఈ ప్రాజెక్టును 6-లేన్ యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవేగా అభివృద్ధి చేయాలని  ప్రతిపాదన ఉంది. ఇది కటక్, భువనేశ్వర్, ఖోర్ధా నగరాల్లో నివసించే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది" అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
Elephant damages cars Thrissur: త్రిస్సూర్‌లో గజరాజు భీభత్సం - కారును ఫుట్‌బాల్‌లా ఆడేసుకున్న ఏనుగు.. మహిళ ప్రాణాలతో ఎలా బయటపడిందంటే?
త్రిస్సూర్‌లో గజరాజు భీభత్సం - కారును ఫుట్‌బాల్‌లా ఆడేసుకున్న ఏనుగు.. మహిళ ప్రాణాలతో ఎలా బయటపడిందంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Embed widget