Trisha Krishnan Vijay : విజయ్కు సపోర్ట్గా త్రిష పోస్ట్! - వదినమ్మా అంటూ ఫ్యాన్స్ సందడి
Trisha Vote : ఓటు వేసిన తర్వాత హీరోయిన్ త్రిష చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. టీవీకే అధినేత, నటుడు విజయ్కు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసేలా పోస్ట్ ఉండడం హాట్ టాపిక్గా మారింది.

Trisha Supports TVK Vijay After Casting Her Vote Insta Post Gone Viral : తమిళనాడు ఎన్నికల్లో అందరి దృష్టి దళపతి విజయ్ టీవీకే పార్టీపైనే ఉంది. తొలిసారి ఎన్నికల బరిలో నిలవగా ఫలితం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ అటు ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ వర్గాల్లోనూ ఉంది. ఇదే టైంలో హీరోయిన్ త్రిష చేసిన తాజా ఇన్ స్టా పోస్ట్ వైరల్ అవుతోంది.
విజయ్కు సపోర్ట్గా...
త్రిష విజయ్ను పరోక్షంగా సపోర్ట్ చేసిన పోస్ట్పై ఇప్పుడు నెట్టింట చర్చ సాగుతోంది. గురువారం ఉదయం చెన్నైలోని అభిరామపురంలోని సెయింట్ ఫ్రావిన్స్ జేవియర్ మిడిల్ స్కూల్లో తన తల్లితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు త్రిష. ఆ తర్వాత తన ఇన్ స్టాలో తన వేలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తూ ఫోటో దిగారు.
ఆ ఫోటోకు ఆమె పెట్టిన పాట ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. విజయ్తో కలిసి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'గిల్లి'లోని 'అర్జునర్ విల్లు' అనే పాటను జత చేశారు. అందులో కేవలం వేలికి విజల్ గుర్తు వేసి ఆ ఈలలు వినిపించే పార్ట్ మాత్రమే యాడ్ చేశారు. టీవీకే విజయ్ను పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్లే ఈ పోస్ట్ ఉండడంతో నెట్టింట కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
View this post on Instagram
Also Read : ప్రకృతి ఒడిలో సెలబ్రిటీస్ - ఇండియాస్ ఫస్ట్ ట్రావెల్ బేస్డ్ టాక్ షో... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
గత కొంతకాలంగా విజయ్, త్రిషల మధ్య రిలేషన్ షిప్ రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఓ నటితో వివాహేతర సంబంధం కారణంగానే తాను డివోర్స్ కోరుతున్నట్లు విజయ్ భార్య సంగీత కోర్టులో పిటిషన్ వేశారు. ఈ విడాకుల గొడవలు జరుగుతుండగానే విజయ్, త్రిష ఇద్దరూ ఓ పెళ్లిలో కలిసి కనిపించండం ఆ రూమర్స్కు మరింత బలం చేకూరినట్లయింది. ఆ తర్వాత విజయ్ ఎలక్షన్ క్యాంపెయిన్లో బిజీ అయిపోయారు.
వదినమ్మ అంటూ...
ఇప్పుడు తాజాగా... విజయ్ను సపోర్ట్ చేసేలా త్రిష పోస్ట్ ఉండడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. 'వదినమ్మ' అన్నకు సపోర్ట్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్, త్రిష ఇద్దరూ కలిసి హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. 'గిల్లి', 'తిరుపాచ్చి', 'కురువి', 'లియో' వంటి సినిమాల్లో నటించారు. అయితే, రిలేషన్ షిప్ రూమర్స్, ఆ ప్రచారంపై ఇద్దరూ ఎప్పుడూ బహిరంగంగా నోరు మెదపలేదు. ప్రస్తుతం త్రిష చేసిన పోస్ట్ మాత్రం పెద్ద చర్చకే దారి తీసింది.
ఇక, తమిళనాడు ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 82.24 శాతం పోలింగ్ నమోదైంది. టీవీకే అధినేత విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్ నుంచి పోటీలో నిలిచారు. రజనీ కాంత్, కమల్ హాసన్, శ్రుతి హాసన్, విక్రమ్, విజయ్ సేతుపతి, ధ్రువ్ విక్రమ్, సుహాసిని మణిరత్నం, ఖుష్బూ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Before You Go
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
ట్రెండింగ్ వార్తలు























