By: ABP Desam | Updated at : 27 Apr 2022 09:49 AM (IST)
తంజావూరులో భారీ అగ్ని ప్రమాదం (Photo Credit: Twitter/ANI)
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. రథోత్సవం నిర్వహిస్తుండగా జరిగిన భారీ అగ్ని ప్రమాదం (Thanjavur Fire Accident)లో 11 మంది సజీవదహనం అయ్యారు. మరికొంత మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో చిన్నారు కూడా ఉన్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తంజావూరులోని కలిమేడు అప్పర్ ఆలయ రథోత్సవం నిర్వహిస్తుండగా హై టెన్షన్ విద్యుత్ తీగలకు రథం తాకడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి భక్తులు సజీవ దహనం అయ్యారని స్థానిక పోలీసులు జాతీయ మీడియా ఏఎన్ఐకి తెలిపారు. బుధవారం వేకువజామున ఈ విషాదం జరిగింది.
వేకువజామున తీవ్ర విషాదం..
తంజావూరులోని కలిమేడు అప్పర్ ఆలయంలో గురుపూజై సందర్భంగా స్వామివారికి ఆలయ నిర్వాకులు రథోత్సవం (Temple chariot procession) నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి ఉత్సవం ప్రారంభం కాగా, బుధవారం వేకువజామున భక్తులు రథాన్ని లాగుతుండగా ఒక్కసారిగా హై టెన్షన్ విద్యుత్ తీగలను తాకింది. షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రథం వద్ద ఉన్న భక్తులు కొందరు సజీవదహనం అయ్యారు. మరో 15 మంది వరకు కాలిన గాయాలతో తంజావూరు ఆసుపత్రిలో చేరారు.
#UPDATE | Tamil Nadu: 11 people lost their lives in Thanjavur district during a temple chariot procession after it came into contact with a live wire.
— ANI (@ANI) April 27, 2022
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
రథోత్సవంలో అపశ్రుతిపై తిరుచిరాపల్లి సెంట్రల్ జోన్ ఐజీ వి బాలక్రిష్ణన్ స్పందించారు. రథాన్ని లాగుతున్న భక్తులు , నిర్వాహకులు విద్యుత్ తీగలను గమనించలేదు. రథం పెద్దదిగా ఉండటంతో రథం హై టెన్షన్ తీగలను తగలడంతో అగ్ని ప్రమాదం సంభవించి విషాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. రథోత్సవంలో అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనం కాగా, కాలిన గాయాలైన కొందరు భక్తులను చికిత్స నిమిత్తం తంజావూరు మెడికల్ కాలేజీకి తరలించినట్లు చెప్పారు.
Also Read: Madanapalle Crime : ఈజీ మనీ కోసం యువకుడి స్కెచ్, ప్లాన్ రివర్స్ అయి పోలీసులకు చిక్కాడు
Also Read: Women Death Mystery : చనిపోయిందని ఏడ్చారు కానీ మమ్మీ రిటర్న్స్ ! ఈవిడ కథలో స్టన్నింగ్ సీక్రెట్స్
IFFCO Notification: ఇఫ్కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు
One Nation One Election: కోవింద్ అధ్యక్షతన తొలి భేటీ- పార్టీలు, లా కమిషన్ సూచనలు ఆహ్వానించనున్న ప్యానెల్
అవయవ దానం చేస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, స్టాలిన్ సంచలన నిర్ణయం
Chandrayaan-3: చంద్రుడు, అంగారక గ్రహాలపై భారత్కు శాశ్వత నివాసం ఉండాలి: ఇస్రో చీఫ్
Rahul Gandhi: 'మహిళా కోటా కోసం పదేళ్లు ఆగాలా? కుల గణనకు భయమెందుకు మోదీజీ? ' - రాహుల్ గాంధీ
Etela Rajender: గ్రూప్ 1 పరీక్ష రద్దు- తెలంగాణ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఫైర్
Chandrababu Arrest: పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు - వారికి విజయవాడ సీపీ వార్నింగ్
Sagileti Katha Movie : రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?
మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియల్లో అపశృతి, గన్ మిస్ ఫైర్
/body>