అన్వేషించండి

Vande Bharat: వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

Vande Bharat: వారణాసి -ఢిల్లీ మధ్య తిరిగే వందే భారత్ కొత్త సిరీస్ ని కూడా మోదీ ప్రారంభించడం విశేషం. ఈ కొత్త సిరీస్ ట్రైన్ లో 20 కోచ్ లు ఉంటాయి.

వికసిత్ భారత్ కోసం వికసిత్ రైల్ ఇన్ ఫ్రా.. అనే నినాదంతో భారతీయ రైల్వే పలు కొత్త రైళ్లను ప్రవేశ పెడుతోంది. ఇందులో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ నుంచి ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు ప్రధాని మోదీ. వాస్తవానికి అహ్మదాబాద్ - భుజ్ మధ్య తిరిగే నమో భారత్ ర్యాపిడ్ రైల్ ను ఆయన ప్రత్యక్షంగా ప్రారంభించగా.. మిగతా ఆరు వందే భారత్ రైళ్లను వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రెండు వందే భారత్ రైళ్లు ఉండటం విశేషం. 

గాంధీ ధామ్ - ఆదిపూర్.. క్వాడ్రప్లింగ్ ప్రాజెక్ట్, సమాఖియలి - గాంధీ ధామ్ క్వాడ్రప్లింగ్ ప్రాజెక్ట్ లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం నమో భారత్ ర్యాపిడ్ రైల్ ని ప్రారంభించారు. వందే భారత్ మెట్రో రైల్ గా ఉన్న దీన్ని ఇకపై నమో భారత్ ర్యాపిడ్ రైల్ గా పిలుస్తారు. దేశంలోనే ఇది తొలి వందే భారత్ మెట్రో సర్వీస్. అంటే మెట్రో నగరాల మధ్య తిరిగే వందే భారత్. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఇది మిగతా వందేభారత్ ట్రైన్స్ లా కాదు. ఇది పూర్తిగా అన్ రిజర్వ్డ్ ట్రైన్. అయితే అన్నీ ఏసీ బోగీలే ఉంటాయి. ఇందులో 1150 మంది కూర్చుని ప్రయాణించే వీలు ఉంటుంది. 2058 మంది వరకు నిలబడి ఎలాంటి రద్దీ లేకుండా ప్రయాణించవచ్చు. పశ్చిమ రైల్వే పరిధిలో ఈ నమో భారత్ ర్యాపిడ్ రైల్ ని మోదీ ప్రారంభించారు. అహ్మదాబాద్ - భుజ్‌ మధ్య ఈ రైలు సర్వీస్ ఉంటుంది. మధ్యలో 9 స్టాపులుంటాయి. అహ్మదాబాద్ - భుజ్ మధ్య 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు. ప్రతి రోజు ఉదయం భుజ్‌లో 5.05 గంటలకు నమో భారత్ ర్యాపిడ్ రైల్ ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్‌  కు ఉదయం 10.50 గంటలకు చేరుకుంటుంది. సాదారణ రైళ్లకు టికెట్లు తీసుకున్నట్టే రైలు బయలుదేరడానికి ముందు ప్రయాణికులు టికెట్‌ కొనుక్కుని ఈ రేలు ఎక్కొచ్చు. ఇందులో మినిమమ్ టికెట్‌ ధర రూ.30గా నిర్ణయించారు. 

ఇక ఈ రైలుతోపాటు.. ఆరు వందే భారత్ రైళ్లను కూడా ఈరోజు మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. 
నాగ్ పూర్ - సికింద్రాబాద్
దుర్గ్ - విశాఖపట్నం
కొల్హాపూర్ - పుణె
ఆగ్రా -బెనారస్
పుణె -హుబ్లి
మధ్య నడిచే వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభించారు. వీటితోపాటు వారణాసి -ఢిల్లీ మధ్య తిరిగే వందే భారత్ కొత్త సిరీస్ ని కూడా మోదీ ప్రారంభించడం విశేషం. ఈ కొత్త సిరీస్ ట్రైన్ లో 20 కోచ్ లు ఉంటాయి. ఇప్పటి వరకు వందే భారత్ ట్రైన్స్ లో 8 లేదా 16 కోచ్ లు మాత్రమే ఉండేవి. కొత్తగా తీసుకొచ్చిన వందే భారత్ లో 20 కోచ్ లు ఉంటాయి. దీన్ని ప్రస్తుతం వారణాసి - ఢిల్లీకి మాత్రమే పరిమితం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని 20 కోచ్ ల ట్రైన్లు అందుబాటులోకి తెస్తారని అంచనా. 

Also Read: వంద రోజుల పాలన అద్భుతం- ప్రతి సెక్టార్‌లో ప్రగతి: మోదీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

పోలీసులు, అంబులెన్స్ కు ఫోన్ చేయకుండా.. జనాలు ఫోన్లో వీడియో తీస్తున్నారు:  కర్నూలు ప్రమాదంపై ప్రత్యక్షసాక్షి
పోలీసులు, అంబులెన్స్ కు ఫోన్ చేయకుండా.. జనాలు ఫోన్లో వీడియో తీస్తున్నారు: ప్రత్యక్షసాక్షి
Kurnool Bus Mishap Exgratia: కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
Baahubali The Epic : 'బాహుబలి: ది ఎపిక్' ప్రమోషన్లకు దూరంగా 'దేవసేన'! - జస్ట్ వెయిట్ ఫర్ బిగ్ సర్‌ప్రైజ్
'బాహుబలి: ది ఎపిక్' ప్రమోషన్లకు దూరంగా 'దేవసేన'! - జస్ట్ వెయిట్ ఫర్ బిగ్ సర్‌ప్రైజ్
Advertisement

వీడియోలు

Vizag Google Data Centre Controversy | వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై ప్రశ్నలకు సమాధానాలేవి..? | ABP
Aus vs Ind 2nd ODI Highlights | రెండు వికెట్ల తేడాతో భారత్ పై రెండో వన్డేలోనూ నెగ్గిన ఆసీస్ | ABP Desam
Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam
కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
పోలీసులు, అంబులెన్స్ కు ఫోన్ చేయకుండా.. జనాలు ఫోన్లో వీడియో తీస్తున్నారు:  కర్నూలు ప్రమాదంపై ప్రత్యక్షసాక్షి
పోలీసులు, అంబులెన్స్ కు ఫోన్ చేయకుండా.. జనాలు ఫోన్లో వీడియో తీస్తున్నారు: ప్రత్యక్షసాక్షి
Kurnool Bus Mishap Exgratia: కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
Baahubali The Epic : 'బాహుబలి: ది ఎపిక్' ప్రమోషన్లకు దూరంగా 'దేవసేన'! - జస్ట్ వెయిట్ ఫర్ బిగ్ సర్‌ప్రైజ్
'బాహుబలి: ది ఎపిక్' ప్రమోషన్లకు దూరంగా 'దేవసేన'! - జస్ట్ వెయిట్ ఫర్ బిగ్ సర్‌ప్రైజ్
Gold: 18 క్యారెట్ల ఆభరణాలను 22 క్యారెట్లుగా చెప్పి అమ్ముతున్న బంగారం వ్యాపారులు, మోసాన్ని గుర్తించేదెలా?
18 క్యారెట్ల ఆభరణాలను 22 క్యారెట్లుగా చెప్పి అమ్ముతున్న బంగారం వ్యాపారులు, మోసాన్ని గుర్తించేదెలా?
DNA Test For Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
Param Sundari OTT: ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ 'పరమ్ సుందరి' - నో రెంట్... ఫ్రీగా చూసెయ్యొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ 'పరమ్ సుందరి' - నో రెంట్... ఫ్రీగా చూసెయ్యొచ్చు
Telangana Cabinet Decisions: బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
Embed widget