అన్వేషించండి

Pahalgam Attack Anniversary: భారత్ ఉగ్రవాదానికి ఎప్పటికీ తలవంచదు.. పహల్గామ్ దాడికి ఏడాది సందర్భంగా పాక్‌కు ప్రధాని మోదీ అల్టిమేటం

Pahalgam Attack Anniversary: గత ఏడాది ఏప్రిల్ 22న పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ 'లష్కర్-ఎ-తైబా' (LeT)కు చెందిన ఉగ్రవాదులు పహల్గామ్‌లోని బైసారన్ లోయలో కాల్పులు జరిపి 26 మందిని చంపేశారు.

Pahalgam Attack Anniversary: న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరన్ లోయలో పాక్ ఉగ్రదాడికి ఏడాది పూర్తవుతోంది. పహల్గామ్ దాడి ఏడాది సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతులను స్మరించుకుంటూ, వారిని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఏ రకమైన ఉగ్రవాదానికైనా భారత్ ఎన్నటికీ తలవంచదని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల కుట్రలు ఎన్నటికీ విజయవంతం కావని, ఈ కష్ట సమయంలో అమరులైన వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. బాధితుల కుటుంబాలకు కేంద్రం తోడుగా ఉంటుందని పేర్కొన్నారు.

పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.  ‘గతేడాది ఇదే రోజున (ఏప్రిల్ 22న) పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పౌరులను గుర్తు చేసుకుంటున్నాను. ఆ ఘటనను, అమరులైన వారిని ఎన్నటికీ మర్చిపోలేం. ఈ విచారకర సమయంలో బాధితుల కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నాను. మనమంతా ఒక దేశంగా ఈ కష్టకాలంలో దృఢ సంకల్పంతో ఒక్కటిగా ఉన్నాం. భారత్ ఎలాంటి ఉగ్రవాదానికైనా ఎప్పటికీ తలవంచదు. ఉగ్రవాదుల కుట్రలు భారత్ ఛేదిస్తుంది. ఉగ్రవాడుల పన్నాగాలు ఎన్నటికీ నెరవేరవు’ అని పేర్కొన్నారు. 

మృతుల జ్ఞాపకార్థం పహల్గామ్‌లో స్మారక నిర్మాణం
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించగా.. వీరిలో ఒకరు విదేశీయుడు ఉన్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించేందుకు అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. లిద్దర్ నది ఒడ్డున నల్లరాతితో నిర్మించిన ఈ స్మారకంపై 26 మంది మృతుల పేర్లు చెక్కారు. ఈ భయానక ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రాంతంలో భద్రతను కూడా పెంచారు.

మతం అడిగి మరీ కాల్చి చంపిన ఉన్మాదులు 
2025 ఏప్రిల్ 22న పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదులు పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీకి విహారానికి వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు ప్రజల పేర్లు, మతం అడిగి తెలుసుకుని, మహిళలు, పిల్లల ముందే వారిని కాల్చి చంపేశారు. మీ మోదీకి చెప్పుకోండి అని అంటూ అమాయకుల్ని కాల్చి చంపడాన్ని దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు, పాకిస్థాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

ఆపరేషన్ సిందూర్‌తో 100 మందికి పైగా ఉగ్రవాదుల హతం
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి పీఓకేతో పాటు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పీఓకే, పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని భారత ప్రభుత్వం పేర్కొంది. 2025 జూలై 28న 'ఆపరేషన్ మహాదేవ్' కింద పహల్గామ్‌లో కాల్పులు జరిపిన ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget