PM Modi Mann Ki Baat: మన్కీ బాత్లో అనంతపురం ప్రజలను ప్రశంసించిన ప్రధాని మోదీ.. రీజన్ ఏంటంటే..
Anantapur in Mann Ki Baat | ఈ ఏడాది తొలి మన్కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ అనంతపురం ప్రజల శ్రమను అభినందించారు. ఓటు ప్రాముఖ్యతను, రిపబ్లిక్ డే ప్రాధాన్యతను వివరించారు.

Republic Day 2026 | న్యూఢిల్లీ: 2026 సంవత్సరంలో తొలి "మన్ కీ బాత్" కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ప్రజలపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఈరోజు (జనవరి 25) మన్కీ బాత్లో భాగంగా ప్రధాని మోదీ పలు అంశాలను ప్రస్తావిస్తూ దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. ఇది 2026 సంవత్సరంలో తొలి "మన్ కీ బాత్" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రేపు, జనవరి 26న యావత్ భారతావని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆ రోజున మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. జనవరి 26న మన రాజ్యాంగ వ్యవస్థాపకులకు నివాళులు అర్పించే అవకాశాన్ని కల్పిస్తుంది.
People's movement that revived water bodies in Andhra Pradesh's Anantapur. #MannKiBaat pic.twitter.com/UXhAQKbttU
— PMO India (@PMOIndia) January 25, 2026
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గురించి మన్కీ బాత్ లో మోదీ ప్రస్తావించారు. అనంతపురం తీవ్రమైన కరువుతో ఇబ్బంది పడుతోందని, అక్కడ నేల కారణంగా, నదుల ప్రవాహం లేని కారణంగా నీటి కొరతకు దారితీసిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, స్థానికులు జలాశయాలను పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టారు. ఏపీ ప్రభుత్వ మద్దతుతో, "అనంత నీరు రక్షణ ప్రాజెక్ట్" ప్రారంభించారు. ఈ ప్రయత్నం ఫలితంగా 10 కి పైగా జలాశయాలను పునరుద్ధరించారు. 7,000 కి పైగా చెట్లు నాటారని మోదీ పేర్కొన్నారు. వర్షపాతం తక్కువగా ఉండటంతో ప్రజలు నీటి సమస్య ఎదుర్కొంటుంటారని.. అయితే జిల్లా ప్రజలు ఎంతగానో శ్రమించి జలాశయాలను పునరుద్ధరించేకోవడం ఇతర ప్రాంతాలకు నిదర్శనమని ప్రశంసించారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25 కూడా చాలా ముఖ్యమైన రోజు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఓటర్లు ప్రజాస్వామ్యానికి ఆత్మ లాంటివారు. ఒక యువకుడు మొదటిసారి ఓటరుగా మారినప్పుడల్లా, మొత్తం పొరుగు ప్రాంతం, గ్రామం లేదా నగరం వారిని అభినందించడానికి ఐక్యంగా ఉండాలి. యువ ఓటర్లను ప్రోత్సహించి ఓటు వేసేలా చేయడం ద్వారా అవగాహన పెరుగుతుంది. కనుక 18 ఏళ్లు నిండిన తర్వాత యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.
తంసా నది గురించి ప్రధాని మోదీ ఏమన్నారు..
నదుల గురించి మోదీ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్లోని అజమ్గఢ్ గుండా ప్రవహించే తంసా నదికి ప్రజలు కొత్త జీవితాన్ని ఇచ్చారని అన్నారు. అయోధ్యలో ఉద్భవించి గంగానదిలో కలిసే ఈ నది ఒకప్పుడు ఈ ప్రాంత ప్రజల జీవనానికి కేంద్రబిందువుగా ఉండేది. అయితే, కాలుష్యం నది ప్రవాహానికి అంతరాయం కలిగించింది. స్థానికులు తంసా నదిని పునరుద్ధరించడానికి ప్రచారాన్ని ప్రారంభించారు. నదిని శుభ్రం చేయడం, దాని ఒడ్డున ఫలాలను ఇచ్చే చెట్లను నాటుతున్నారు. స్థానిక ప్రజలు ఈ పనిలో పాల్గొని నది కోసం శ్రమించి పనిని విజయవంతం చేస్తున్నారని మోదీ కొనియాడారు.
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్
ప్రపంచంలో భారతదేశం నేడు మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా అవతరించిందని ప్రధాని మోదీ అన్నారు. స్టార్టప్ ఇండియా యొక్క ఈ అద్భుతమైన ప్రయాణంలో హీరోలు మన యువ స్నేహితులు. వారి కంఫర్ట్ జోన్ల నుండి బయటపడటం ద్వారా వారు చేసిన ఆవిష్కరణలు చరిత్రలో నమోదు అవుతున్నాయి. AI, స్పేస్, న్యూక్లియర్ ఎనర్జీ, సెమీకండక్టర్స్, మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, బయోటెక్నాలజీ, మీరు దానిని పేరు పెట్టండి, మరియు ఆ రంగంలో పనిచేసే భారతీయ స్టార్టప్ను మీరు కనుగొంటారు.
ట్రెండింగ్ వార్తలు























