అన్వేషించండి

PM Modi: భారత్ అధ్యక్షతన BRICS కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది, ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

BRICS Summit 2025 | ఉగ్రవాదంపై పోరాడాలని బ్రిక్స్ దేశాలు పాల్గొన్న సదస్సులో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇది మానవాళికి అతిపెద్ద శత్రువని, ఉగ్రవాదాన్ని సహించేది లేదన్నారు.

PM Modi at BRICS Summit 2025: బ్రెజిల్ లోని రియో ​​డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన దేశ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. భారతదేశానికి బ్రిక్స్ అధ్యక్ష పదవి వచ్చినప్పుడు, 'సహకారం, స్థిరత్వం కోసం బలం, ఆవిష్కరణ' అనే కొత్త ఆలోచనతో ముందుకు సాగుతామన్నారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘భారతదేశం అధ్యక్షతన జరిగే బ్రిక్స్ సదస్సు గ్లోబల్ సౌత్ కు ప్రాధాన్యతనిస్తుంది. బ్రిక్స్ అంటే సహకారం, స్థిరత్వం కోసం స్థితిస్థాపకత. సరికొత్త ఆవిష్కరణలు చేయడం’ అని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితి, డబ్ల్యూటీవో లాంటి ప్రపంచ సంస్థలు కాలం చెల్లినవిగా పేర్కొన్న మోదీ.. అవి ఈ శతాబ్దానికి పనికి రావన్నారు.

భారతదేశంతో బ్రిక్స్ కు కొత్త గుర్తింపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారతదేశ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ సౌత్ కు ప్రాధాన్యత లభిస్తుంది. ప్రపంచంలో సహకారం, బలం,  స్థిరత్వాన్ని ప్రోత్సహించే కొత్త లక్ష్యాన్ని సిద్ధం చేస్తుంది. ఇది కేవలం ఒక వేదిక మాత్రమే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు కేంద్రం బ్రిక్స్ సదస్సు. కొన్ని దేశాలు వాతావరణ మార్పులను కేవలం గణాంకాల్లో చూస్తున్నాయి. భారతదేశం మాత్రం దానిని తన సంస్కృతిలో భాగం చేసుకుంది.

భారతదేశానికి వాతావరణ న్యాయం అనేది ఒక ఎంపిక కాదు, నైతిక బాధ్యత. ఎందుకంటే పర్యావరణం, మానవుల ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో భవిష్యత్తు గురించి కనిపించే ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఉండాలి. కోవిడ్19 మహమ్మారిని గుర్తుంచుకోవాలి. ఈ సంక్షోభం, వైరస్ వీసాతో రాదు.  పరిష్కారాలు పాస్ పోర్ట్ చూసి ఎన్నుకోబడవని మహమ్మారి మనకు నేర్పించిందని’ అన్నారు.

చిన్న దేశాల గొంతు బలంగా వినిపిస్తుంది
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలలో చిన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలను గొంతుక వినాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ పేర్కొన్నారు. అందరికీ సమాన హక్కులు, భాగస్వామ్యం లభించాలని భారత్ సమర్థిస్తుందని అన్నారు. సమావేశంలో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై కూడా చర్చించారు. ఈ సాంకేతికత కేవలం ధనిక దేశాలకే పరిమితం కాకుండా అన్ని దేశాలకు అందుబాటులోకి రావాలని మోదీ అన్నారు.

ఉగ్రవాదంపై మోదీ సందేశం
నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం నేడు మొత్తం మానవాళికి అతిపెద్ద ముప్పుగా మారింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాని మోదీ ప్రస్తావించారు. ఇది కేవలం భారతదేశంపై జరిగిన దాడిగా కాకుండా మొత్తం ప్రపంచంపై జరిగిన ఉగ్రదాడి  దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదానికి డబ్బు, శిక్షణ లేదా ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు. ఈ విషయంలో ఎటువంటి ద్వంద్వ వైఖరి ఉండరాదు. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించినందుకు బ్రిక్స్ దేశాలకు ప్రధాని మోదీ, భారత్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. 

ఉగ్రవాదంపై అంతా ఏకం కావాలి..
ఉగ్రవాదంపై ఇంకా సహనం చూపించవద్దని, టెర్రరిజంపై పోరాటం కేవలం భారతదేశానిది మాత్రమే కాదు, ఇది మొత్తం ప్రపంచ దేశాల బాధ్యత అని ప్రధాని మోదీ అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
Karnataka Congress MLAs Resign: కర్ణాటక కాంగ్రెస్‌లో తిరుగుబాటు జ్వాల - క్యాబినెట్‌లో చోటు దక్కక ఎమ్మెల్యేల రాజీనామాలు!
కర్ణాటక కాంగ్రెస్‌లో తిరుగుబాటు జ్వాల - క్యాబినెట్‌లో చోటు దక్కక ఎమ్మెల్యేల రాజీనామాలు!
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget