అన్వేషించండి

PM Modi: భారత్ అధ్యక్షతన BRICS కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది, ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

BRICS Summit 2025 | ఉగ్రవాదంపై పోరాడాలని బ్రిక్స్ దేశాలు పాల్గొన్న సదస్సులో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇది మానవాళికి అతిపెద్ద శత్రువని, ఉగ్రవాదాన్ని సహించేది లేదన్నారు.

PM Modi at BRICS Summit 2025: బ్రెజిల్ లోని రియో ​​డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన దేశ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. భారతదేశానికి బ్రిక్స్ అధ్యక్ష పదవి వచ్చినప్పుడు, 'సహకారం, స్థిరత్వం కోసం బలం, ఆవిష్కరణ' అనే కొత్త ఆలోచనతో ముందుకు సాగుతామన్నారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘భారతదేశం అధ్యక్షతన జరిగే బ్రిక్స్ సదస్సు గ్లోబల్ సౌత్ కు ప్రాధాన్యతనిస్తుంది. బ్రిక్స్ అంటే సహకారం, స్థిరత్వం కోసం స్థితిస్థాపకత. సరికొత్త ఆవిష్కరణలు చేయడం’ అని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితి, డబ్ల్యూటీవో లాంటి ప్రపంచ సంస్థలు కాలం చెల్లినవిగా పేర్కొన్న మోదీ.. అవి ఈ శతాబ్దానికి పనికి రావన్నారు.

భారతదేశంతో బ్రిక్స్ కు కొత్త గుర్తింపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారతదేశ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ సౌత్ కు ప్రాధాన్యత లభిస్తుంది. ప్రపంచంలో సహకారం, బలం,  స్థిరత్వాన్ని ప్రోత్సహించే కొత్త లక్ష్యాన్ని సిద్ధం చేస్తుంది. ఇది కేవలం ఒక వేదిక మాత్రమే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు కేంద్రం బ్రిక్స్ సదస్సు. కొన్ని దేశాలు వాతావరణ మార్పులను కేవలం గణాంకాల్లో చూస్తున్నాయి. భారతదేశం మాత్రం దానిని తన సంస్కృతిలో భాగం చేసుకుంది.

భారతదేశానికి వాతావరణ న్యాయం అనేది ఒక ఎంపిక కాదు, నైతిక బాధ్యత. ఎందుకంటే పర్యావరణం, మానవుల ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో భవిష్యత్తు గురించి కనిపించే ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఉండాలి. కోవిడ్19 మహమ్మారిని గుర్తుంచుకోవాలి. ఈ సంక్షోభం, వైరస్ వీసాతో రాదు.  పరిష్కారాలు పాస్ పోర్ట్ చూసి ఎన్నుకోబడవని మహమ్మారి మనకు నేర్పించిందని’ అన్నారు.

చిన్న దేశాల గొంతు బలంగా వినిపిస్తుంది
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలలో చిన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలను గొంతుక వినాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ పేర్కొన్నారు. అందరికీ సమాన హక్కులు, భాగస్వామ్యం లభించాలని భారత్ సమర్థిస్తుందని అన్నారు. సమావేశంలో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై కూడా చర్చించారు. ఈ సాంకేతికత కేవలం ధనిక దేశాలకే పరిమితం కాకుండా అన్ని దేశాలకు అందుబాటులోకి రావాలని మోదీ అన్నారు.

ఉగ్రవాదంపై మోదీ సందేశం
నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం నేడు మొత్తం మానవాళికి అతిపెద్ద ముప్పుగా మారింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాని మోదీ ప్రస్తావించారు. ఇది కేవలం భారతదేశంపై జరిగిన దాడిగా కాకుండా మొత్తం ప్రపంచంపై జరిగిన ఉగ్రదాడి  దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదానికి డబ్బు, శిక్షణ లేదా ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు. ఈ విషయంలో ఎటువంటి ద్వంద్వ వైఖరి ఉండరాదు. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించినందుకు బ్రిక్స్ దేశాలకు ప్రధాని మోదీ, భారత్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. 

ఉగ్రవాదంపై అంతా ఏకం కావాలి..
ఉగ్రవాదంపై ఇంకా సహనం చూపించవద్దని, టెర్రరిజంపై పోరాటం కేవలం భారతదేశానిది మాత్రమే కాదు, ఇది మొత్తం ప్రపంచ దేశాల బాధ్యత అని ప్రధాని మోదీ అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Scindia Royal Family Property Dispute Settlement: 40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Prashant Kishor Electoral Debut: వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget