PM Modi: గ్లోబల్ సౌత్ వివక్షకు గురైంది! ఐక్యరాజ్యసమితి, WTOలో సంస్కరణలు రావాలి: ప్రధాని మోదీ
17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని మోదీ ప్రపంచ సంస్థలలో సంస్కరణలు రావాలని కోరారు. అవి కాలం చెల్లినవిగా, గ్లోబల్ సౌత్ కు ప్రాతినిధ్యం వహించనివిగా పేర్కొన్నారు.

PM Modi At BRICS Summit | రియో డి జనీరో: ప్రపంచ సంస్థలలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు, అవి ఆధునిక రోజుల్లో తలెత్తుతున్న సవాళ్లకు సరిపోవని అన్నారు. బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్లో శాంతి, భద్రత, గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలపై ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు.
బ్రిక్స్ దేశాల నాయకులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ‘గత శతాబ్దంలో ఏర్పడిన ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు కాలం చెల్లిన స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ఎన్నో సంఘర్షణలు, మహమ్మారి నుండి ఆర్థిక సంక్షోభాలు, సైబర్ ముప్పుల వరకు సమకాలీన ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో అవి విఫలమవుతున్నాయి. 20వ శతాబ్దంలో ఏర్పడిన ప్రపంచ సంస్థలు 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోలేకపోతున్నాయి. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలు, మహమ్మారులు, ఆర్థిక సంక్షోభాలు లేదా సైబర్స్పేస్లో కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ఏవైనా, వీటి వద్ద పరిష్కారం లేదు" అని సమ్మిట్లో మోదీ అన్నారు.
గ్లోబల్ సౌత్ వెనుకబడిపోయిందన్న మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న నిర్లక్ష్యాన్ని హైలైట్ చేశారు. "గ్లోబల్ సౌత్ తరచుగా డబుల్ స్టాండర్డ్స్ కు గురైంది. అభివృద్ధి, వనరుల పంపిణీ లేదా భద్రత సంబంధిత సమస్యల గురించి గ్లోబల్ సౌత్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. వాతావరణ ఆర్థిక సహాయం, స్థిరమైన అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం వంటి సమస్యలపై, గ్లోబల్ సౌత్ తరచుగా కేవలం గుర్తుగా మాత్రమే మిగిలిపోయింది" అని అన్నారు.
The Global South has often been a victim of double standards. Their interests haven’t been given priority. On pressing issues like climate finance, sustainable development and technology access, the Global South has often received nothing more than token gestures.
— Narendra Modi (@narendramodi) July 6, 2025
సమగ్రమైన, బహుళ అవసరాన్ని నొక్కి చెబుతూ ఇలా అన్నారు, "నేడు, ప్రపంచానికి కొత్త, బహుళ, సమగ్ర ప్రపంచ క్రమం ఉండాలి. ఇది ప్రపంచ సంస్థలలో సమగ్ర సంస్కరణలతో ప్రారంభం కావాలి. సంస్కరణలు కేవలం సాంకేతికంగా ఉండకూడదు, ప్రభావం కూడా కనిపించాలి."
నిర్ణయం తీసుకోవడంలో మూడింట రెండు వంతుల మందికి ప్రాతినిధ్యం లేదన్నారు. ప్రధాని మోదీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరించే దేశాలు ఈ కీలక వేదికల నుంచి మినహాయించారని పేర్కొన్నారు. "20వ శతాబ్దంలో ఏర్పడిన ప్రపంచ సంస్థలలో మానవాళిలో మూడింట రెండు వంతుల మందికి తగిన ప్రాతినిధ్యం లేదు. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సహకారం అందించే దేశాలకు నిర్ణయం తీసుకునే జాబితాలో చోటు దక్కలేదు. కేవలం ప్రాతినిధ్యం ప్రశ్న మాత్రమే కాదు, విశ్వసనీయత, ప్రభావశీలతకు సంబంధించిన ప్రశ్న. గ్లోబల్ సౌత్ లేకుండా, ఈ సంస్థలు సిమ్ కార్డ్ ఉన్న మొబైల్ లాగా ఉన్నాయి.. కానీ నెట్వర్క్ లేదు" అని ఎద్దేవా చేశారు.
టైప్రైటర్లతో 21వ శతాబ్దపు సాఫ్ట్వేర్ను వాడలేం: ప్రధాని మోదీ
మార్పు అత్యవసరాన్ని మోదీ పునరుద్ఘాటించారు. "AI యుగంలో, సాంకేతికత ప్రతి వారం అప్డేట్ అవుతున్నప్పుడు, 80 సంవత్సరాలలో ఒక్కసారైనా గ్లోబల్ సంస్థ అప్డేట్ కాకపోవడం ఆమోదయోగ్యం కాదు. 21 శతాబ్దపు సాఫ్ట్వేర్ను 20 శతాబ్దపు టైప్రైటర్ అమలు చేయలేదు."
In this era of AI, where technology updates on a weekly basis, it is unacceptable that global institutions haven’t undergone an update even once in eighty years.
— Narendra Modi (@narendramodi) July 6, 2025
21st-century software can’t run on a 20th-century typewriter!
బ్రిక్స్ అనుకూలతను హైలైట్ చేశారు. "బ్రిక్స్ విస్తరణ, కొత్త స్నేహితుల చేరిక బ్రిక్స్ అనేది కాలానికి అనుగుణంగా మారగల ఒక సంస్థ అని నిరూపిస్తుంది. ఇప్పుడు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, WTO, అభివృద్ధి బ్యాంకులు వంటి సంస్థలలో సంస్కరణల కోసం అదే సంకల్పం చూపించాలి" అన్నారు.
The expansion of BRICS clearly shows that BRICS is an organization capable of changing itself with the times. Now, we need to show the same resolve for reforms in institutions like the UN Security Council, WTO, and multilateral development banks.
— Narendra Modi (@narendramodi) July 6, 2025
జులై 6, 7 జూలై తేదీల్లో బ్రెజిల్లో జరుగుతున్న 17వ బ్రిక్స్ సమ్మిట్లో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నాయకులతో పాటు కొత్త సభ్యులు ఈజిప్ట్, యూఏఈ, ఇండోనేషియా, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా దేశాల నాయకులు పాల్గొన్నారు.
బ్రిక్స్ కుటుంబ చిత్రం
ప్రధాన మంత్రి మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఇతర నాయకులు రియో డి జనీరోలోని మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో బ్రిక్స్ ఫ్యామిలీ ఫోటో సెషన్లో పాల్గొన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ X లో ఈ బృందం "ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి, సాధారణ విలువలను ప్రోత్సహించడానికి సామూహిక నిబద్ధత"ను ధృవీకరించింది అన్నారు.
A collective commitment to addressing global challenges & promoting common values.
— Randhir Jaiswal (@MEAIndia) July 6, 2025
PM @narendramodi joined the Leaders from the BRICS countries for the family photo at the 17th BRICS Summit in Rio de Janeiro, Brazil.#BRICS2025 pic.twitter.com/gugWvDtD4P
ఆన్లైన్లో ఈ క్షణాన్ని పంచుకుంటూ, ప్రధాని మోదీ Xలో ఇలా రాశారు, "బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన సమ్మిట్లో బ్రిక్స్ సహచరులతో కలిసి సహకారం, ఉమ్మడి వృద్ధికి మా నిబద్ధతను చాటుకుంటున్నాం. మరింత సమగ్రమైన, సమానమైన ప్రపంచ భవిష్యత్తును రూపొందించడానికి బ్రిక్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంది."
With fellow BRICS leaders at the Summit in Rio de Janeiro, Brazil, reaffirming our commitment to closer cooperation and shared growth.
— Narendra Modi (@narendramodi) July 6, 2025
BRICS holds immense potential to shape a more inclusive and equitable global future. pic.twitter.com/ftnyp8Irm7
అంతకుముందు, మోదీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసాతో సమావేశమయ్యారు. సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చినందుకు అధ్యక్షుడు లులాకు కృతజ్ఞతలు తెలిపారు. "నా స్నేహితుడు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసాతో సమావేశం జరిగింది" అని తెలిపారు. "ఈ సంవత్సరం రియో డి జనీరోలో బ్రిక్స్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చినందుకు అధ్యక్షుడు లులాకు కృతజ్ఞతలు. బ్రిక్స్ ఆర్థిక సహకారం, ప్రపంచ శ్రేయస్సు కోసం ఒక శక్తిగా ఉంది."
Good catching up with my friend, President Ramaphosa of South Africa! @CyrilRamaphosa pic.twitter.com/RT3rumnnre
— Narendra Modi (@narendramodi) July 6, 2025
బ్రిక్స్ సమ్మిట్లో, శాంతి, భద్రత, కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక విషయాలతో సహా కీలకమైన ప్రపంచ సమస్యలపై ప్రధాన మంత్రి మోదీ తన అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంది.






















