అన్వేషించండి

PM Modi Assets: నరేంద్ర మోదీ ఆస్తి విలువ ఎంతో తెలుసా! సొంతిల్లు, కారు కూడా లేని భారత ప్రధాని

PM Narendra Modi Assets: ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు.

PM Modi Properties News in Telugu: వారణాసి: గత అయిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదాయం రెట్టింపయింది. 2018-19 నుంచి 2022-23 వరకు తన ఆదాయం రెట్టింపు అయినట్లు మంగళవారం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో మోదీ తెలిపారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదాయం ప్రధాని మోదీ కంటే 4 రెట్లు ఎక్కువ అని ఎన్నికల అఫిడవిట్ వివరాలతో తేలింది. 

తన మొత్తం ఆస్తుల విలువ (PM Modi Assets) రూ. 3.02 కోట్లు అని ప్రధాని మోదీ వారణాసిలో మే 14న సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. అందులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.2,85,60,338 (2 కోట్ల 85 లక్షల 60 వేల 3 వందల 38), నగదు రూపంలో రూ.52,920 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని, సొంత కారు, భూమి, ఇల్లు లేవు అని పేర్కొనడం విశేషం.


PM Modi Assets: నరేంద్ర మోదీ ఆస్తి విలువ ఎంతో తెలుసా! సొంతిల్లు, కారు కూడా లేని భారత ప్రధాని

2018-2019లో ప్రధాని మోదీ ఆదాయం రూ.11.14 లక్షలు కాగా, 2022-23లో ఆదాయం రెండింతలు కావడంతో రూ.23.56 లక్షలకు చేరుకుంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ ఆదాయం రూ. 1.02 కోట్లుగా ఉంది. ఇది ప్రధాని మోదీ ఆదాయం కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని వారణాసి లోక్‌సభకు నామినేషన్ సందర్భంగా వెల్లడైంది. 2018-19లో రాహుల్ ఆదాయం రూ.1.20 కోట్లు, అదే ఏడాది మోదీ ఆదాయం కంటే 10 రెట్లు ఎక్కువ విలువ ఇది.

PM Modi Assets: నరేంద్ర మోదీ ఆస్తి విలువ ఎంతో తెలుసా! సొంతిల్లు, కారు కూడా లేని భారత ప్రధాని

ప్రధానమంత్రి కార్యాలయం నుంచి, బ్యాంకుల నుంచి వచ్చిన వడ్డీని ఆదాయంగా ఎన్నికల అఫిడవిట్ లో మోదీ బహిర్గతం చేశారు. గాంధీనగర్‌లోని కొంత భూమిలో తన వాటాను విరాళంగా ఇచ్చిన తరువాత మోదీ పేరిట ఎలాంటి స్థిరాస్తులు లేవని ఏబీపీ న్యూస్ గతంలోనే రిపోర్ట్ చేసింది. ప్రధాని మోదీ డిక్లరేషన్ ప్రకారం, మార్చి 31 వరకు ఆయన వద్ద రూ. 1.73 లక్షల విలువైన 4 బంగారు ఉంగరాలు ఉన్నాయి. తన పేరిట ఎలాంటి బాండ్స్, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు లేవని వెల్లడించారు. ఓవరాల్ గా ప్రధాని మోదీ ఆస్తుల విలువ 3.02 కోట్లు కాగా, రాహుల్ ఆస్తులు రూ.20 కోట్లకు పైగా ఉంది. 

వారణాసి నుంచి మూడోసారి బరిలోకి..
2014లో గుజరాత్ లోని వడోదర, యూపీలోని వారణాసి నుంచి నరేంద్ర మోదీ పోటీ చేశారు. ఆపై ప్రధాని మోదీ 2019లో కేవలం వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మాత్రమే పోటీ చేసి.. ఆరు లక్షలకుపైగా మోజార్టీతో విజయం సాధించారు. తాజాగా 2024 ఎన్నికల్లో వరుసగా మూడో పర్యాయం వారణాసి నుంచి బరిలోకి దిగుతున్న ప్రధాని మోదీ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు.

లోక్‌సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో విడతలో జూన్ 1వ తేదీన వారణాసిలో పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ నుంచి పార్టీ యూపీ అధ్యక్షుడు అజయ్ రాయ్‌, బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ ప్రధాని మోదీపై పోటీ చేస్తున్నారు. మంగళవారం నామినేషన్ కు ముందు వారణాసి లోని కాళబైరవ ఆలయానికి వెళ్లి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా మాత ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం దాదాపు ఆరు కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Embed widget