అన్వేషించండి

Pahalgam attack:భారత్‌ జవాన్‌ను బంధించిన పాక్- రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత

Pahalgam attack: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సంబంధాలను మరింతగా దెబ్బతీసింది. ఇది ఆ స్థాయికి వెళ్తుందో అన్న ఆందోళన నెలకొంది.

Pahalgam Attack: భారత్‌, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింతగా క్షీణిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఓ జవాన్ పాకిస్థాన్‌కు చిక్కాడు. పంజాబ్ సరిహద్దును అనుకోకుండా దాటిన భారత సరిహద్దు భద్రతా దళ (BSF) జవాన్‌ను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం, ఆ జవాన్ విడుదల కోసం రెండు దేశాల ఆర్మీ మధ్య చర్చలు జరుగుతున్నాయని ఒక అధికారి తెలిపారు. బుధవారం (ఏప్రిల్ 23, 2025) ఫిరోజ్‌పూర్ సరిహద్దు అవతల నుంచి 182వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ PK సింగ్‌ను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు.

పాకిస్తాన్ రేంజర్లు BSF జవాన్‌లు ఎలా పట్టుకున్నారు?
ఆ జవాన్ యూనిఫాంలో ఉన్నాడని, సర్వీస్ రైఫిల్ కూడా ఉందని అధికారి చెప్పారు. BSF జవాన్ రైతులతో ఉన్నాడని, ఓ చోట విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడని, ఆ తర్వాత అతను పాకిస్తాన్ రేంజర్ల చేతిలో చిక్కినట్టు చెప్పారు. BSF జవాన్ విడుదల కోసం రెండు దేశాల దళాల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరుగుతోందని అధికారులు తెలిపారు.

ఇలాంటి ఘటనలు అసాధారణం కాదని, ఇంతకు ముందు రెండు వైపుల మధ్య ఇలాంటి ఘటనలు జరిగాయని అధికారి తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి వేళ ఈ ఘటన జరిగిందని, ఆ తర్వాత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారతదేశం అనేక చర్యలు తీసుకుందని అధికారి తెలిపారు.

ఒకరిపై ఒకరు చర్యలు

మంగళవారం (ఏప్రిల్ 22, 2025) జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసినందుకు పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలని భారతదేశం కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు సహా ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశం ఈ కఠినమైన నిర్ణయాలను ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం గురువారం (ఏప్రిల్ 24, 2025) జాతీయ భద్రతా కమిటీ (NSC) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులు కూడా పాల్గొన్నారు.

NSC సమావేశం తర్వాత పాకిస్తాన్ ప్రతీకార నిర్ణయాలు తీసుకుంది. వాఘా సరిహద్దుమూసివేస్తున్నట్లు భారత్‌ ప్రకటించినందుకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా వాఘా సరిహద్దు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ దేశం విడిచి వెళ్లాలని భారత్‌ ఆదేశించడంతో తమ దేశంలో ఉన్న భారతీయులందరూ ఏప్రిల్ 30 నాటికి దేశం విడిచి వెళ్లాలని పాకిస్తాన్ ఆదేశించింది. పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశం నీటిని ఆపివేస్తే, దానిని యుద్ధంగా పరిగణిస్తామని పాకిస్తాన్ తెలిపింది.

పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాలు

భారతదేశంతో పాకిస్తాన్ ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా తక్షణమే నిలిపివేసింది. 

పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది.

పాకిస్తాన్ వాఘా సరిహద్దు మూసివేసింది.

పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేసింది

ఏప్రిల్ 30 నాటికి భారతీయులందరూ దేశం విడిచి వెళ్లాలని పాకిస్తాన్ ఆదేశించింది.

సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని పాకిస్తాన్ తిరస్కరించింది. ఇది 24 కోట్ల మంది పాకిస్తానీయులకు జీవనాధారమని చెప్పింది. భయపడిన భారతదేశం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని పాకిస్తాన్ ఆరోపించింది. భారత్‌ తీసుకున్న నిర్ణయం రాజకీయ ఉద్రిక్తతను పెంచుతుందని శాంతి స్థాపనకు ఆటంకం కలిగిస్తుందని పాక్ PMO విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

సింధు జల ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన అంతర్జాతీయ ఒప్పందం అని, ఏకపక్షంగా నిలిపివేయడానికి నిబంధన లేదని పాకిస్తాన్ తెలిపింది. ఉగ్రవాదాన్ని నిస్సందేహంగా ఖండిస్తున్నట్లు పాకిస్తాన్ తెలిపింది. ఈ పేరుతో పాకిస్తాన్ సార్వభౌమాధికారం,  భద్రతకు ముప్పు ఉంటే గట్టిగా స్పందిస్తామంది.

వేరే దేశాలకు లేదా అక్కడి నుంచి భారతదేశానికి వచ్చే విమానాలు తమ భూభాగం ద్వారా వెళ్లడానికి అనుమతి లేదని పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్ తమ గగనతలాన్ని బ్లాక్ చేసింది. పాకిస్తాన్ భారత హైకమిషన్‌లోని సైనిక సలహాదారులను ఏప్రిల్ 30 లోపు వెళ్లిపోవాలని కోరింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget