అన్వేషించండి

Pahalgam attack:భారత్‌ జవాన్‌ను బంధించిన పాక్- రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత

Pahalgam attack: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సంబంధాలను మరింతగా దెబ్బతీసింది. ఇది ఆ స్థాయికి వెళ్తుందో అన్న ఆందోళన నెలకొంది.

Pahalgam Attack: భారత్‌, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింతగా క్షీణిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఓ జవాన్ పాకిస్థాన్‌కు చిక్కాడు. పంజాబ్ సరిహద్దును అనుకోకుండా దాటిన భారత సరిహద్దు భద్రతా దళ (BSF) జవాన్‌ను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం, ఆ జవాన్ విడుదల కోసం రెండు దేశాల ఆర్మీ మధ్య చర్చలు జరుగుతున్నాయని ఒక అధికారి తెలిపారు. బుధవారం (ఏప్రిల్ 23, 2025) ఫిరోజ్‌పూర్ సరిహద్దు అవతల నుంచి 182వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ PK సింగ్‌ను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు.

పాకిస్తాన్ రేంజర్లు BSF జవాన్‌లు ఎలా పట్టుకున్నారు?
ఆ జవాన్ యూనిఫాంలో ఉన్నాడని, సర్వీస్ రైఫిల్ కూడా ఉందని అధికారి చెప్పారు. BSF జవాన్ రైతులతో ఉన్నాడని, ఓ చోట విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడని, ఆ తర్వాత అతను పాకిస్తాన్ రేంజర్ల చేతిలో చిక్కినట్టు చెప్పారు. BSF జవాన్ విడుదల కోసం రెండు దేశాల దళాల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరుగుతోందని అధికారులు తెలిపారు.

ఇలాంటి ఘటనలు అసాధారణం కాదని, ఇంతకు ముందు రెండు వైపుల మధ్య ఇలాంటి ఘటనలు జరిగాయని అధికారి తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి వేళ ఈ ఘటన జరిగిందని, ఆ తర్వాత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారతదేశం అనేక చర్యలు తీసుకుందని అధికారి తెలిపారు.

ఒకరిపై ఒకరు చర్యలు

మంగళవారం (ఏప్రిల్ 22, 2025) జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసినందుకు పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలని భారతదేశం కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు సహా ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశం ఈ కఠినమైన నిర్ణయాలను ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం గురువారం (ఏప్రిల్ 24, 2025) జాతీయ భద్రతా కమిటీ (NSC) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులు కూడా పాల్గొన్నారు.

NSC సమావేశం తర్వాత పాకిస్తాన్ ప్రతీకార నిర్ణయాలు తీసుకుంది. వాఘా సరిహద్దుమూసివేస్తున్నట్లు భారత్‌ ప్రకటించినందుకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా వాఘా సరిహద్దు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ దేశం విడిచి వెళ్లాలని భారత్‌ ఆదేశించడంతో తమ దేశంలో ఉన్న భారతీయులందరూ ఏప్రిల్ 30 నాటికి దేశం విడిచి వెళ్లాలని పాకిస్తాన్ ఆదేశించింది. పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశం నీటిని ఆపివేస్తే, దానిని యుద్ధంగా పరిగణిస్తామని పాకిస్తాన్ తెలిపింది.

పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాలు

భారతదేశంతో పాకిస్తాన్ ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా తక్షణమే నిలిపివేసింది. 

పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది.

పాకిస్తాన్ వాఘా సరిహద్దు మూసివేసింది.

పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేసింది

ఏప్రిల్ 30 నాటికి భారతీయులందరూ దేశం విడిచి వెళ్లాలని పాకిస్తాన్ ఆదేశించింది.

సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని పాకిస్తాన్ తిరస్కరించింది. ఇది 24 కోట్ల మంది పాకిస్తానీయులకు జీవనాధారమని చెప్పింది. భయపడిన భారతదేశం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని పాకిస్తాన్ ఆరోపించింది. భారత్‌ తీసుకున్న నిర్ణయం రాజకీయ ఉద్రిక్తతను పెంచుతుందని శాంతి స్థాపనకు ఆటంకం కలిగిస్తుందని పాక్ PMO విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

సింధు జల ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన అంతర్జాతీయ ఒప్పందం అని, ఏకపక్షంగా నిలిపివేయడానికి నిబంధన లేదని పాకిస్తాన్ తెలిపింది. ఉగ్రవాదాన్ని నిస్సందేహంగా ఖండిస్తున్నట్లు పాకిస్తాన్ తెలిపింది. ఈ పేరుతో పాకిస్తాన్ సార్వభౌమాధికారం,  భద్రతకు ముప్పు ఉంటే గట్టిగా స్పందిస్తామంది.

వేరే దేశాలకు లేదా అక్కడి నుంచి భారతదేశానికి వచ్చే విమానాలు తమ భూభాగం ద్వారా వెళ్లడానికి అనుమతి లేదని పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్ తమ గగనతలాన్ని బ్లాక్ చేసింది. పాకిస్తాన్ భారత హైకమిషన్‌లోని సైనిక సలహాదారులను ఏప్రిల్ 30 లోపు వెళ్లిపోవాలని కోరింది.

టాప్ హెడ్ లైన్స్

New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Indian Passport Fee Hike 2026: జులై 1 నుంచి పెరగనున్న పాస్‌పోర్ట్ ధరలు! ఏ కేటగిరీకి ఎంత రుసుం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
జులై 1 నుంచి పెరగనున్న పాస్‌పోర్ట్ ధరలు! ఏ కేటగిరీకి ఎంత రుసుం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
T20 World Cup - IND W Win VS BAN W: టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
Embed widget