అన్వేషించండి

Pahalgam attack:భారత్‌ జవాన్‌ను బంధించిన పాక్- రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత

Pahalgam attack: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సంబంధాలను మరింతగా దెబ్బతీసింది. ఇది ఆ స్థాయికి వెళ్తుందో అన్న ఆందోళన నెలకొంది.

Pahalgam Attack: భారత్‌, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింతగా క్షీణిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఓ జవాన్ పాకిస్థాన్‌కు చిక్కాడు. పంజాబ్ సరిహద్దును అనుకోకుండా దాటిన భారత సరిహద్దు భద్రతా దళ (BSF) జవాన్‌ను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం, ఆ జవాన్ విడుదల కోసం రెండు దేశాల ఆర్మీ మధ్య చర్చలు జరుగుతున్నాయని ఒక అధికారి తెలిపారు. బుధవారం (ఏప్రిల్ 23, 2025) ఫిరోజ్‌పూర్ సరిహద్దు అవతల నుంచి 182వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ PK సింగ్‌ను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు.

పాకిస్తాన్ రేంజర్లు BSF జవాన్‌లు ఎలా పట్టుకున్నారు?
ఆ జవాన్ యూనిఫాంలో ఉన్నాడని, సర్వీస్ రైఫిల్ కూడా ఉందని అధికారి చెప్పారు. BSF జవాన్ రైతులతో ఉన్నాడని, ఓ చోట విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడని, ఆ తర్వాత అతను పాకిస్తాన్ రేంజర్ల చేతిలో చిక్కినట్టు చెప్పారు. BSF జవాన్ విడుదల కోసం రెండు దేశాల దళాల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరుగుతోందని అధికారులు తెలిపారు.

ఇలాంటి ఘటనలు అసాధారణం కాదని, ఇంతకు ముందు రెండు వైపుల మధ్య ఇలాంటి ఘటనలు జరిగాయని అధికారి తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి వేళ ఈ ఘటన జరిగిందని, ఆ తర్వాత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారతదేశం అనేక చర్యలు తీసుకుందని అధికారి తెలిపారు.

ఒకరిపై ఒకరు చర్యలు

మంగళవారం (ఏప్రిల్ 22, 2025) జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసినందుకు పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలని భారతదేశం కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు సహా ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశం ఈ కఠినమైన నిర్ణయాలను ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం గురువారం (ఏప్రిల్ 24, 2025) జాతీయ భద్రతా కమిటీ (NSC) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులు కూడా పాల్గొన్నారు.

NSC సమావేశం తర్వాత పాకిస్తాన్ ప్రతీకార నిర్ణయాలు తీసుకుంది. వాఘా సరిహద్దుమూసివేస్తున్నట్లు భారత్‌ ప్రకటించినందుకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా వాఘా సరిహద్దు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ దేశం విడిచి వెళ్లాలని భారత్‌ ఆదేశించడంతో తమ దేశంలో ఉన్న భారతీయులందరూ ఏప్రిల్ 30 నాటికి దేశం విడిచి వెళ్లాలని పాకిస్తాన్ ఆదేశించింది. పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశం నీటిని ఆపివేస్తే, దానిని యుద్ధంగా పరిగణిస్తామని పాకిస్తాన్ తెలిపింది.

పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాలు

భారతదేశంతో పాకిస్తాన్ ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా తక్షణమే నిలిపివేసింది. 

పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది.

పాకిస్తాన్ వాఘా సరిహద్దు మూసివేసింది.

పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేసింది

ఏప్రిల్ 30 నాటికి భారతీయులందరూ దేశం విడిచి వెళ్లాలని పాకిస్తాన్ ఆదేశించింది.

సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని పాకిస్తాన్ తిరస్కరించింది. ఇది 24 కోట్ల మంది పాకిస్తానీయులకు జీవనాధారమని చెప్పింది. భయపడిన భారతదేశం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని పాకిస్తాన్ ఆరోపించింది. భారత్‌ తీసుకున్న నిర్ణయం రాజకీయ ఉద్రిక్తతను పెంచుతుందని శాంతి స్థాపనకు ఆటంకం కలిగిస్తుందని పాక్ PMO విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

సింధు జల ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన అంతర్జాతీయ ఒప్పందం అని, ఏకపక్షంగా నిలిపివేయడానికి నిబంధన లేదని పాకిస్తాన్ తెలిపింది. ఉగ్రవాదాన్ని నిస్సందేహంగా ఖండిస్తున్నట్లు పాకిస్తాన్ తెలిపింది. ఈ పేరుతో పాకిస్తాన్ సార్వభౌమాధికారం,  భద్రతకు ముప్పు ఉంటే గట్టిగా స్పందిస్తామంది.

వేరే దేశాలకు లేదా అక్కడి నుంచి భారతదేశానికి వచ్చే విమానాలు తమ భూభాగం ద్వారా వెళ్లడానికి అనుమతి లేదని పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్ తమ గగనతలాన్ని బ్లాక్ చేసింది. పాకిస్తాన్ భారత హైకమిషన్‌లోని సైనిక సలహాదారులను ఏప్రిల్ 30 లోపు వెళ్లిపోవాలని కోరింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
West Asia Tensions: గల్ఫ్‌లో యుద్ధం భారత్‌కు నష్టకాలం! నాలుగు రోజుల్లో ఎంత లాస్‌ అయ్యామంటే? 
గల్ఫ్‌లో యుద్ధం భారత్‌కు నష్టకాలం! నాలుగు రోజుల్లో ఎంత లాస్‌ అయ్యామంటే? 
Iran Israel War 2026: భారత్‌లో చమురు సంక్షోభం రాబోతోందా? కేంద్రం ఏం చెప్పింది?
భారత్‌లో చమురు సంక్షోభం రాబోతోందా? కేంద్రం ఏం చెప్పింది?
US Iran Conflict: అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?
అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Ayatollah Khomeini trap Story: సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
Embed widget