అన్వేషించండి

Pahalgam attack:భారత్‌ జవాన్‌ను బంధించిన పాక్- రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత

Pahalgam attack: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సంబంధాలను మరింతగా దెబ్బతీసింది. ఇది ఆ స్థాయికి వెళ్తుందో అన్న ఆందోళన నెలకొంది.

Pahalgam Attack: భారత్‌, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింతగా క్షీణిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఓ జవాన్ పాకిస్థాన్‌కు చిక్కాడు. పంజాబ్ సరిహద్దును అనుకోకుండా దాటిన భారత సరిహద్దు భద్రతా దళ (BSF) జవాన్‌ను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం, ఆ జవాన్ విడుదల కోసం రెండు దేశాల ఆర్మీ మధ్య చర్చలు జరుగుతున్నాయని ఒక అధికారి తెలిపారు. బుధవారం (ఏప్రిల్ 23, 2025) ఫిరోజ్‌పూర్ సరిహద్దు అవతల నుంచి 182వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ PK సింగ్‌ను పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు.

పాకిస్తాన్ రేంజర్లు BSF జవాన్‌లు ఎలా పట్టుకున్నారు?
ఆ జవాన్ యూనిఫాంలో ఉన్నాడని, సర్వీస్ రైఫిల్ కూడా ఉందని అధికారి చెప్పారు. BSF జవాన్ రైతులతో ఉన్నాడని, ఓ చోట విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడని, ఆ తర్వాత అతను పాకిస్తాన్ రేంజర్ల చేతిలో చిక్కినట్టు చెప్పారు. BSF జవాన్ విడుదల కోసం రెండు దేశాల దళాల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరుగుతోందని అధికారులు తెలిపారు.

ఇలాంటి ఘటనలు అసాధారణం కాదని, ఇంతకు ముందు రెండు వైపుల మధ్య ఇలాంటి ఘటనలు జరిగాయని అధికారి తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి వేళ ఈ ఘటన జరిగిందని, ఆ తర్వాత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారతదేశం అనేక చర్యలు తీసుకుందని అధికారి తెలిపారు.

ఒకరిపై ఒకరు చర్యలు

మంగళవారం (ఏప్రిల్ 22, 2025) జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసినందుకు పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలని భారతదేశం కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు సహా ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశం ఈ కఠినమైన నిర్ణయాలను ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం గురువారం (ఏప్రిల్ 24, 2025) జాతీయ భద్రతా కమిటీ (NSC) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులు కూడా పాల్గొన్నారు.

NSC సమావేశం తర్వాత పాకిస్తాన్ ప్రతీకార నిర్ణయాలు తీసుకుంది. వాఘా సరిహద్దుమూసివేస్తున్నట్లు భారత్‌ ప్రకటించినందుకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా వాఘా సరిహద్దు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ దేశం విడిచి వెళ్లాలని భారత్‌ ఆదేశించడంతో తమ దేశంలో ఉన్న భారతీయులందరూ ఏప్రిల్ 30 నాటికి దేశం విడిచి వెళ్లాలని పాకిస్తాన్ ఆదేశించింది. పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశం నీటిని ఆపివేస్తే, దానిని యుద్ధంగా పరిగణిస్తామని పాకిస్తాన్ తెలిపింది.

పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాలు

భారతదేశంతో పాకిస్తాన్ ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా తక్షణమే నిలిపివేసింది. 

పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది.

పాకిస్తాన్ వాఘా సరిహద్దు మూసివేసింది.

పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేసింది

ఏప్రిల్ 30 నాటికి భారతీయులందరూ దేశం విడిచి వెళ్లాలని పాకిస్తాన్ ఆదేశించింది.

సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని పాకిస్తాన్ తిరస్కరించింది. ఇది 24 కోట్ల మంది పాకిస్తానీయులకు జీవనాధారమని చెప్పింది. భయపడిన భారతదేశం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని పాకిస్తాన్ ఆరోపించింది. భారత్‌ తీసుకున్న నిర్ణయం రాజకీయ ఉద్రిక్తతను పెంచుతుందని శాంతి స్థాపనకు ఆటంకం కలిగిస్తుందని పాక్ PMO విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

సింధు జల ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన అంతర్జాతీయ ఒప్పందం అని, ఏకపక్షంగా నిలిపివేయడానికి నిబంధన లేదని పాకిస్తాన్ తెలిపింది. ఉగ్రవాదాన్ని నిస్సందేహంగా ఖండిస్తున్నట్లు పాకిస్తాన్ తెలిపింది. ఈ పేరుతో పాకిస్తాన్ సార్వభౌమాధికారం,  భద్రతకు ముప్పు ఉంటే గట్టిగా స్పందిస్తామంది.

వేరే దేశాలకు లేదా అక్కడి నుంచి భారతదేశానికి వచ్చే విమానాలు తమ భూభాగం ద్వారా వెళ్లడానికి అనుమతి లేదని పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్ తమ గగనతలాన్ని బ్లాక్ చేసింది. పాకిస్తాన్ భారత హైకమిషన్‌లోని సైనిక సలహాదారులను ఏప్రిల్ 30 లోపు వెళ్లిపోవాలని కోరింది.

టాప్ హెడ్ లైన్స్

Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
Rahul Gandhi PM Hopes: రాహుల్ ప్రధాని ఆశలకు తెలంగాణ, కర్ణాటకలే కీలక పరీక్ష - కానీ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుందా?
రాహుల్ ప్రధాని ఆశలకు తెలంగాణ, కర్ణాటకలే కీలక పరీక్ష - కానీ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుందా?
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Tamil Nadu News: ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget