అన్వేషించండి

Indian Army Video: చెప్పి మరీ దాడి చేసిన ఇండియన్ ఆర్మీ.. ఆపరేషన్ సిందూర్‌కు ముందు రిలీజ్ చేసిన వీడియో వైరల్

Operation Sindoor Indian Army: ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మొత్తం 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులకు చెక్ పెట్టాలని ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించారు.

న్యూఢిల్లీ: పహల్గాంలో ఈ ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. గత కొన్ని రోజులుగా భారత్ ప్లాన్ ఏంటో తెలియక సతమతం అవుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇప్పటికైనా ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది. భారత బలగాలు మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టాయి. 

పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌ (POK)లోని ఉగ్రవాద శిబిరాలలో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఆకస్మిక దాడులు చేశాయి. అయితే భారతదేశం ఈ  దాడులను ప్రారంభించడానికి కొన్ని నిమిషాల ముందు, భారత సైన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది. "దాడికి సిద్ధంగా ఉంది, గెలవడానికి శిక్షణ తీసుకుంది" అని ఆపరేషన్ సిందూర్ కు కొన్ని నిమిషాల ముందు ఇండియన్ ఆర్మీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

 

ఆ తరువాత కాసేపటికే భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పీఓకేలోని జైషే మహ్మద్, లష్కరే తోయిబాలకు చెందిన 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. భారత సైన్యం విజయవంతంగా దాడులు పూర్తి చేసి లక్ష్యాన్ని ఛేదించింది అని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారతదేశం ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడులకు సంబంధించి తెల్లవారుజామున 1.44 గంటలకు మరో ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదుల స్థావరాలు మట్టుపెట్టాం. పహల్గాం దాడికి ప్రతీకార చర్యలు మొదలుపెట్టామని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది చనిపోగా.. అందులో 25 మంది భారతీయులు, ఓ నేపాల్ టూరిస్ట్ ఉన్నారని కేంద్రం తెలిపింది. అయితే పహల్గాం దాడిలో చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయడానికి ప్రధాని మోదీ కొన్ని రోజుల కిందట హామీ ఇచ్చారు అందులో భాగంగా.. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతామని హింట్ ఇచ్చేందుకు ఆపరేషన్ సిందూర్‌కు శ్రీకారం చుట్టారు.

ఆపరేషన్ సిందూర్ గురించి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో పాటు కల్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్ వ్యోమికా సింగ్‌ మీడియాకు వివరించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాడులు, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థలు చేసిన దాడుల కారణంగా ముంబై దాడులు, పుల్వామా, పహల్గాం, హైదరాబాద్ లో పేలుళ్ల లాంటి ఘటనలో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇటీవల పహల్గాంలోనూ మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది ప్రాణాలు తీశారు. భారత్ మీద మరిన్ని ఉగ్రదాడులకు జైషే మహ్మద్, లష్కరే తోయిబా సంస్థలు కుట్ర పన్నాయని సమాచారం ఉందన్నారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రదాడులను ఉపేక్షించేది లేదని పాకిస్తాన్, పీఓకేలోకి వెళ్లినా కేవలం ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేసినట్లు తెలిపారు. 

 కల్నల్‌ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. అజ్మల్ కసబ్‌, డేవిడ్‌ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను సైతం ఆపరేషన్ సిందూర్ లో భాగంగా నాశనం చేశామన్నారు. మొత్తం 21 ఉగ్రవాద స్థావరాలను ఇంటెలిజెన్స్ గుర్తించగా.. అందులో అత్యంత ప్రమాదకరమైన 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేపట్టి విజయం సాధించినట్లు చెప్పారు. మురిద్కేలో గల లష్కరే తోయిబా ఉగ్రవాద క్యాంపును సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు. పాక్ పౌరులు, పాక్ సైన్యాన్ని టచ్ చేయకుండా వాటికి దూరంగా ఉన్న ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా ఆపరేషన్ నిర్వహించామని వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ చెప్పారు. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget