అన్వేషించండి

One Nation One Election : 7 దేశాల ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత రూపొందించిందే వన్‌ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు

One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20తో ముగియనున్నాయి.

One Nation One Election Bill: ఇప్పుడు దేశంలో అంతటా ఒకే విషయంపై చర్చ సాగుతోంది. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఒకే దేశం - ఒకే ఎన్నికలు అనే అంశంపై చాలా రోజులుగా చర్చ సాగుతుండగా.. ఈరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యాంగం (129సవరణ) బిల్లు 2024, కేంద్ర పాలిత చట్టాల (సవరణ) బిల్లు 2024 పెట్టాలని  ప్రభుత్వం ముందుగా జాబితా చేసింది. కానీ ఆ తరువాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఒకటే బిల్లు ప్రవేశ పెట్టింది. 

'ఒక దేశం, ఒకే ఎన్నికలు'అంటే ఏమిటి?

దాని పేరులో సూచించినట్లుగా, ఇది దేశంలో ఎన్నికల గురించి చెబుతుంది. భారతదేశంలో, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, దేశంలోని లోక్‌సభ ఎన్నికలు, పౌర, పంచాయతీ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరుగుతాయి. అయితే దేశంలో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ, పౌర ఎన్నికలు జరగాలని మోదీ ప్రభుత్వం కోరుతోంది.

వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు చాలా కాలంగా అధికార బీజేపీ అజెండాలో ఉంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను 14 మార్చి 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ప్రక్రియలో మార్పులు తీసుకురావచ్చని కమిటీ నివేదికలో పేర్కొంది.

కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే.. 

వన్ నేషన్, వన్ ఎలక్షన్ కోసం ఏర్పాటైన కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా , కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, చీఫ్ విజిలెన్స్ సభ్యులుగా ఉన్నారు. కమిషనర్‌గా సంజయ్‌ కొఠారీని చేర్చారు. దీంతో పాటు న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ నితేన్ చంద్రలను ప్రత్యేక ఆహ్వానితులుగా కమిటీలో చేర్చారు.

నివేదికను కమిటీ ఎలా సిద్ధం చేసిందంటే..

ఈ కమిటీ తన నివేదికను సిద్ధం చేయడానికి ముందు, ఈ ప్రక్రియకు వర్తించేలా 191రోజుల పాటు 7 దేశాల ఎన్నికల ప్రక్రియను అధ్యయనం చేసింది. ఈ 7 దేశాల్లో స్వీడన్, బెల్జియం, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ ఉన్నాయి.

కాంగ్రెస్ నిరసనలు

కాంగ్రెస్ మొదటి నుంచి ఒకే దేశం, ఒకే ఎన్నికలను వ్యతిరేకిస్తోంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపంలో పెనుమార్పు వస్తుందని అంటోంది. ఇది సమాఖ్య నిర్మాణానికి సంబంధించిన హామీకి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వాదిస్తోంది. కాంగ్రెస్ తో పాటు, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి మరికొన్ని పార్టీలు సైతం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.

Also Read : Jawaharlal Nehru Letter Row:నెహ్రూ లేఖ 80 ఏళ్ల త‌ర్వాత ఎందుకు సంచ‌ల‌నం రేపుతోంది? అస‌లు ఏం జ‌రిగింది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget