అన్వేషించండి

NDA CM Meeting: ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!

PM Modi Meet NDA CMs | జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రదాడిలో చనిపోయిన 26 మందికి ఎన్డీయే పక్ష సీఎంలు, డిప్యూటీ సీఎంలు నివాళులు అర్పించారు.

conclave of the NDA chief ministers and deputy CMs | న్యూఢిల్లీ: NDA పక్ష ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమయ్యారు. అంతకుముందు ఈ నేతలు ప్రధాని మోదీ మన్ కీ బాత్  'Mann Ki Baat' ప్రసంగం విన్నారు. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ముఖ్యంగా భారత సాయుధ దళాలను ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ లో త్రివిధ దళాలు ఏకమై ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేసి తమ ధైర్యసాహసాలు ప్రదర్శించాయని.. ఇది నవ భారతావనికి సూచిక అన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి దేశమంతా ఏకమైందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 

ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ హాజరు

ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన తొలి మన్ కీ బాత్ ఇది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,  సీనియర్ కేబినెట్ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. BJP పాలిత రాష్ట్రాలు, వారి కూటమి భాగస్వాములుగా ఉన్న సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ముందుగానే ఫిక్స్ అయిన కార్యక్రమాల కారణంగా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఎన్డీయే పక్ష సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీలో జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రదాడిలో చనిపోయిన 26 మందికి నివాళులు అర్పించారు. పహల్గం ఉగ్రవాద దాడి తరువాత భారతదేశం ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆపరేషన్ సింధూర్‌కు శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్ సహా PoKలోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత సాయుధ దళాలు మెరుపు వేగంతో దాడి చేసి ధ్వంసం చేశాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను భారత బలగాలు ప్రదర్శించాయి.

భేటీలో చేసిన తీర్మానాలు ఇవే

ఆపరేషన్ సింధూర్‌తో విజయం సాధించిన సాయుధ దళాలను, ప్రధాని మోదీని అభినందించే తీర్మానాన్ని ఈ భేటీలో ఆమోదించారు. ఈసారి జనాభా లెక్కలలో కుల గణన (Caste Census)ను నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ మరో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. వికసిత భారత్ @2047 లక్ష్యాన్ని సాధించడంపై ఫోకస్ చేయడం, వ్యూహాత్మక చర్యల ప్రణాళికపై చర్చించడానికి NDA, దాని మిత్రపక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో సమావేశం ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందడానికి భారతదేశానికి మార్గాన్ని అన్వేషించడం.. రాష్ట్రాల అభివృద్ధి ద్వారా - వికసిత రాజ్యం కోసం వికసిత భారత్ సాధ్యమని నేతలు చర్చించారు.

30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా భారత్

భారతదేశం ఆర్థిక, పాలనాపరంగా కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో జరిగిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి ప్రపంచ ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదిగేందుకు మరో రెండు దశాబ్దాలు అత్యంత కీలకం కానుందని చర్చించారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడాన్ని లక్ష్యంగా చేసుకున్న భారతదేశం.. అందుకు రాష్ట్రాలు ఎందుకు కీలకమో ఈ భేటీలో ప్రధాని మోదీ తమ సీఎంలు, డిప్యూటీ సీఎంలకు వివరించనున్నారు..

దేశాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి కేంద్రంతో కలిసి రావాలని NITI Aayog రాష్ట్రాలను కోరింది. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని, ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా భారత్ రూపాంతరం చెందుతుందని నీతి ఆమోగ్ పేర్కొంది. వికసిత్ భారత్ @2047 లక్ష్యాలను సాధించేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, ముందున్న సవాళ్లు, పాటించాల్సిన విధానాలపై ఈ భేటీలో కీలకంగా చర్చించారు.

రాష్ట్రాల అద్భుత ప్రగతితోనే వికసిత్ భారత్

ఆర్థిక, సామాజిక, పర్యావరణ రంగాలలో ప్రతి రాష్ట్రం స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలని.. ఇందులో స్థూల రాష్ట్ర అంతర్గత ఉత్పత్తి (GSDP)లో పెరుగుదల కనిపించాలని ప్రధాని మోదీ సూచించారు. ఉద్యోగాల సృష్టి, ఆరోగ్యం, విద్య రంగాలలో మెరుగవడంతో పాటు లింగ సమానత్వం, సహజ వనరుల వినియోగం లాంటి అంశాలపై చర్చించారు. అభివృద్ధి  కోసం కేంద్రం సహకరిస్తుందని, సమర్థవంతంగా పనిచేసి మెరుగైన ఫలితాలు తీసుకురావాలని వారికి ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. స్వచ్ఛ్ భారత్, ఉజ్వల యోజన, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ లాంటి ప్రజల జీవితాలను మార్చిన పథకాలు, విధానాలపై సమీక్షించారు. 

కార్యక్రమాలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా అమలు చేయడానికి ప్రత్యేక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు (PMUs), రియల్-టైమ్ వార్ రూమ్‌లు, వాటి నిర్ధారణకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎంలను ప్రధాని మోదీ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget