అన్వేషించండి

NDA CM Meeting: ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!

PM Modi Meet NDA CMs | జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రదాడిలో చనిపోయిన 26 మందికి ఎన్డీయే పక్ష సీఎంలు, డిప్యూటీ సీఎంలు నివాళులు అర్పించారు.

conclave of the NDA chief ministers and deputy CMs | న్యూఢిల్లీ: NDA పక్ష ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమయ్యారు. అంతకుముందు ఈ నేతలు ప్రధాని మోదీ మన్ కీ బాత్  'Mann Ki Baat' ప్రసంగం విన్నారు. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ముఖ్యంగా భారత సాయుధ దళాలను ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ లో త్రివిధ దళాలు ఏకమై ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేసి తమ ధైర్యసాహసాలు ప్రదర్శించాయని.. ఇది నవ భారతావనికి సూచిక అన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి దేశమంతా ఏకమైందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 

ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ హాజరు

ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన తొలి మన్ కీ బాత్ ఇది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,  సీనియర్ కేబినెట్ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. BJP పాలిత రాష్ట్రాలు, వారి కూటమి భాగస్వాములుగా ఉన్న సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ముందుగానే ఫిక్స్ అయిన కార్యక్రమాల కారణంగా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఎన్డీయే పక్ష సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీలో జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రదాడిలో చనిపోయిన 26 మందికి నివాళులు అర్పించారు. పహల్గం ఉగ్రవాద దాడి తరువాత భారతదేశం ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆపరేషన్ సింధూర్‌కు శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్ సహా PoKలోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత సాయుధ దళాలు మెరుపు వేగంతో దాడి చేసి ధ్వంసం చేశాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను భారత బలగాలు ప్రదర్శించాయి.

భేటీలో చేసిన తీర్మానాలు ఇవే

ఆపరేషన్ సింధూర్‌తో విజయం సాధించిన సాయుధ దళాలను, ప్రధాని మోదీని అభినందించే తీర్మానాన్ని ఈ భేటీలో ఆమోదించారు. ఈసారి జనాభా లెక్కలలో కుల గణన (Caste Census)ను నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ మరో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. వికసిత భారత్ @2047 లక్ష్యాన్ని సాధించడంపై ఫోకస్ చేయడం, వ్యూహాత్మక చర్యల ప్రణాళికపై చర్చించడానికి NDA, దాని మిత్రపక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో సమావేశం ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందడానికి భారతదేశానికి మార్గాన్ని అన్వేషించడం.. రాష్ట్రాల అభివృద్ధి ద్వారా - వికసిత రాజ్యం కోసం వికసిత భారత్ సాధ్యమని నేతలు చర్చించారు.

30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా భారత్

భారతదేశం ఆర్థిక, పాలనాపరంగా కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో జరిగిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి ప్రపంచ ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదిగేందుకు మరో రెండు దశాబ్దాలు అత్యంత కీలకం కానుందని చర్చించారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడాన్ని లక్ష్యంగా చేసుకున్న భారతదేశం.. అందుకు రాష్ట్రాలు ఎందుకు కీలకమో ఈ భేటీలో ప్రధాని మోదీ తమ సీఎంలు, డిప్యూటీ సీఎంలకు వివరించనున్నారు..

దేశాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి కేంద్రంతో కలిసి రావాలని NITI Aayog రాష్ట్రాలను కోరింది. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని, ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా భారత్ రూపాంతరం చెందుతుందని నీతి ఆమోగ్ పేర్కొంది. వికసిత్ భారత్ @2047 లక్ష్యాలను సాధించేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, ముందున్న సవాళ్లు, పాటించాల్సిన విధానాలపై ఈ భేటీలో కీలకంగా చర్చించారు.

రాష్ట్రాల అద్భుత ప్రగతితోనే వికసిత్ భారత్

ఆర్థిక, సామాజిక, పర్యావరణ రంగాలలో ప్రతి రాష్ట్రం స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలని.. ఇందులో స్థూల రాష్ట్ర అంతర్గత ఉత్పత్తి (GSDP)లో పెరుగుదల కనిపించాలని ప్రధాని మోదీ సూచించారు. ఉద్యోగాల సృష్టి, ఆరోగ్యం, విద్య రంగాలలో మెరుగవడంతో పాటు లింగ సమానత్వం, సహజ వనరుల వినియోగం లాంటి అంశాలపై చర్చించారు. అభివృద్ధి  కోసం కేంద్రం సహకరిస్తుందని, సమర్థవంతంగా పనిచేసి మెరుగైన ఫలితాలు తీసుకురావాలని వారికి ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. స్వచ్ఛ్ భారత్, ఉజ్వల యోజన, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ లాంటి ప్రజల జీవితాలను మార్చిన పథకాలు, విధానాలపై సమీక్షించారు. 

కార్యక్రమాలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా అమలు చేయడానికి ప్రత్యేక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు (PMUs), రియల్-టైమ్ వార్ రూమ్‌లు, వాటి నిర్ధారణకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎంలను ప్రధాని మోదీ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget