అన్వేషించండి

హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?

ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా పలు దేశాల్లో ముడిచమురు, LPG సంక్షోభం ఏర్పడింది. అయితే, ఈ సమయంలో భారత్ కు ఊరట లభించింది. రెండు LPG షిప్ లు సురక్షితంగా హర్మూజ్ దాటి బయటకు వచ్చాయి.

న్యూఢిల్లీ: అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా భారత్‌లో LPG సంక్షోభం తలెత్తింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో భారత్‌కు గుడ్ న్యూస్ వచ్చింది. భారతదేశానికి చెందిన రెండు LPG నౌకలు శివాలిక్, నందా హర్మూజ్ జలసంధి దాటి సురక్షితంగా బయలుదేరాయి. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాలు మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. దేశంలో గ్యాస్,  చమురు సమస్యలు పెరుగుతున్న సమయంలో ఈ రెండు LPG నౌకలు సురక్షితంగా తిరిగి రావడం భారత్‌కు చాలా ముఖ్యం.

హర్మూజ్ జలసంధి నుంచి సురక్షితంగా LPG నౌకలు

శుక్రవారం (మార్చి 13) నాడు ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలీ భారత్‌కు ఈ సూచనలు ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాలలో ఒకటైన హర్మూజ్ జలసంధి నుంచి చమురు రవాణా కోసం భారత్‌కు సురక్షితమైన మార్గం ఇస్తున్నామని అన్నారు. దీని తరువాత, 2 నౌకలు హర్మూజ్ జలసంధి నుండి సురక్షితంగా బయలుదేరి భారత్ వైపు వెళ్తున్నాయని పేర్కొన్నారు.

మార్చి 16-17 తేదీల్లో భారత్‌కు నౌకలు

నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాలు మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా దీనిపై సమాచారం అందించారు. 'హర్మూజ్ జలసంధికి పశ్చిమాన ఉన్న పర్షియన్ గల్ఫ్‌లో భారత జెండాతో 24 నౌకలు ఉన్నాయి. వీటిలో 2 LPG నౌకలు శివాలిక్, నందా హర్మూజ్ జలసంధి నుండి సురక్షితంగా బయలుదేరాయి. ఈ 2 నౌకలు భారత్ వైపు వస్తున్నాయి. రెండు నౌకల్లో దాదాపు 92,700 మెట్రిక్ టన్నుల LPG ఉందని తెలిపారు. ఇవి మార్చి 16, 17 తేదీల్లో గుజరాత్ లోని ముంద్రా,  కాండ్లా నౌకాశ్రయాలకు చేరుకుంటాయి అన్నారు.

హర్మూజ్ జలసంధిలో భారత నౌకలు 

రాజేష్ సిన్హా మాట్లాడుతూ.. పర్షియన్ గల్ఫ్‌లో భారత్‌కు చెందిన 24 నౌకలు ఉన్నాయి. వీటిలో శివాలిక్, నందా సురక్షితంగా బయలుదేరాయి. ఇప్పుడు అక్కడ 22 నౌకలు ఉండగా.. వాటిలో 611 మంది నావికులు ఉన్నారు. భారత నావికులు పూర్తిగా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. 

భారత్‌కు ఉపశమనం
రెండు LPG నౌకలు రానుండటంతో భారత్‌కు భారీ ఉపశమనం లభిస్తుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో LPG సిలిండర్ల కోసం ప్రజలు పెద్ద క్యూలలో ఉంటున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి నిరంతరం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. మార్చి 5 నుండి ఇప్పటివరకు LPG దేశీయ ఉత్పత్తి 31 శాతం పెరిగింది. దీనితో పాటు, గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్,  నిల్వలను నియంత్రించడానికి పలు రాష్ట్రాల్లో దాడులు చేస్తున్నారు. LPG సరఫరా గురించి వస్తున్న వదంతులను పట్టించుకోవద్దని,  భయపడి అధిక ధరలకు కొనుగోలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

గల్ఫ్ ప్రాంతంలో 23 వేల మంది భారత నావికులు
హర్మూజ్ జలసంధికి తూర్పున ఒమన్ గల్ఫ్‌లో 4 భారత నౌకలు ఉన్నాయి. వాటిలో ఒకటి బయలుదేరిన తరువాత అక్కడ 3 భారత  నౌకలు మిగిలాయి. వీటిలో 76 మంది భారత నావికులు ఉన్నారు. మొత్తం గల్ఫ్ ప్రాంతం విషయానికి వస్తే.. ఇక్కడ దాదాపు 23000 మంది భారత నావికులు వివిధ నౌకల్లో ఉన్నారు. ఇందులో మర్చంట్ షిప్, ఆఫ్షోర్ షిప్ ఉన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Artificial Jyoti At Ram Janmabhoomi: అయోధ్య రామాలయంలో కృత్రిమ అఖండ జ్యోతి - ట్రస్ట్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు
అయోధ్య రామాలయంలో కృత్రిమ అఖండ జ్యోతి - ట్రస్ట్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Nashik Corporate Jihad: మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. మే 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. మే 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
HYDRAA Fact Check: హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
Praful Hinge Dream Debut: ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
Strait of Hormuz:
"హర్మూజ్ జలసంధి స్వాధీనం" అమెరికా సంచలన ప్రకటన! ఇరాన్ నౌకలు కనిపిస్తే పేల్చేస్తామని హెచ్చరిక!
TGSRTC Strike : తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
Jasprit Bumrah News: వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Embed widget