అన్వేషించండి

PM Modi: ‘ఆపరేషన్​ సిందూర్​’ మారుతున్న భారతావనికి ప్రతీక.. మన్​కీ బాత్​లో ప్రధాని మోదీ

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందని, ఆపరేషన్​ సిందూర్​తో శత్రు దేశానికి బలమైన సందేశం పంపామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం మన్‌కీ బాత్‌ 122వ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.

Operation Sindoor | న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందని, ఆపరేషన్​ సిందూర్​తో శత్రు దేశానికి బలమైన సందేశం పంపామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం మన్‌కీ బాత్‌ 122వ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి మోదీ మన్‌కీ బాత్‌లో ప్రసంగించారు. మన దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. ప్రజలంతా దేశభక్తిని చాటుకున్నారని అన్నారు. 

ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని.. మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనం అని ప్రధాని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదనికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్‌ సిందూర్‌ కొత్త ఉత్సాహాన్ని నింపింది. మన దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయి. ఈ ఘటనను అనేక కుటుంబాలు తమ జీవితాల్లో భాగం చేసుకున్నారు. ఆపరేషన్‌ సమయంలో బిహార్​లోని కతిహార్​​, యూపీలోని ఖుషినగర్​తోపాటు అనేక నగరాల్లో జన్మించిన చిన్నారులకు తమ తల్లిదండ్రులు సిందూర్‌ అని నామకరణం చేశారు’ అని పేర్కొన్నారు. 

దేశ ప్రజలను ఎంతో ప్రభావితం చేసింది
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది. ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నారని ప్రధాని అన్నారు. ఆపరేషన్​ సిందూర్​లో పాల్గొన్న సైనిక దళాలకు మద్దతు తెలుపుతూ అనేక నగరాలు, గ్రామాలు, పట్టణాలో తిరంగా యాత్రలు నిర్వహించారని, పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుంచి యువత ముందుకు వచ్చారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజలను ఎంతో ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. 

దేశంలోని టెక్నాలజీ, వస్తువులపై ప్రజలకు మరింత విశ్వాసం
సైనికుల ధైర్యాన్ని, వారి నైపుణ్యంతోపాటు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. ‘భారత్​లో తయారైన ఆయుధాలు, పరికరాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానంతో టెర్రరిస్ట్​ బేస్​ క్యాప్​లను మన సైనికులు కూల్చివేశారు. ఇది వారి అజేయ ధైర్యానికి ప్రతీక. దేశంలో రూపొందుతున్న టెక్నాలజీ, వస్తువులపై ప్రజలకు మరింత విశ్వాసం ఏర్పడింది. ఇకపై పిల్లలకు దేశంలో తయారయ్యే ఆట వస్తువులనే కొందాం. చిన్ననాటి నుంచే పిల్లలకు దేశ భక్తిని నేర్పుదాం’

నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయం 
నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోందని ప్రధాని అన్నారు.  మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని పేర్కొన్నారు. దంతెవాడ ఆపరేషన్‌లో జవాన్లు చూపిన సాహసాన్ని ఆయన కొనియాడారు. నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయం సాధించామన్నారు. 

సంగారెడ్డి మహిళలు ‘స్కై వారియర్లు’
వ్యవసాయంలో మహిళా రంగం గురించి మోదీ మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. తెలంగాణలోని సంగారెడ్డి మహిళలు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ఆయన ప్రశంసించారు. ఒకప్పుడు ఇతరుల మీద ఆధారపడే మహిళలు ఇప్పుడు 50 ఎకరాల్లో డ్రోన్ల సాయంతో మందులను పిచికారీ చేస్తున్నారు. వారు ‘డ్రోన్​ ఆపరేటర్లు’ కాదని.. ‘స్కై వారియర్లు’ అని మోదీ అన్నారు. 

సింహాల సంఖ్య పెరగడంపై హర్షం
వన్యప్రాణుల సంరక్షణ గురించి కూడా ప్రధాని మాట్లాడారు. దేశంలో సింహాల సంఖ్య పెరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్​లోని గిర్​ అడవుల్లో గత ఐదేళ్లలో సింహాల సంఖ్య 674 నుంచి 891కి పెరిగిందని పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Board Exams Cancel: వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు
వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget