అన్వేషించండి

Jaishankar In UNGA: ‘భారత్‌ నుంచి నమస్తే’ - ఐరాసలో మంత్రి జైశంకర్‌

కెనడాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఐరాస వేదికగా భారత్‌ తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించింది. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని జైశంకర్‌ స్పష్టంచేశారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మంగళవారం న్యూయార్క్‌లోని ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని 'భారత్‌ నుంచి నమస్తే' అంటూ రెండు చేతులు జోడించి ప్రారంభించారు. ఐరాస 78వ సాధారణ అసెంబ్లీని ఉద్దేశించి ఆయన 17 నిమిషాలపాటు ప్రసంగించారు. కెనడాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఐరాస వేదికగా భారత్‌ తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించింది. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని జైశంకర్‌ స్పష్టంచేశారు. రాజకీయ అవసరాల కోసం తీవ్రవాదం, ఉగ్రవాదం అణచివేసే బాధ్యతలను విస్మరించకూడదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయ కారణాల వల్ల తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలను అనుమతించదగినది కాదని ఆయన తెలిపారు. ఇలా జరగడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. 

జైశంకర్‌ మాట్లాడుతూ..మన ఆకాంక్షలు, లక్ష్యాలు పంచుకునేప్పుడు మన విజయాలు, సవాళ్లను అంచనా వేయడానికి ఇది ఒక సందర్భం. వాస్తవానికి రెండింటికి సంబంధించి భారతదేశం పంచుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని జైశంకర్‌ వెల్లడించారు. ఆధునికంగా మారుతున్న పురాతన సంప్రదాయ ప్రజాస్వామ్యం నుంచి ఇప్పటి సమాజం కోసం తాను మాట్లాడుతున్నానని అన్నారు. అందుకే ఆలోచన, ఆచరణ, చర్యలు మరింత క్షేత్రస్థాయిలో ఫలితానిచ్చేవిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సంప్రదాయాలను, సాంకేతికతను మేళవించి భారత్‌ పనిచేస్తోందని ఆయన గుర్తుచేశారు. ఇదే ప్రస్తుత ఇండియాను నిర్వచిస్తోందని, దటీజ్‌ భారత్‌ అని జైశంకర్‌ ఐరాసలో వెల్లడించారు.

భారత దేశం 'అమృత కాలం'లో ఉందని జైశంకర్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. చంద్రయాన్‌ 3 విజయం సాధించడం ద్వారా భారత దేశం ఏం చేయగలదో ప్రపంచానికి చాటి చెప్పామని అన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడం భారత్‌కు ఎంతో గర్వకారణమని తెలిపారు. అలాగే జీ 20 సదస్సును భారత్‌ విజయవంతంగా నిర్వహించిందని వెల్లడించారు. ఆఫ్రికన్‌ యూనియన్‌ను జీ20లో చేర్చేందుకు భారత్‌ కృషి చేసిందని, ఈ స్ఫూర్తితో ఐరాస భద్రతా మండలిని విస్తరించాలని ఆయన కోరారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిని విస్తరించాలని ఆయన అన్నారు. ఐరాస సమర్థతను పెంచడానికి, ఇంకా విశ్వసనీయతను సాధించడానికి మరింత మంది సభ్యులను చేర్చుకోవడం అవసరమని అన్నారు. ఇతర దేశాల వాణిని వినిపించడం, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ఐరాసకు మరింత బలాన్ని చేకూర్చే అంశమని జైశంకర్‌ పేర్కొన్నారు.

అప్పుడే అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఇప్పటికి కొన్ని దేశాలే ఎజెండాను నిర్ణయించి అదే అందరిపై రుద్దుతున్నాయని, ఇలా ఎప్పటికీ కొనసాగకూడదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభాకలిగిన దేశంగా భారత్‌ అవతరించిందని, భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావడానికి భారత్‌ ఎప్పటినుంచో పోరాడుతోందని అన్నారు. ఇప్పడు ఉన్న ఐరాస భద్రతామండలి 21 శతాబ్దానికి  సరిపోదని అన్నారు.

ప్రపంచంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య భారత్‌ వారధిగా పనిచేస్తోందని, తూర్పు, పశ్చిమ ప్రాంతాలను ఐక్యం చేసేందుకు కృషి చేస్తున్నామని జైశంకర్‌ వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను అధిగమించేందుకు బలమైన దేశాలను ఏకతాటిపైకి తీసుకొస్తామని తెలిపారు. ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అన్న భారత్‌ నినాదాన్ని ప్రపంచం నమ్ముతోందని భారత్‌ను పరిష్కర్తగా చూస్తోందని తెలిపారు.  

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
UPI Transactions: బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget