అన్వేషించండి

Jaishankar In UNGA: ‘భారత్‌ నుంచి నమస్తే’ - ఐరాసలో మంత్రి జైశంకర్‌

కెనడాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఐరాస వేదికగా భారత్‌ తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించింది. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని జైశంకర్‌ స్పష్టంచేశారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మంగళవారం న్యూయార్క్‌లోని ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని 'భారత్‌ నుంచి నమస్తే' అంటూ రెండు చేతులు జోడించి ప్రారంభించారు. ఐరాస 78వ సాధారణ అసెంబ్లీని ఉద్దేశించి ఆయన 17 నిమిషాలపాటు ప్రసంగించారు. కెనడాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఐరాస వేదికగా భారత్‌ తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించింది. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని జైశంకర్‌ స్పష్టంచేశారు. రాజకీయ అవసరాల కోసం తీవ్రవాదం, ఉగ్రవాదం అణచివేసే బాధ్యతలను విస్మరించకూడదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయ కారణాల వల్ల తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలను అనుమతించదగినది కాదని ఆయన తెలిపారు. ఇలా జరగడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. 

జైశంకర్‌ మాట్లాడుతూ..మన ఆకాంక్షలు, లక్ష్యాలు పంచుకునేప్పుడు మన విజయాలు, సవాళ్లను అంచనా వేయడానికి ఇది ఒక సందర్భం. వాస్తవానికి రెండింటికి సంబంధించి భారతదేశం పంచుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని జైశంకర్‌ వెల్లడించారు. ఆధునికంగా మారుతున్న పురాతన సంప్రదాయ ప్రజాస్వామ్యం నుంచి ఇప్పటి సమాజం కోసం తాను మాట్లాడుతున్నానని అన్నారు. అందుకే ఆలోచన, ఆచరణ, చర్యలు మరింత క్షేత్రస్థాయిలో ఫలితానిచ్చేవిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సంప్రదాయాలను, సాంకేతికతను మేళవించి భారత్‌ పనిచేస్తోందని ఆయన గుర్తుచేశారు. ఇదే ప్రస్తుత ఇండియాను నిర్వచిస్తోందని, దటీజ్‌ భారత్‌ అని జైశంకర్‌ ఐరాసలో వెల్లడించారు.

భారత దేశం 'అమృత కాలం'లో ఉందని జైశంకర్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. చంద్రయాన్‌ 3 విజయం సాధించడం ద్వారా భారత దేశం ఏం చేయగలదో ప్రపంచానికి చాటి చెప్పామని అన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడం భారత్‌కు ఎంతో గర్వకారణమని తెలిపారు. అలాగే జీ 20 సదస్సును భారత్‌ విజయవంతంగా నిర్వహించిందని వెల్లడించారు. ఆఫ్రికన్‌ యూనియన్‌ను జీ20లో చేర్చేందుకు భారత్‌ కృషి చేసిందని, ఈ స్ఫూర్తితో ఐరాస భద్రతా మండలిని విస్తరించాలని ఆయన కోరారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిని విస్తరించాలని ఆయన అన్నారు. ఐరాస సమర్థతను పెంచడానికి, ఇంకా విశ్వసనీయతను సాధించడానికి మరింత మంది సభ్యులను చేర్చుకోవడం అవసరమని అన్నారు. ఇతర దేశాల వాణిని వినిపించడం, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ఐరాసకు మరింత బలాన్ని చేకూర్చే అంశమని జైశంకర్‌ పేర్కొన్నారు.

అప్పుడే అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఇప్పటికి కొన్ని దేశాలే ఎజెండాను నిర్ణయించి అదే అందరిపై రుద్దుతున్నాయని, ఇలా ఎప్పటికీ కొనసాగకూడదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభాకలిగిన దేశంగా భారత్‌ అవతరించిందని, భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావడానికి భారత్‌ ఎప్పటినుంచో పోరాడుతోందని అన్నారు. ఇప్పడు ఉన్న ఐరాస భద్రతామండలి 21 శతాబ్దానికి  సరిపోదని అన్నారు.

ప్రపంచంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య భారత్‌ వారధిగా పనిచేస్తోందని, తూర్పు, పశ్చిమ ప్రాంతాలను ఐక్యం చేసేందుకు కృషి చేస్తున్నామని జైశంకర్‌ వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను అధిగమించేందుకు బలమైన దేశాలను ఏకతాటిపైకి తీసుకొస్తామని తెలిపారు. ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అన్న భారత్‌ నినాదాన్ని ప్రపంచం నమ్ముతోందని భారత్‌ను పరిష్కర్తగా చూస్తోందని తెలిపారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం.. ఉప్పొంగిపోయిన తల్లిదండ్రులు
తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం.. ఉప్పొంగిపోయిన తల్లిదండ్రులు
Thalapathy Vijay CM : సీఎంగా విజయ్‌ - స్పెషల్ అట్రాక్షన్‌గా సౌత్ క్వీన్ త్రిష... వీడియోస్ వైరల్
సీఎంగా విజయ్‌ - స్పెషల్ అట్రాక్షన్‌గా సౌత్ క్వీన్ త్రిష... వీడియోస్ వైరల్
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రులు వీరే.. విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణం!
తమిళనాడు కేబినెట్ మంత్రులు వీరే.. విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణం!
TVK Vijay Oath Taking Ceremony: మే 10 మిశ్రమ ఫలితాలను ఇచ్చే ముహూర్తం, తమిళనాడు ముఖ్యమంత్రిగా TVK అధినేత విజయ్‌కి సవాళ్లు తప్పవు కానీ!
మే 10 మిశ్రమ ఫలితాలను ఇచ్చే ముహూర్తం, తమిళనాడు ముఖ్యమంత్రిగా TVK అధినేత విజయ్‌కి సవాళ్లు తప్పవు కానీ!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
Tamil Nadu Updates: తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Panchali Panchabhartruka: అప్పటి రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తారు... 'పాంచాలి పంచభర్తృక'పై నటకిరీటి ధీమా
అప్పటి రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తారు... 'పాంచాలి పంచభర్తృక'పై నటకిరీటి ధీమా
India next CDS : భారత త్రివిధ దళాల నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి - అజిల్ ధోవల్ మార్క్ !
భారత త్రివిధ దళాల నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి - అజిల్ ధోవల్ మార్క్ !
Pumpkin Seeds : ఉదయాన్నే నానబెట్టిన గుమ్మడి గింజలు తింటే కలిగే లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం తినేయండి
ఉదయాన్నే నానబెట్టిన గుమ్మడి గింజలు తింటే కలిగే లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం తినేయండి
Embed widget