అన్వేషించండి

Arvind Kejriwal : మెట్రో రైళ్లలో విద్యార్థులకు 50 శాతం రాయితీ - ఎన్నికలకు ముందు ప్రధానికి లేఖ రాసిన కేజ్రీవాల్

Delhi Elections 2025: ఢిల్లీలోని విద్యార్థులకు సాధారణ ఛార్జీల్లో సగం చొప్పున మెట్రో రైడ్‌లను అందించాలన్న తన ప్రతిపాదనకు కేంద్రం మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

Arvind Kejriwal : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఆయా పార్టీల నాయకులు తమ వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకు సాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలతో పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశ రాజధాని పరిధీలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే విద్యార్ధులకు టిక్కెట్ ధరపై 50 శాతం రాయితీకి ఆమోదం తెలపాలని కోరారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం రెండూ ఈ ప్రతిపాదనను అమలు చేయడంలో వచ్చే నష్టాలను సైతం నిర్వహించాలని చెప్పారు.

ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ 

విద్యా ప్రయోజనాల కోసం రోజువారీగా ఢిల్లీ మెట్రో ద్వారా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రయాణిస్తారని పేర్కొంటూ, కేజ్రీవాల్ విద్యార్థులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు 50% రాయితీని అందించాలని ప్రతిపాదించారు. “ఢిల్లీలోని పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయంపై నేను ఈ లేఖ రాస్తున్నాను. ఢిల్లీలోని పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ విద్యాసంస్థలకు, వారి రోజువారీ ప్రయాణానికి మెట్రోపై ఎక్కువగా ఆధారపడుతున్నారు" అని కేజ్రీవాల్ చెప్పారు. “విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, విద్యార్థులకు మెట్రో ఛార్జీలపై 50% రాయితీని అందించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఢిల్లీ మెట్రో అనేది ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమానమైన (50:50) నిధులతో కూడిన జాయింట్ వెంచర్. కాబట్టి, ఈ రాయితీ ధరను ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ సమానంగా పంచుకోవాలి” అని కేజ్రీవాల్ చెప్పారు. ఈ లేఖపై ప్రధాని మోదీ ఇప్పటివరకైతే స్పందించలేదు.

విద్యార్థులకు బస్సుల్లో ఫ్రీ జర్నీ

బస్సుల్లో విద్యార్థులకు ప్రయాణాన్ని పూర్తిగా ఉచితం చేయాలని యోచిస్తోందని, ఈ ప్రతిపాదనకు ప్రధాని అంగీకరిస్తారని తాను ఆశిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పటికే ఢిల్లీలోని బస్సుల్లో మహిళా ప్రయాణీకులకు ఫ్రీ జర్నీకి అనుమతిస్తుండగా.. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం దీనిని విద్యార్థులకు సైతం ఉచితంగా అందించాలని యోచిస్తోంది. అయితే ప్రస్తుతం అయితే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున, ఎన్నికలకు ముందు నిర్ణయాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ మళ్లీ ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది. 

అంతకుముందు కూడా అరవింద్ కేజ్రీవాల్.. ప్రధానికి లేఖ రాశారు. జాట్ కమ్యూనిటీని ఇతర వెనుకబడిన తరగతుల (OBC) జాబితాలో చేర్చాలని, తద్వారా విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పొందడం సులభతరం అవుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాబోయే ఎన్నికల్లో మూడోసారి అధికారం ఛేజిక్కించుకునేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రానికి వరస లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read : Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష - ఇక జైల్లోనే పాక్ మాజీ అధ్యక్షుడి జీవితం !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran Greenlights Indian Ships : హుర్ముజ్‌ జలసంధిలో భారత్ నౌకలకు గ్రీన్ సిగ్నల్‌! ఇరాన్‌తో జరిపిన చర్చల్లో పురోగతి!
హుర్ముజ్‌ జలసంధిలో భారత్ నౌకలకు గ్రీన్ సిగ్నల్‌! ఇరాన్‌తో జరిపిన చర్చల్లో పురోగతి!
Shenlong Suezmax Mumbai Arrival: యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
Farooq Abdullah News: జమ్మూలో ఫరూక్ అబ్దుల్లా పాయింట్‌లో బ్లాంక్‌లో పెట్టి కాల్పులకు యత్నం! టార్గెట్ చేసిన వ్యక్తి ఎవరు?
జమ్మూలో ఫరూక్ అబ్దుల్లా పాయింట్‌లో బ్లాంక్‌లో పెట్టి కాల్పులకు యత్నం! టార్గెట్ చేసిన వ్యక్తి ఎవరు?
US Donald Trump: భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు! కవిత నివాసానికి సీబీఐ అధికారులు!
ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు! కవిత నివాసానికి సీబీఐ అధికారులు!
LPG Crisis Hits Hyderabad : హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
గ్యాస్ కొరతకు పర్ఫెక్ట్ సొల్యూషన్! భగవద్గీత, ఆయుర్వేదం చెప్పిన మంట అవసరం లేని ఆహార, ఆరోగ్య రహస్యాలు!
గ్యాస్ కొరతకు పర్ఫెక్ట్ సొల్యూషన్! భగవద్గీత, ఆయుర్వేదం చెప్పిన మంట అవసరం లేని ఆహార, ఆరోగ్య రహస్యాలు!
Shenlong Suezmax Mumbai Arrival: యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
ఇప్పుడంతా ఉర్దూ పదాలతో టాటూ ట్రెండ్! ముస్లింలే కాదు అందరూ ఫాలో అవుతున్నారు!
ఇప్పుడంతా ఉర్దూ పదాలతో టాటూ ట్రెండ్! ముస్లింలే కాదు అందరూ ఫాలో అవుతున్నారు!
Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
Ustaad Bhagat Singh : దేవిశ్రీ ప్రసాద్‌కు బదులుగా తమన్ - ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎంపై డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్
దేవిశ్రీ ప్రసాద్‌కు బదులుగా తమన్ - ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎంపై డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్
Bengal Assembly Elections 2026: బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
Embed widget