అన్వేషించండి

Arvind Kejriwal : మెట్రో రైళ్లలో విద్యార్థులకు 50 శాతం రాయితీ - ఎన్నికలకు ముందు ప్రధానికి లేఖ రాసిన కేజ్రీవాల్

Delhi Elections 2025: ఢిల్లీలోని విద్యార్థులకు సాధారణ ఛార్జీల్లో సగం చొప్పున మెట్రో రైడ్‌లను అందించాలన్న తన ప్రతిపాదనకు కేంద్రం మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

Arvind Kejriwal : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఆయా పార్టీల నాయకులు తమ వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకు సాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలతో పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశ రాజధాని పరిధీలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే విద్యార్ధులకు టిక్కెట్ ధరపై 50 శాతం రాయితీకి ఆమోదం తెలపాలని కోరారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం రెండూ ఈ ప్రతిపాదనను అమలు చేయడంలో వచ్చే నష్టాలను సైతం నిర్వహించాలని చెప్పారు.

ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ 

విద్యా ప్రయోజనాల కోసం రోజువారీగా ఢిల్లీ మెట్రో ద్వారా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రయాణిస్తారని పేర్కొంటూ, కేజ్రీవాల్ విద్యార్థులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు 50% రాయితీని అందించాలని ప్రతిపాదించారు. “ఢిల్లీలోని పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయంపై నేను ఈ లేఖ రాస్తున్నాను. ఢిల్లీలోని పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ విద్యాసంస్థలకు, వారి రోజువారీ ప్రయాణానికి మెట్రోపై ఎక్కువగా ఆధారపడుతున్నారు" అని కేజ్రీవాల్ చెప్పారు. “విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, విద్యార్థులకు మెట్రో ఛార్జీలపై 50% రాయితీని అందించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఢిల్లీ మెట్రో అనేది ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమానమైన (50:50) నిధులతో కూడిన జాయింట్ వెంచర్. కాబట్టి, ఈ రాయితీ ధరను ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ సమానంగా పంచుకోవాలి” అని కేజ్రీవాల్ చెప్పారు. ఈ లేఖపై ప్రధాని మోదీ ఇప్పటివరకైతే స్పందించలేదు.

విద్యార్థులకు బస్సుల్లో ఫ్రీ జర్నీ

బస్సుల్లో విద్యార్థులకు ప్రయాణాన్ని పూర్తిగా ఉచితం చేయాలని యోచిస్తోందని, ఈ ప్రతిపాదనకు ప్రధాని అంగీకరిస్తారని తాను ఆశిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పటికే ఢిల్లీలోని బస్సుల్లో మహిళా ప్రయాణీకులకు ఫ్రీ జర్నీకి అనుమతిస్తుండగా.. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం దీనిని విద్యార్థులకు సైతం ఉచితంగా అందించాలని యోచిస్తోంది. అయితే ప్రస్తుతం అయితే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున, ఎన్నికలకు ముందు నిర్ణయాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ మళ్లీ ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది. 

అంతకుముందు కూడా అరవింద్ కేజ్రీవాల్.. ప్రధానికి లేఖ రాశారు. జాట్ కమ్యూనిటీని ఇతర వెనుకబడిన తరగతుల (OBC) జాబితాలో చేర్చాలని, తద్వారా విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పొందడం సులభతరం అవుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాబోయే ఎన్నికల్లో మూడోసారి అధికారం ఛేజిక్కించుకునేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రానికి వరస లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read : Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష - ఇక జైల్లోనే పాక్ మాజీ అధ్యక్షుడి జీవితం !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణ ప్రజలకు చలి నుంచి రిలీఫ్
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణ ప్రజలకు చలి నుంచి రిలీఫ్
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Virat Kohli Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
Vaa Vaathiyaar Release Date : సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...

వీడియోలు

Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణ ప్రజలకు చలి నుంచి రిలీఫ్
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణ ప్రజలకు చలి నుంచి రిలీఫ్
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Virat Kohli Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
Vaa Vaathiyaar Release Date : సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
iPhone Fold Phone: మడతపెట్టే ఐఫోన్.. భారతదేశంలో ధర ఎంత ? ఎప్పుడు లాంచ్ అవుతుంది
మడతపెట్టే ఐఫోన్.. భారతదేశంలో ధర ఎంత ? ఎప్పుడు లాంచ్ అవుతుంది
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
MI vs DC Highlights: కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
Embed widget