News
News
X

IT Raids: సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసినట్టు ఆధారాలున్నాయి.. ఐటీ అధికారులు

నటుడు సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఐటీ దాడుల్లో ఆధారాలు లభించాయని అధికారులు చెప్పారు.

FOLLOW US: 
Share:


సోనూసూద్‌ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేసింది. వరుసగా మూడో రోజులపాటు ఆయన నివాసం, తదితర ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు. సోనూసూద్ పన్ను ఎగవేసినట్లు ఆధారాలు లభించాయని ఐటీ అధికారులు చెబుతున్నారు. విదేశీ నిధులను తీసుకోవడంలో 'విదేశీ విరాళాల నియంత్రణ చట్టం' నిబంధనలు ఉల్లంఘించినట్లు కూడా వెల్లడించారు.

 

ఐటీ అధికారులు సోనూసూద్ ఇళ్లు, అతడికి సంబంధించిన వ్యక్తుల నివాసాల్లో తనిఖీలు చేసినప్పుడు పన్ను ఎగవేసినట్లు గుర్తించామని చెబుతున్నారు అధికారులు. ముంబయి, లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ, గురుగ్రామ్‌ సహా 28 ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. బుధవారం సోనూపై ఐడీ శాఖ తనిఖీలు చేయడం మెుదలుపెట్టింది. తరువాత అతడితో సంబంధం ఉన్న వ్యక్తులపై ఐటీ దాడులు జరిగాయి.


ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన పార్టీలు సోనూసూద్ పై ఐడీ దాడుల చేయడాన్ని ఖండించాయి.  కేంద్రంపై విమర్శలు చేశాయి. కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సేవ చేసిన సోనూసూద్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని ఆరోపించారు. 

ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిశాడు సోనూసూద్. ఢీల్లి ప్రభుత్వం ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అయితే ఈ క్రమంలో సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పుకార్లు వచ్చాయి. అంతకు ముందు ఏకంగా ముంబయి మేయర్‌గా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దింపుతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే, వాటన్నిటిపై స్పందించేందుకు సోనూసూద్ నిరాకరించాడు.

కరోనా సమయంలోనే కాదు. 2020 ఏప్రిల్ తర్వాత నుంచి సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు దేశం మొత్తం ఫిదా అయిపోయింది. తాము కష్టాల్లో ఉన్నామంటూ ట్వీట్లు చేసిన ఎందరికో సాయంచేశాడు. కొందరికి లక్షలు ఖర్చు పెట్టి ట్రాక్టర్లు కొనిచ్చాడు. వేలాది రూపాయలతో పిల్లలు చదువుకోవడానికి సెల్ ఫోన్లు కొనిచ్చాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా సోనూ సూద్ చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. ఏపీలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయించాడు. చాలా మందికి ఆర్థికంగా సాయం చేశాడు.

Also Read: Supreme Collegium: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త సీజేఐలు.. సిఫారసు చేసిన సుప్రీం కోర్టు కొలీజియం

Published at : 18 Sep 2021 01:27 PM (IST) Tags: Sonu Sood AAP it raids on sonusood sonu sood service Sonu Sood met Arvind Kejriwal IT raids

సంబంధిత కథనాలు

LPG Cylinder Subsidy:  పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

LPG Cylinder Subsidy: పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

UPSC NDA 1 Admit Card: యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

UPSC NDA 1 Admit Card: యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

సమ్మర్ లో కశ్మీర్ వెళ్లాలి అనుకుంటున్నారా ? ఇదిగో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ 

సమ్మర్ లో కశ్మీర్ వెళ్లాలి అనుకుంటున్నారా ? ఇదిగో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ 

UPSC CDS Admit Card: సీడీఎస్-1 ఎగ్జామ్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?

UPSC CDS Admit Card: సీడీఎస్-1 ఎగ్జామ్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?

CM KCR On Rahul Gandhi : ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుంది, రాహుల్ గాంధీపై వేటు దేశ చరిత్రలో చీకటి రోజు- సీఎం కేసీఆర్

CM KCR On Rahul Gandhi : ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుంది, రాహుల్ గాంధీపై వేటు దేశ చరిత్రలో చీకటి రోజు- సీఎం కేసీఆర్

టాప్ స్టోరీస్

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!