By: ABP Desam | Updated at : 05 Apr 2022 08:59 PM (IST)
Edited By: Murali Krishna
22 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం
దేశంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంలో పలు యూట్యూబ్ ఛానళ్లపై ప్రభుత్వం వేటు వేసింది. దేశానికి చెందిన 18 యూట్యూబ్ ఛానళ్లతో పాటు పాకిస్థాన్కు చెందిన 4 యూట్యూబ్ ఛానళ్లను నిషేధిస్తూ భారత సమాచారం- ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
ఇదే కారణం
ఈ 22 యూట్యూబ్ ఛానళ్లు.. పలు న్యూస్ ఛానళ్లకు చెందిన లోగోలను వాడుకుంటూ, తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టి వ్యూయర్స్ను మోసం చేస్తున్నాయని ఐ అండ్ బీ మినిస్ట్రీ పేర్కొంది. ఈ ఛానెళ్లు ప్రధానంగా జమ్ముకశ్మీర్, భారత్ ఆర్మీపై తప్పుడు అంశాల్ని ప్రచారం చేస్తున్నాయి.
పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియా అకౌంట్లతోపాటు, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లను ఐ అండ్ బీ మినిస్ట్రీ నిషేధించింది.
ఇటీవల
పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతోన్న పలు యూట్యూబ్, సామాజిక మాధ్యమాల అకౌంట్లను భారత్ ఇటీవల బ్లాక్ చేసింది. నిఘా విభాగం అందించిన సమాచారంతో సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ వీటిని బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఆ యూట్యూబ్ ఛానళ్లకు 1.20 కోట్ల సబ్స్క్రైబర్లు, 130 కోట్ల వ్యూస్ ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రసారం చేసే ఛానళ్లను మరిన్నింటిని నిషేధిస్తామని అధికారులు తెలిపారు. ఆ దిశగా నిఘా విభాగం పని చేస్తున్నట్లు చెప్పారు.
Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!
Gyanvapi mosque case: 'జ్ఞానవాపి మసీదు'పై సుప్రీం కీలక ఆదేశాలు- కేసు వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ
Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?
Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి
Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో నలుగురు నిందితులు అరెస్టు
Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ
Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు
Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!