అన్వేషించండి

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌‌కు డెంగీ.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రకటన

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డెంగీ బారిన పడ్డారు. ఆయనకు తాజాగా నిర్వహించిన టెస్టులో డెంగీగా నిర్ధారణ అయినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

Manmohan Singh diagnosed with Dengue: మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు డెంగీ సోకినట్టు ఎయిమ్స్‌ వైద్యులు శనివారం వెల్లడించారు.  ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరుగుతుండటంతో మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతోందని ఓ ప్రకటనలో తెలిపారు. మొదట ఆయనకు జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరారు, కోలుకుంటున్న క్రమంలో డెంగీ నిర్ధారణ కావడం కాంగ్రెస్ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది.

సీనియర్ నేత మన్మోహన్‌ సింగ్‌(89)కు సోమవారం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం జ్వరం వచ్చినా.. రెండు రోజుల్లో కాస్త కోలుకున్నట్లు కనిపంచారు. జ్వరం తగ్గినా శరీరం అంత యాక్టివ్ గా లేకపోవడంతో ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కార్డియో - న్యూరో సెంటర్‌ ప్రైవేటు వార్డులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్‌ నితీశ్‌ నాయక్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.

Also Read: టీఆర్ఎస్‌లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు.. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం! 

జ్వరం తగ్గినా యాక్టివ్‌గా లేకపోవడంతో వైద్యులు టెస్టులు చేయగా డెంగీగా నిర్ధారించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ప్లేట్ లెట్ సంఖ్య పెరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు తెలిపినట్లు పీటీఐ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మాజీ ప్రధాని ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ మాజీ సీఎఖం కెప్టెన్ అమరీందర్ సింగ్ సహా తదితర నేతలు మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

Also Read: హజురాబాద్ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ! టీఆర్ఎస్‌లో పదవుల సందడి ! 

మన్సుఖ్‌ మాండవీయ వివాదం..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఎయిమ్స్ ఆసుపత్రికి గురువారం వెళ్లి మాజీ ప్రధానిని పరామర్శించారు. అయితే మన్సుఖ్ మాండవీయ ఎయిమ్స్‌కు తనతో పాటు ఫొటోగ్రాఫర్ ను తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా ఇలాంటి పని చేయడంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనపై మన్మోహన్ సింగ్‌ కుమార్తె దమన్‌ సింగ్‌ మండిపడ్డారు. తన తల్లికి ఇలాంటివి నచ్చవని, కుటుంబం ఎంతో ఆవేదనకు లోనైందన్నారు. ఫొటోగ్రాఫర్‌ను బయటకు వెళ్లమని చెప్పారు. తన తల్లిదండ్రులు వయసు మీద పడ్డ వ్యక్తులు మాత్రమేనని, జూలో జంతువులు కాదంటూ మన్సుఖ్ మాండవీయ తీరును దమన్ సింగ్ విమర్శించారు.

Also Read: ఏపీ ఐటీకి సరికొత్త బ్రాండింగ్.. మంత్రి మేకపాటి బ్రాండ్ న్యూ ఆలోచన !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget