అన్వేషించండి

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌‌కు డెంగీ.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రకటన

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డెంగీ బారిన పడ్డారు. ఆయనకు తాజాగా నిర్వహించిన టెస్టులో డెంగీగా నిర్ధారణ అయినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

Manmohan Singh diagnosed with Dengue: మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు డెంగీ సోకినట్టు ఎయిమ్స్‌ వైద్యులు శనివారం వెల్లడించారు.  ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరుగుతుండటంతో మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతోందని ఓ ప్రకటనలో తెలిపారు. మొదట ఆయనకు జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరారు, కోలుకుంటున్న క్రమంలో డెంగీ నిర్ధారణ కావడం కాంగ్రెస్ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది.

సీనియర్ నేత మన్మోహన్‌ సింగ్‌(89)కు సోమవారం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం జ్వరం వచ్చినా.. రెండు రోజుల్లో కాస్త కోలుకున్నట్లు కనిపంచారు. జ్వరం తగ్గినా శరీరం అంత యాక్టివ్ గా లేకపోవడంతో ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కార్డియో - న్యూరో సెంటర్‌ ప్రైవేటు వార్డులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్‌ నితీశ్‌ నాయక్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.

Also Read: టీఆర్ఎస్‌లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు.. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం! 

జ్వరం తగ్గినా యాక్టివ్‌గా లేకపోవడంతో వైద్యులు టెస్టులు చేయగా డెంగీగా నిర్ధారించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ప్లేట్ లెట్ సంఖ్య పెరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు తెలిపినట్లు పీటీఐ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మాజీ ప్రధాని ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ మాజీ సీఎఖం కెప్టెన్ అమరీందర్ సింగ్ సహా తదితర నేతలు మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

Also Read: హజురాబాద్ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ! టీఆర్ఎస్‌లో పదవుల సందడి ! 

మన్సుఖ్‌ మాండవీయ వివాదం..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఎయిమ్స్ ఆసుపత్రికి గురువారం వెళ్లి మాజీ ప్రధానిని పరామర్శించారు. అయితే మన్సుఖ్ మాండవీయ ఎయిమ్స్‌కు తనతో పాటు ఫొటోగ్రాఫర్ ను తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా ఇలాంటి పని చేయడంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనపై మన్మోహన్ సింగ్‌ కుమార్తె దమన్‌ సింగ్‌ మండిపడ్డారు. తన తల్లికి ఇలాంటివి నచ్చవని, కుటుంబం ఎంతో ఆవేదనకు లోనైందన్నారు. ఫొటోగ్రాఫర్‌ను బయటకు వెళ్లమని చెప్పారు. తన తల్లిదండ్రులు వయసు మీద పడ్డ వ్యక్తులు మాత్రమేనని, జూలో జంతువులు కాదంటూ మన్సుఖ్ మాండవీయ తీరును దమన్ సింగ్ విమర్శించారు.

Also Read: ఏపీ ఐటీకి సరికొత్త బ్రాండింగ్.. మంత్రి మేకపాటి బ్రాండ్ న్యూ ఆలోచన !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget