అన్వేషించండి

Assembly Polls: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ప్రచారానికి తెర, ఎల్లుండి పోలింగ్

Assembly Polls: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో 17న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్‌కు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

Assembly Polls: దేశవ్యాప్తంగా ఈ నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. విడతల వారీగా ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నవంబర్ 17వ తేదీన మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు జరిగే 48 గంటల ముందు ప్రచారానికి గడువు ముగుస్తుంది. దీంతో నేటితో ఆయా రాష్ట్రాల్లో ప్రచారానికి తెరపడటంతో మైకులు మూగబోయాయి. ఎల్లుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. 

మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 2.88 కోట్ల మంది ఉండగా.. 2.72 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 22.36 లక్షల మంది యువత కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతగా 20 స్థానాలకు పోలింగ్ జరగ్గా.. 17న మిగిలిన 70 స్థానాలకు నిర్వహిస్తున్నారు. రెండో విడతలో 958 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. వీరిలో 827 మంది పురుషులు, 130 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 1.63 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటింగ్ కోసం ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో 18,883 పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది.

ఛత్తీస్‌గఢ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 60 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో కేవలం 15 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకోగా.. జేసీసీ పార్టీ ఐదు, బీఎస్పీ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు అంచనా వేశాయి. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాల్లో గెలవగా.. బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఏడాదికే కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఈ సారి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ వచ్చే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి.  

మరో నాలుగైదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలను పార్టీలన్నీ సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి.  దీంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తోన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే వ్యూహలను సిద్దం చేసుకుంటోంది. ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసి బీజేపీయేతర పార్టీలను కలుపుకుంటోంది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్‌కు కీలకంగా మారాయి. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలను కాంగ్రెస్ కీలకంగా తీసుకుంది. గెలుపొందేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉండగా.. రాజస్థాన్‌ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
Tunguska Missile System: భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
Rupee Crash: రోజురోజుకు మరింత పడిపోతున్న రూపాయి! పశ్చిమాసియా సంక్షోభం, ముడిచమురు సెగతో కనిష్టంలో ఆల్‌టైం రికార్డు!
రోజురోజుకు మరింత పడిపోతున్న రూపాయి! పశ్చిమాసియా సంక్షోభం, ముడిచమురు సెగతో కనిష్టంలో ఆల్‌టైం రికార్డు!
Another new airport for Delhi: ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
PM E-Drive Schemes:పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
Tunguska Missile System: భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Embed widget