అన్వేషించండి

Delhi Blast Case: దీపావళి, రిపబ్లిక్ డే సమయంలో ఉగ్రదాడులకు ప్లాన్.. విచారణలో అంగీకరించిన నిందితుడు

Delhi On High Alert | రిపబ్లిక్ డే, దీపావళి రోజుల్లో దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు నిందితుడు ముజమ్మిల్ షకీల్ విచారణలో అంగీకరించాడని సమాచారం. 2026లో ఎర్రకోటపై దాడికి రెక్కీ నిర్వహించారు.

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న సాయంత్రం జరిగిన ఘోర పేలుడు కేసులో దర్యాప్తు అధికారులు కీలక విషయాలు గుర్తించారు.  ప్రధాన నిందితులలో ఒకడైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్.. గణతంత్ర దినోత్సవం, దీపావళి వంటి జాతీయ కార్యక్రమాల సమయంలో ఉగ్రదాడులు చేయడానికి ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడని తెలుస్తోంది. పండగులు, పెద్ద ఈవెంట్ల సమయాల్లో ఢిల్లీ వ్యాప్తంగా పలుచోట్ల దాడి చేయాలని ఈ ఏడాది మొదట్నుంచే ఉగ్రకుట్నకు ప్లాన్ చేసినట్లు ఒక్కో విషయం విచారణలో బయటకు వస్తోంది.

ఎర్రకోట పేలుడు దర్యాప్తు

అధికారుల అనధికారిక సమాచారం ప్రకారం, ముజమ్మిల్ విచారణలో తన సహచరుడు ఉమర్‌తో కలిసి ఈ ఏడాది ప్రారంభంలో ఎర్రకోట ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు అంగీకరించాడు. జనవరి 26, 2026న గణతంత్ర దినోత్సవం (Republic Day) వేడుకల సమయంలో దాడి చేయడానికి ఈ రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ముజమ్మిల్ మొబైల్ ఫోన్ నుండి సేకరించిన లొకేషన్ డేటా, ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలకు చాలాసార్లు వెళ్లినట్లు నిర్ధారించింది. ఇండియా టుడే కథనం ప్రకారం, దీపావళి సమయంలో దాడి చేసేందుకు మొదట ప్లాన్ చేసుకున్నా.. చివరి నిమిషంలో తమ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు కూడా అతను వెల్లడించాడు.

పుల్వామాకు చెందిన సీనియర్ డాక్టర్ అయిన ముజమ్మిల్, ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీగా పనిచేశాడు. జైషే మహ్మద్ (JeM), అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH) వంటి నిషేధిత సంస్థలతో సంబంధాలు ఉన్న "వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్"తో ముజమ్మిల్‌కు సంబంధాలు ఉన్నాయని అధికారుల నమ్మకం విచారణలో క్రమంగా బలపడుతోంది.

ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్, నవంబర్ 10న ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హ్యుందాయ్ i20 కారులో పేల్చివేసుకుకుని మృతిచెందాడు. ఈ పేలుడులో 12 మంది మరణించగా, 20 మంది వరకు గాయపడ్డారు. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పేలుడు తరువాత ఢిల్లీ మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, పారామిలిటరీ బలగాలు గస్తీని పెంచాయి. గాజీపూర్, సింఘు, టిక్రీ, బదర్‌పూర్ సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మెట్రో స్టేషన్లు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్‌ లాంటి జనసంచారం అధికంగా ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కీలకమైన ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్‌లు, మెటల్ డిటెక్షన్ బృందాలను మోహరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు లేదా వస్తువులేమైనా కనిపిస్తే వెంటనే అత్యవసర హెల్ప్‌లైన్‌లకు సమాచారం అందించాలని అధికారులు ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
Mrunal Thakur: వెడ్డింగ్ న్యూస్ తర్వాత ఇన్‌స్టాలో మృణాల్ ఠాకూర్ ఫస్ట్ పోస్ట్... ధనుష్ కనెక్షన్ ఉందా?
వెడ్డింగ్ న్యూస్ తర్వాత ఇన్‌స్టాలో మృణాల్ ఠాకూర్ ఫస్ట్ పోస్ట్... ధనుష్ కనెక్షన్ ఉందా?
Embed widget