By: ABP Desam | Updated at : 23 Apr 2022 01:12 PM (IST)
మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ లీడర్ సిద్ధు
పంజాబ్ కాంగ్రెస్ పరిస్థితిపై నవజ్యోత్ సింగ్ సిద్ధు సంచలన కామెంట్స్ చేశారు. మాఫీయారాజ్ కారణంగానే పార్టీ ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వీటన్నింటినీ అధిగమించి పార్టీని ఆవిష్కరించోవాల్సిన అవసరం ఉందన్నారు సిద్ధు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. పార్టీలో మార్పులు జరగాలని గట్టిగానే చెప్పారు.
"నేను ఇంతకుముందు మాట్లాడలేదు, కానీ ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంది. ఐదేళ్ల మాఫియా రాజ్ పాలన కారణంగా కాంగ్రెస్ ఓడిపోయింది." అని సిద్ధు సీరియస్ కామెంట్స్ చేశారు.
Congress Needs To 'Reinvent Itself', Says Sidhu As He Lauds 'Honest' #Bhagwantmann https://t.co/p2QgLV9WWd
— ABP LIVE (@abplive) April 23, 2022
మాఫియాకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పోరాడుతానన్నారు కాంగ్రెస్ నేత సిద్ధు. ఇసుక తవ్వకాలు, రవాణా, కేబుల్ టీవీ రంగాల్లో మాఫియాలు ఉన్నాయని గతంలోనే పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వాటి కారణంగానే ఓడిపోయినట్టు ఇప్పుడు చెబుతున్నారు.
" నా పోరాటం ఏ ఒక్కరిపైనా కాదు. ఇది వ్యవస్థకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో చెదపురుగుల్లా తినే కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా ఉంది"అని సిద్ధూ అన్నారు. తన పోరాటం పంజాబ్ ఉనికి కోసమే అన్నారు. ఏ పదవి కోసమో తాను ఇలాంటి విమర్సలు చేయడం లేదన్నారు.
"రాజకీయాలు వ్యాపారంగా ఉన్నంత వరకు అది గౌరవంగా ఉండదని..... పంజాబ్ మాఫియా రహితంగా మారినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని," అన్నారాయన.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై కూడా కాంగ్రెస్ నేత సిద్ధు పొగడ్తలతో ముంచెత్తారు. ఆన తన తమ్ముడని సంబోధిస్తూ..."నిజాయితీ గల వ్యక్తి" అని కూడా ప్రశంసించారు.
@sherryontopp @DrDrnavjotsidhu https://t.co/nv2umIiD6b
— Gurvarinder Singh Sanauria (@Gurvarinder13) April 23, 2022
మాఫియాకు వ్యతిరేకంగా పోరాడితే ప్రస్తుత ముఖ్యమంత్రి మన్కు మద్దతిస్తానని సిద్ధూ అన్నారు.
"అతను నిజాయితీపరుడు. నేనెప్పుడూ అతన్ని తప్పుపట్టలేదు. అతను మాఫికాయకు వ్యతిరేకంగా పోరాడితే, పార్టీ శ్రేణుల కంటే కూడా నా మద్దతు అతనికే ఉంటుంది, ఎందుకంటే ఇది పంజాబ్ ఉనికి కోసం పోరాటం"అని అభిప్రాయపడ్డారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ రాజా వారింగ్ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధు ఈ కామెంట్స్ చేశారు.
Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి
Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల
Uttarakashi Tunnel Rescue Updates: బయటకొచ్చేది ఎప్పుడో? ఉత్తరకాశి టన్నెల్ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం ఏం చెప్పారంటే?
Latest Gold-Silver Prices Today 28 November 2023: పట్టుకోలేనంత ఎత్తులో పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Bihar Govt: బిహార్ ప్రభుత్వ సంచలన నిర్ణయం- జన్మాష్టమి, రక్షాబంధన్, గురునానక్ జయంతి సెలవులు రద్దు
Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !
Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు
Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్ రాజ్
Telangana Elections 2023 : వైన్ షాపుల్లో సరుకంతా ఖాళీ - ముందుగానే మందుబాబుల జాగ్రత్త !
/body>