అన్వేషించండి

ప్రధాని మోదీ మంచి ఈవెంట్ మేనేజర్, అద్వాణి ఎప్పుడో చెప్పారు - జైరాం రమేశ్ సెటైర్లు

G20 Summit: మోదీ సర్కార్ G20 సదస్సుని కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

G20 Summit in India:

జీ 20 సదస్సుపై విమర్శలు..

మోదీ ప్రభుత్వం G20 సదస్సుని కూడా ఎలక్షన్ క్యాంపెయిన్‌గా మార్చుకుంటోందని కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీజేపీపై కాంగ్రెస్ విమర్శల డోస్ పెంచుతోంది. ఈ క్రమంలోనే ఈసారి G20 సదస్సుని టార్గెట్ చేసింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్విటర్‌లో హిందీలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ సదస్సుని కూడా బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని విమర్శించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

"G20 ని 1999లో ఏర్పాటు చేశారు. ఐరోపా సమాఖ్యతో పాటు 19 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ఇది ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 17 దేశాల్లో ఈ సదస్సులు జరిగాయి. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. కానీ...బీజేపీ మాత్రం ఇదేదో గొప్ప విషయంలా ప్రచారం చేసుకుంటోంది. ఎన్నికలతో ముడిపెట్టి రాజకీయం చేస్తోంది. జీ20 సదస్సు జరిగిన ఏ దేశం కూడా ఇలా ప్రచారం చేసుకోలేదు. ఇదంతా కావాలనే చేస్తున్న ప్రచారం. బీజేపీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది."

- జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ

రాజకీయం చేయడమేంటి..? 

భారత్‌ గతంలోనూ పలు ప్రతిష్ఠాత్మక సమావేశాలకు వేదిక అయిందని అన్నారు జైరాం రమేశ్. 1983లో  Non-Aligned Movement Summit తో పాటు కామన్‌ వెల్త్ కంట్రీస్ సమ్మిట్ కూడా నిర్వహించినట్టు గుర్తు చేశారు. కానీ..అప్పుడు వీటిని రాజకీయం చేయాలనే ఆలోచనే ఎవరికీ రాలేదని తేల్చి చెప్పారు. 

"2014 ఏప్రిల్ 5న ఎల్‌కే అద్వాణి చేసిన ప్రకటన ఇప్పుడు గుర్తు చేసుకోవాలనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని ఈవెంట్ మేనేజర్‌ అని వ్యాఖ్యానించారు అద్వాణి. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు మోదీ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇదంతా"

- జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ

ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు చేపట్టింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ అధ్యక్షుడు JP నడ్డా సహా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు హాజరయ్యారు. 

Also Read: కేటీఎమ్‌ బైక్‌పై స్టైలిష్‌ లుక్‌లో రాహుల్ గాంధీ, లద్దాఖ్‌లో పాంగాంగ్ లేక్ వరకూ లాంగ్ రైడ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు
India-China Direct Flights: 5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
Hyderabad CP Sajjanar: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
Gopichand 33: భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
Advertisement

వీడియోలు

Skeleton Lake: 16 వేల అడుగుల ఎత్తులో ఎటు చూసినా ఎముకలే..
Shubman Gill Performance | వరుసగా ఫెయిల్ అవుతున్న శుబ్మన్ గిల్
Rohit Sharma Records | India vs Australia ODI Series | రికార్డుల మోత మోగించిన రోహిత్
India vs Australia | Women's World Cup | ఆసీస్ తో భారత్ ఢీ
India vs Bangladesh | Women's World cup | బంగ్లాతో తలపడనున్న భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు
India-China Direct Flights: 5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
Hyderabad CP Sajjanar: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
Gopichand 33: భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
NBK111 Movie: బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా పూజకు మూహూర్తం ఖరారు... బడ్జెట్‌లో కోతలు??
బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా పూజకు మూహూర్తం ఖరారు... బడ్జెట్‌లో కోతలు??
Kurnool Bus Accident: 18 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత, ఒక మృతదేహంపై రాని క్లారిటీ
18 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత, ఒక మృతదేహంపై రాని క్లారిటీ
Cyclone Montha Impact in AP: మొంథా తుఫాన్ ముప్పు.. ఈ 30 వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
మొంథా తుఫాన్ ముప్పు.. ఈ 30 వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
Telangana Employees Salaries: తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
Embed widget