అన్వేషించండి

ప్రధాని మోదీ మంచి ఈవెంట్ మేనేజర్, అద్వాణి ఎప్పుడో చెప్పారు - జైరాం రమేశ్ సెటైర్లు

G20 Summit: మోదీ సర్కార్ G20 సదస్సుని కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

G20 Summit in India:

జీ 20 సదస్సుపై విమర్శలు..

మోదీ ప్రభుత్వం G20 సదస్సుని కూడా ఎలక్షన్ క్యాంపెయిన్‌గా మార్చుకుంటోందని కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీజేపీపై కాంగ్రెస్ విమర్శల డోస్ పెంచుతోంది. ఈ క్రమంలోనే ఈసారి G20 సదస్సుని టార్గెట్ చేసింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్విటర్‌లో హిందీలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ సదస్సుని కూడా బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని విమర్శించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

"G20 ని 1999లో ఏర్పాటు చేశారు. ఐరోపా సమాఖ్యతో పాటు 19 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ఇది ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 17 దేశాల్లో ఈ సదస్సులు జరిగాయి. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. కానీ...బీజేపీ మాత్రం ఇదేదో గొప్ప విషయంలా ప్రచారం చేసుకుంటోంది. ఎన్నికలతో ముడిపెట్టి రాజకీయం చేస్తోంది. జీ20 సదస్సు జరిగిన ఏ దేశం కూడా ఇలా ప్రచారం చేసుకోలేదు. ఇదంతా కావాలనే చేస్తున్న ప్రచారం. బీజేపీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది."

- జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ

రాజకీయం చేయడమేంటి..? 

భారత్‌ గతంలోనూ పలు ప్రతిష్ఠాత్మక సమావేశాలకు వేదిక అయిందని అన్నారు జైరాం రమేశ్. 1983లో  Non-Aligned Movement Summit తో పాటు కామన్‌ వెల్త్ కంట్రీస్ సమ్మిట్ కూడా నిర్వహించినట్టు గుర్తు చేశారు. కానీ..అప్పుడు వీటిని రాజకీయం చేయాలనే ఆలోచనే ఎవరికీ రాలేదని తేల్చి చెప్పారు. 

"2014 ఏప్రిల్ 5న ఎల్‌కే అద్వాణి చేసిన ప్రకటన ఇప్పుడు గుర్తు చేసుకోవాలనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని ఈవెంట్ మేనేజర్‌ అని వ్యాఖ్యానించారు అద్వాణి. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు మోదీ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇదంతా"

- జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ

ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు చేపట్టింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ అధ్యక్షుడు JP నడ్డా సహా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు హాజరయ్యారు. 

Also Read: కేటీఎమ్‌ బైక్‌పై స్టైలిష్‌ లుక్‌లో రాహుల్ గాంధీ, లద్దాఖ్‌లో పాంగాంగ్ లేక్ వరకూ లాంగ్ రైడ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: లక్నోపై రాజస్థాన్‌ ఘన విజయం, టేబుల్ టాపర్ గా శాంసన్ సేన
లక్నోపై రాజస్థాన్‌ ఘన విజయం, టేబుల్ టాపర్ గా శాంసన్ సేన
Harish Rao: పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే, సీఎం పదవి పోతుందని రేవంత్‌కు భయం: హరీష్ రావు
పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే, సీఎం పదవి పోతుందని రేవంత్‌కు భయం: హరీష్ రావు
Gangs of Godavari Teaser: 'మంచోడనే చెడ్డపేరు నాకోద్దు' - ఆసక్తి పెంచుతున్న విశ్వక్‌ సేన్‌ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' టీజర్‌
'మంచోడనే చెడ్డపేరు నాకోద్దు' - ఆసక్తి పెంచుతున్న విశ్వక్‌ సేన్‌ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' టీజర్‌
YS Jagan Tadipatri Tour: సీఎం జగన్ పర్యటన, తాడిపత్రిలో చెట్లు నరికివేత - సిగ్గుండాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
సీఎం జగన్ పర్యటన, తాడిపత్రిలో చెట్లు నరికివేత - సిగ్గుండాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Lucknow Super Giants vs Rajasthan Royals Highlights |టాప్ లేపిన రాయల్స్ ... లక్నోపై రాజస్థాన్ విజయంDelhi Capitals vs Mumbai Indians Highlights | ఫ్రెజర్ ఊచకతో..ముంబయి 6వ ఓటమి | ABP DesamMalkajgiri Congress MP Candidate Sunitha Mahender Reddy | ఈటెల నాన్ లోకల్..నేను పక్కా లోకల్ | ABPKadiyam Srihari vs Thatikonda Rajaiah | మందకృష్ణ మాదిగపై కడియం శ్రీహరి ఫైర్.. ఎందుకంటే..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: లక్నోపై రాజస్థాన్‌ ఘన విజయం, టేబుల్ టాపర్ గా శాంసన్ సేన
లక్నోపై రాజస్థాన్‌ ఘన విజయం, టేబుల్ టాపర్ గా శాంసన్ సేన
Harish Rao: పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే, సీఎం పదవి పోతుందని రేవంత్‌కు భయం: హరీష్ రావు
పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే, సీఎం పదవి పోతుందని రేవంత్‌కు భయం: హరీష్ రావు
Gangs of Godavari Teaser: 'మంచోడనే చెడ్డపేరు నాకోద్దు' - ఆసక్తి పెంచుతున్న విశ్వక్‌ సేన్‌ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' టీజర్‌
'మంచోడనే చెడ్డపేరు నాకోద్దు' - ఆసక్తి పెంచుతున్న విశ్వక్‌ సేన్‌ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' టీజర్‌
YS Jagan Tadipatri Tour: సీఎం జగన్ పర్యటన, తాడిపత్రిలో చెట్లు నరికివేత - సిగ్గుండాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
సీఎం జగన్ పర్యటన, తాడిపత్రిలో చెట్లు నరికివేత - సిగ్గుండాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
Fact Check: బీజేపీ అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అమిత్ షా! ఆ వీడియోలో నిజమెంత
బీజేపీ అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అమిత్ షా! ఆ వీడియోలో నిజమెంత
Revanth Reddy: ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
Allari Naresh: మొహమాటంతో కొన్ని సినిమాలు ఒప్పుకొని తప్పు చేశా: అల్ల‌రి న‌రేశ్
మొహమాటంతో కొన్ని సినిమాలు ఒప్పుకొని తప్పు చేశా: అల్ల‌రి న‌రేశ్
YS Sharmila Letter To CM Jagan :  ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ
ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ
Embed widget