అన్వేషించండి

Ram Mandir Pran Pratishtha: నిఘా నీడలో అయోధ్య- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో టైట్‌ సెక్యూరిటీ

Security For Ram Mandir Pran Pratishtha: అయోధ్యపై నిఘా పెట్టాయి భద్రతా బలగాలు. డేగ కళ్లతో కాపలా కాస్తున్నారు. రామ మందిరాన్ని, భక్తులను కాపాడేందుకు హైటెక్ గ్యాడ్జెట్లు వినియోగిస్తున్నారు.

Latest  Gadgets And Technologies Used For Ayodhya Ram Mandir Pran Pratishtha: మరో రెండు రోజుల్లో అయోధ్యలోని రామాలయ గర్భగుడిలో ఉంచిన బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుక చూసేందుకు వేలాది మంది చేరుకుంటారు. 100కుపైగా విమానాలు అయోధ్యలో ల్యాండ్ కానున్నాయి.

మీడియా ద్వారా ఇప్పటికే దేశ ప్రజలంతా బాల రాముడి దివ్య రూపాన్ని చూసి తరించి ఉంటారు. నల్లరాయితో తయారు చేసిన దివ్య మూర్తి రూపం చిద్విలాసంతో ఆకట్టుకుంటోంది. దీన్ని ప్రస్తుతం గర్భగుడిలో ఉంచారు. రెండు రోజుల తర్వాత పవిత్రమైన ప్రదేశంలో ఉంచి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అనంతరం ఈ విగ్రహానికి దైవత్వం ఆవహిస్తుంది. పరమ పవిత్రమైన శిలగా పూజలు అందుకోనుంది. 

ఈ పవిత్రమైన వేడుక కోససం యావత్ దేశం వెయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ప్రధాని మోడీ సహా పలువురు బడా నేతలు పాల్గొంటున్నారు. ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి వీవీఐపీ అతిథులు క్యూ కట్టనున్నారు. ఇలా భారీగా తరలి వచ్చే రామ భక్తుల భద్రత ఇప్పుడు అధికారులకు పెద్ద టాస్క్ 

అందుకే అయోధ్యపై పూర్తి నిఘా పెట్టాయి భద్రతా బలగాలు, వీఐపీ మూమెంట్ ఉన్నందున డేగ కళ్లతో కాపలా కాస్తున్నారు. రామ మందిరాన్ని, భక్తులను కాపాడేందుకు సైనికులు, ఎన్ఎస్జీ కమాండోలతోపాటు ఎన్నో హైటెక్ గ్యాడ్జెట్లు వినియోగిస్తున్నారు. 

రామ్ లల్లా ప్రతిష్ఠాపనను న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇది పెద్ద ఈవెంట్ కావడంతో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తోంది. అందుకే పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం అనేక హైటెక్ గ్యాడ్జెట్లు వినియోగిస్తోంది. 

క్లాష్‌-రేటెడ్ బొలార్డ్స్ 
బొల్లార్డ్స్ పెద్ద వాహనాల దాడి నుంచి ఏ భవనాన్ని అయినా రక్షిస్తాయి. ఆలయ ఆవరణలో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే బలార్డ్స్‌ను వినియోగిస్తున్నారు. ఎక్కడికక్కడ వీటిని మోహరించి ప్రమాదాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు. జన్మభూమి మార్గం గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని ఇవి స్కాన్ చేస్తాయి. అనుమానం ఉన్న వెహికల్స్‌ను గుర్తించి ‌అలర్ట్ చేస్తాయి.

టైర్ కిల్లర్స్
అనధికారిక వాహనాలను దూరం నుంచి ఆపి ఆలయం సమీపంలోకి రాకుండా నియంత్రించేందుకు ఈ టైర్ కిల్లర్స్‌ను వినియోగిస్తున్నారు.

ఏఐ సీసీటీవీలు
అయోధ్యలో రామ మందిర భద్రత కోసం 10 వేలకుపైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో కొన్ని ఏఐని ఉపయోగించారు.  అనుమానాస్పద వ్యక్తులను అక్కడికక్కడే గుర్తించగలవు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా 90 రోజుల వరకు రికార్డింగ్స్ భద్రపరుచుకోవచ్చు.

యాంటీ డ్రోన్ టెక్నాలజీ
రామ మందిర సముదాయం, దాని చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని నో డ్రోన్ జోన్‌గా ప్రకటించారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఆలయాన్ని సంరక్షిస్తున్నారు. ఏదైనా అనధికార డ్రోన్ లేదా వేరే ఏమైనా ఎగురుతున్నట్లు కనిపిస్తే రేడియో ఫ్రీక్వెన్సీ సహాయంతో అక్కడికక్కడే కూల్చివేస్తారు. కమాండ్ ప్రోటోకాల్స్ ఆధారంగా వ్యక్తిగత డ్రోన్ నమూనాలను కూడా ఈ టెక్నాలజీ గుర్తించగలదు 

ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్
ఈ మొత్తం కార్యక్రమం సజావుగా సాగేందుకు అయోధ్య చుట్టుపక్కల 20 చోట్ల ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ వ్యవస్థ ఉపయోగించనున్నారు. ఇందులో భాగంగా అన్ని రకాల కదలికలపై నిఘా పెట్టారు. వీవీఐపీల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ బూత్లు ఏర్పాటు చేసి నేరుగా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి ఉన్నారు. ఏదైనా తప్పు జరుగుతున్నట్టో... అనుమానం వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ లను ఉపయోగిస్తారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి జన సంచారం, భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోపాలు సవరించుకుంటూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మొత్తం కార్యక్రమంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించనున్నాయి.

Also Read: 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs: టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
IPL 2025 GT VS RR Result Update: టాప్ లేపిన గుజ‌రాత్.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. ఆక‌ట్టుకున్న‌ సుద‌ర్శ‌న్, ప్ర‌సిధ్.. హిట్ మెయ‌ర్ పోరాటం వృథా
టాప్ లేపిన గుజ‌రాత్.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. ఆక‌ట్టుకున్న‌ సుద‌ర్శ‌న్, ప్ర‌సిధ్.. హిట్ మెయ‌ర్ పోరాటం వృథా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటేDevon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs: టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
IPL 2025 GT VS RR Result Update: టాప్ లేపిన గుజ‌రాత్.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. ఆక‌ట్టుకున్న‌ సుద‌ర్శ‌న్, ప్ర‌సిధ్.. హిట్ మెయ‌ర్ పోరాటం వృథా
టాప్ లేపిన గుజ‌రాత్.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. ఆక‌ట్టుకున్న‌ సుద‌ర్శ‌న్, ప్ర‌సిధ్.. హిట్ మెయ‌ర్ పోరాటం వృథా
Andhra Pradesh Latest News: 1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Virat Kohli Sledging: కోహ్లీని స్లెడ్జ్ చేసిన టీమిండియా పేస‌ర్.. దీటుగా బ‌దులిచ్చిన విరాట్.. ఆనాటి జ్ఞాప‌కాన్ని గుర్తు చేసుకున్న స్టార్ బ్యాట‌ర్
కోహ్లీని స్లెడ్జ్ చేసిన టీమిండియా పేస‌ర్.. దీటుగా బ‌దులిచ్చిన విరాట్.. ఆనాటి జ్ఞాప‌కాన్ని గుర్తు చేసుకున్న స్టార్ బ్యాట‌ర్
Embed widget