అన్వేషించండి

Ram Mandir Pran Pratishtha: నిఘా నీడలో అయోధ్య- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో టైట్‌ సెక్యూరిటీ

Security For Ram Mandir Pran Pratishtha: అయోధ్యపై నిఘా పెట్టాయి భద్రతా బలగాలు. డేగ కళ్లతో కాపలా కాస్తున్నారు. రామ మందిరాన్ని, భక్తులను కాపాడేందుకు హైటెక్ గ్యాడ్జెట్లు వినియోగిస్తున్నారు.

Latest  Gadgets And Technologies Used For Ayodhya Ram Mandir Pran Pratishtha: మరో రెండు రోజుల్లో అయోధ్యలోని రామాలయ గర్భగుడిలో ఉంచిన బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుక చూసేందుకు వేలాది మంది చేరుకుంటారు. 100కుపైగా విమానాలు అయోధ్యలో ల్యాండ్ కానున్నాయి.

మీడియా ద్వారా ఇప్పటికే దేశ ప్రజలంతా బాల రాముడి దివ్య రూపాన్ని చూసి తరించి ఉంటారు. నల్లరాయితో తయారు చేసిన దివ్య మూర్తి రూపం చిద్విలాసంతో ఆకట్టుకుంటోంది. దీన్ని ప్రస్తుతం గర్భగుడిలో ఉంచారు. రెండు రోజుల తర్వాత పవిత్రమైన ప్రదేశంలో ఉంచి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అనంతరం ఈ విగ్రహానికి దైవత్వం ఆవహిస్తుంది. పరమ పవిత్రమైన శిలగా పూజలు అందుకోనుంది. 

ఈ పవిత్రమైన వేడుక కోససం యావత్ దేశం వెయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ప్రధాని మోడీ సహా పలువురు బడా నేతలు పాల్గొంటున్నారు. ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి వీవీఐపీ అతిథులు క్యూ కట్టనున్నారు. ఇలా భారీగా తరలి వచ్చే రామ భక్తుల భద్రత ఇప్పుడు అధికారులకు పెద్ద టాస్క్ 

అందుకే అయోధ్యపై పూర్తి నిఘా పెట్టాయి భద్రతా బలగాలు, వీఐపీ మూమెంట్ ఉన్నందున డేగ కళ్లతో కాపలా కాస్తున్నారు. రామ మందిరాన్ని, భక్తులను కాపాడేందుకు సైనికులు, ఎన్ఎస్జీ కమాండోలతోపాటు ఎన్నో హైటెక్ గ్యాడ్జెట్లు వినియోగిస్తున్నారు. 

రామ్ లల్లా ప్రతిష్ఠాపనను న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇది పెద్ద ఈవెంట్ కావడంతో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తోంది. అందుకే పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం అనేక హైటెక్ గ్యాడ్జెట్లు వినియోగిస్తోంది. 

క్లాష్‌-రేటెడ్ బొలార్డ్స్ 
బొల్లార్డ్స్ పెద్ద వాహనాల దాడి నుంచి ఏ భవనాన్ని అయినా రక్షిస్తాయి. ఆలయ ఆవరణలో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే బలార్డ్స్‌ను వినియోగిస్తున్నారు. ఎక్కడికక్కడ వీటిని మోహరించి ప్రమాదాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు. జన్మభూమి మార్గం గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని ఇవి స్కాన్ చేస్తాయి. అనుమానం ఉన్న వెహికల్స్‌ను గుర్తించి ‌అలర్ట్ చేస్తాయి.

టైర్ కిల్లర్స్
అనధికారిక వాహనాలను దూరం నుంచి ఆపి ఆలయం సమీపంలోకి రాకుండా నియంత్రించేందుకు ఈ టైర్ కిల్లర్స్‌ను వినియోగిస్తున్నారు.

ఏఐ సీసీటీవీలు
అయోధ్యలో రామ మందిర భద్రత కోసం 10 వేలకుపైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో కొన్ని ఏఐని ఉపయోగించారు.  అనుమానాస్పద వ్యక్తులను అక్కడికక్కడే గుర్తించగలవు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా 90 రోజుల వరకు రికార్డింగ్స్ భద్రపరుచుకోవచ్చు.

యాంటీ డ్రోన్ టెక్నాలజీ
రామ మందిర సముదాయం, దాని చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని నో డ్రోన్ జోన్‌గా ప్రకటించారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఆలయాన్ని సంరక్షిస్తున్నారు. ఏదైనా అనధికార డ్రోన్ లేదా వేరే ఏమైనా ఎగురుతున్నట్లు కనిపిస్తే రేడియో ఫ్రీక్వెన్సీ సహాయంతో అక్కడికక్కడే కూల్చివేస్తారు. కమాండ్ ప్రోటోకాల్స్ ఆధారంగా వ్యక్తిగత డ్రోన్ నమూనాలను కూడా ఈ టెక్నాలజీ గుర్తించగలదు 

ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్
ఈ మొత్తం కార్యక్రమం సజావుగా సాగేందుకు అయోధ్య చుట్టుపక్కల 20 చోట్ల ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ వ్యవస్థ ఉపయోగించనున్నారు. ఇందులో భాగంగా అన్ని రకాల కదలికలపై నిఘా పెట్టారు. వీవీఐపీల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ బూత్లు ఏర్పాటు చేసి నేరుగా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి ఉన్నారు. ఏదైనా తప్పు జరుగుతున్నట్టో... అనుమానం వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ లను ఉపయోగిస్తారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి జన సంచారం, భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోపాలు సవరించుకుంటూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మొత్తం కార్యక్రమంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించనున్నాయి.

Also Read: 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget