అన్వేషించండి

Fact Check:  అయోధ్య రామ మందిరానికి రూ.50 కోట్లు విరాళం ఇచ్చిన ప్రభాస్‌? నిజమెంతంటే!

Prabhas Donation to Ram Mandir: ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే  చిర్ల జగ్గిరెడ్డి కామెంట్స్‌తో ఇప్పుడంతా 'డార్లింగ్‌' గురించే మాట్లాడుకుంటున్నారు.

Prabhas Donates 50 Crore to Ram Mandir: ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే  చిర్ల జగ్గిరెడ్డి కామెంట్స్‌తో ఇప్పుడంతా 'డార్లింగ్‌' గురించే మాట్లాడుకుంటున్నారు. జనవరి 22న జరిగే అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠకు ప్రభాస్‌ రూ. 50 కోట్లు విరాళం ఇచ్చారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఇప్పుడు ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం చూసిన దీనిపైనే చర్చ జరుగుతుంది. ఎందుకుంటే దీనిపై ఇప్పటి వరకు ప్రభాస్‌ కానీ ఆయన టీం నుంచి కానీ విరాళం ఇచ్చినట్టు ఎక్కడ అధికారిక ప్రకటన లేదు. దీంతో ప్రభాస్‌ విరాళం ఇచ్చారా? లేదా? అనేది ఇప్పుడు అందరిలో నెలకొన్న సందేహం.

ఈ క్రమంలో అసలు విషయం బయటకు వచ్చింది. నిజానికి ఇప్పటి వరకు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ప్రభాస్‌కు అసలు ఆహ్వానమే అందలేదట. ఈ విషయం షాకిస్తున్న అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అసలు ఆహ్వానమే అందని ప్రభాస్‌ ఆలయం ప్రారంభోత్సవం కార్యక్రమం రోజున అందించే ఆహార ఖర్చులను చూసుకునేందుకు ముందుకు వచ్చాడంటూ ఇటీవల ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కామెంట్స్‌తో ప్రభాస్‌ అయోధ్య రామమందిరానికి విరాళం ప్రకటించాడంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఈ రూమర్లకు చెక్‌ పెట్టెందుకు తాజాగా ప్రభాస్‌ టీం స్పందించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రామమందిరం కోసం ప్రభాస్‌ ఎలాంటి విరాళం ఇవ్వలేదని, అంతేకాదు ఎలాంటి ఆహార ఖర్చులు చూసుకుంటానని ఆయన మాట కూడా ఇవ్వలేదని ఓ బాలీవుడ్‌ మీడియాకు వెల్లడించినట్టు మరో వార్త బయటకు వచ్చింది.

ప్రభాస్ కు అందని ఆహ్వానం

కాగా మరో మూడు రోజుల్లో జరిగే అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, ధనుష్‌లతో పాటు కొందరు సౌత్ సెలబ్రిటీలకు మాత్రం ఆహ్వానం అందింది. అయితే ఇందులో ప్రభాస్‌ పేరు లేకపోవడంతో ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతున్నారు. మరి చివరిక వరకైనా ప్రభాస్‌కు ఆహ్వానం అందుతుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే నవరి 22న మధ్యాహ్నం 12:15 నుండి 12:45 వరకు ఆలయంలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. అలాగేఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్‌ ద్వారా దాదాపు 7 వేల మందికి పైగా ఆహ్వానం అందినట్లు సమాచారం.

కాగా ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి రాజా సాబ్‌, నాగ్‌ అశ్విన్‌ కల్కి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల మారుతి చిత్రం 'రాజా సాబ్‌' నుంచి ఫస్ట్‌లుక్‌ విడుదల కాగా దీనికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. హారర్‌ అండ్‌ కామెడీ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్టు ఇటీవల టీం పేర్కొంది. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి AD 2898 అనే సైన్స్ ఫిక్షన్ చిత్రం త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుంది. బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్‌ కానుకగా విడుదల చేయబోతున్నట్టు సినీ వర్గాల నుంచి సమాచారం.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget