అన్వేషించండి

Ram Mandir Inauguration Live Stream: థియేటర్లలో అయోధ్య రాముని పండుగ లైవ్‌, పాప్ కార్న్, కూల్ డ్రింక్ ఫ్రీ

Ram Mandir Inauguration Live: దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రామ మందిర ప్రారంభోత్సవానికి రెండు రోజులు మాత్రమే మాత్రమే మిగిలి ఉంది. ఈ వేడుకలను బిగ్ స్క్రీన్లపై వీక్షించొచ్చు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir)లో రామ్‌లల్లా (Ram Lalla) ప్రాణ ప్రతిష్ట ఏర్పాట్లు వైభవంగా సాగుతున్నాయి. దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రామ మందిర(Ramalayam) ప్రారంభోత్సవానికి రెండు రోజులు మాత్రమే మాత్రమే మిగిలి ఉంది. జనవరి 22 సోమవారం బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Modi)తో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు తరలిరానున్నారు. 

లైవ్‌లో చూసే అవకాశం
ప్రాణప్రతిష్ట మహాక్రతువును ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. మరికొందరు టీవీల్లో చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న టీవీ ఛానెళ్లు లైవ్ ఈ మహత్తర కార్యక్రమాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థలు పీవీఆర్‌(PVR), ఐనాక్స్‌(INOX)లు అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకలను పెద్ద స్క్రీన్లపై చూసే అవకాశం కల్పిస్తున్నాయి. రూ.100 టికెట్‌తోనే థియేటర్లలో కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. 

170 స్క్రీన్లలో ప్రత్యక్ష ప్రసారం
గతంలో పీవీఆర్‌, ఐనాక్స్‌లు వన్డే ప్రపంచ కప్‌ మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అదే తరహాలో ఇప్పుడు అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడులకను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. దేశవ్యాప్తంగా 70 ప్రధాన నగరాల్లోని 170 కంటే ఎక్కువ కేంద్రాల్లో అయోధ్య ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేసేలా పీవీఆర్‌, ఐనాక్స్ ఏర్పాట్లు చేశాయి. జనవరి 22వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ మహాక్రతువును బిగ్ స్క్రీన్‌పై చూడొచ్చు. అయితే ఇందుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇందులో కూల్‌ డ్రింక్స్‌, పాప్‌కార్న్ ఉచితంగా అందిస్తున్నారు. ఆయా మల్టీప్లెక్స్‌ల అధికారిక వెబ్‌ సైట్, బుక్‌ మై షోలోనూ అయోధ్య రాముడి పండగ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. పీవీఆర్ ఐనాక్స్ కో-సీఈవో గౌతం దత్తా మాట్లాడుతూ.. ‘ఇదొక చారిత్రక ఘట్టం. అందుకే పెద్ద తెరపై చూసేందుకు అయోధ్య రాముడి ప్రారంభోత్సవాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలిపారు.

సినీ ప్రముఖులకు ఆహ్వానం
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలకు ప్రపంచ నలుమూలలోని ప్రముఖులకు ఆహ్వానం అందింది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌ దంపతులు, మోహన్‌ బాబు, ప్రభాస్, అలాగే ఇతర పరిశ్రమల నుంచి రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, రిషబ్ శెట్టి, యష్, కంగనా రనౌత్, అలియా భట్ తదితర ప్రముఖులు అయోధ్య రాముడి వేడుకలో ప్రత్యక్షంగా భాగం కానున్నారు. కార్యక్రమం జనవరి 22న మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తుంది. 

121 మందితో ప్రాణ ప్రతిష్ట
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. వీరిలో కొద్ది మందిని మాత్రమే గర్భాలయంలోకి అనుమతిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ ఆధ్వర్యంలో 121 మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారని కమిటీ వెళ్లడించింది. ఈ కార్యక్రమాలకు కాశీకి చెందిన లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ ప్రధాన ఆచార్యుడిగా వ్యవహరించబోతున్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
Pawan Kalyan - Surender Reddy Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
Pawan Kalyan - Surender Reddy Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు ఇవే!
ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు ఇవే!
2026 In India: ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
Youtuber Anvesh:పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
Embed widget