అన్వేషించండి

Amit Shah: మణిపూర్ సమస్యపై చర్చించడానికి రెడీ - అమిత్ షా ప్రకటన, సభలు వాయిదా

మణిపూర్ సమస్య గురించి సభల్లో చర్చించడానికి తాము రెడీగా ఉన్నామని అమిత్ షా లోక్ సభలో వెల్లడించారు.

మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, హింసాకాండపై సోమవారం (జూలై 24) పార్లమెంట్ ఉభయ సభల్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మణిపూర్ సమస్య గురించి సభల్లో చర్చించడానికి తాము రెడీగా ఉన్నామని అమిత్ షా లోక్ సభలో వెల్లడించారు. ఈ అంశంపై చర్చకు సహకరించాలని ప్రతిపక్షాలను అభ్యర్థిస్తున్నానని అమిత్ షా అన్నారు. ఈ సున్నితమైన అంశం గురించి దేశ ప్రజలకు నిజం తెలియడం చాలా ముఖ్యమని అన్నారు. మొత్తానికి సభ్యుల నినాదాలు, గందరగోళం మధ్య లోక్ సభ మంగళవారం (జూలై 25) ఉదయం 11 గంటలకు వాయిదా పడింది.

మణిపూర్ అంశంపై పార్లమెంటులో దుమారం

పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా సోమవారం రాజ్యసభ, లోక్‌సభ రెండింటిలోనూ ప్రతిపక్ష సభ్యులు మణిపూర్‌పై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రతిపక్షాల నిరసన సమయంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను వర్షాకాల సమావేశాలు ముగిసే దాకా రాజ్యసభ ఛైర్మన్ సస్పెండ్ చేశారు. అంతకుముందు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో మాట్లాడుతూ పార్లమెంటులో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

మల్లికార్జున ఖర్గే ఏం మాట్లాడారంటే?

ఈ విషయంపై రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. తాము కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ విషయంలో ప్రధాని తన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. 140 కోట్ల మందికి చెందిన ప్రతినిధులు సభ లోపల కూర్చుంటే ముందు ప్రధాని స్టేట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మణిపూర్‌లో కాస్త అదుపులో అల్లర్లు

మే 3న మణిపూర్‌లో రిజర్వేషన్‌ డిమాండ్‌పై కుకీ, మైతేయి వర్గాల మధ్య కుల హింస చెలరేగిన సంగతి చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు 160 మందికి పైగా మరణించారు. గత వారం మణిపూర్‌కు చెందిన మహిళల నగ్న ఊరేగింపు వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత దేశమంతా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

మణిపూర్‌లో కాస్త అదుపులో అల్లర్లు

మే 3న మణిపూర్‌లో రిజర్వేషన్‌ డిమాండ్‌పై కుకీ, మైతేయి వర్గాల మధ్య కుల హింస చెలరేగిన సంగతి చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు 160 మందికి పైగా మరణించారు. గత వారం మణిపూర్‌కు చెందిన మహిళల నగ్న ఊరేగింపు వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత దేశమంతా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

అమిత్ షాను కలిసిన బండి సంజయ్

బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ సోమవారం (జూలై 24) ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం మంత్రితో మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని కలిసిన అనంతరం బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ విజయం సాధించేందుకు మంచి పని చేయాలని అమిత్ షా అన్నారు. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చేలా బీజేపీ వ్యూహం రచిస్తూ ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget