అన్వేషించండి

Azadi Ka Amrit Mahotsav: గాంధీజీ కొల్లాయి కట్టడానికి కారణమేంటి? ఆ సంఘటనే మార్పు తెచ్చిందా?

Mahatma Gandhi: మహాత్మా గాంధీజీ తన చివరి శ్వాస విడిచేంత వరకూ కొల్లాయి కట్టుకునే జీవనం సాగించారు. తనకు ఎదురైన ఓ అనుభవమే వస్త్రధారణను మార్చుకునేలా చేసిందని అప్పట్లో వివరించారు.

Azadi Ka Amrit Mahotsav: 

చివరి శ్వాస వరకూ అదే వస్త్రధారణతో..

దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా..ఈ సారి వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఆంగ్లేయుల పాలన నుంచి భారత దేశానికి విముక్తి కలిగించే క్రమంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా పోరాటం చేశారు. గడప దాటి ఆయుధం పట్టి పోరాడిన వాళ్లు కొందరైతే, అహింసాయుత మార్గంలో బ్రిటీష్‌ వారిపై దండెత్తిన వాళ్లు మరికొందరు. ఈ రెండో దళానికి నాయకుడిగా ముందుండి నడిపించారు మహాత్మా గాంధీ. ఆంగ్లేయుల అవమానాన్ని భరించి, స్వదేశానికి తిరిగి వచ్చి అహింసా ఉద్యమాన్ని మొదలు పెట్టారు బాపూజీ. ఈ ఉద్యమం ప్రారంభించిన నాటి నుంచి ఆఖరి శ్వాస విడిచే వరకూ ఆయన ఒకే వేష ధారణతో ఉన్నారు. కొల్లాయి కట్టుకునే పాదయాత్ర చేశారు. చేతిలో కర్రనే ఊతంగా చేసుకుని ఎన్నో మైళ్లు నడిచారు. లక్షలాది మందిలో
స్వాతంత్య్ర స్ఫూర్తి రగిలించారు. ఆయన కొల్లాయి మాత్రమే కట్టుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు..? అమరులయ్యే వరకూ ఇదే సిద్ధాంతాన్ని ఎందుకు అనుసరించారు..? 

కొల్లాయి కట్టడానికి కారణమిదే..

దాదాపు 100 సంవత్సరాల క్రితం 1921 సెప్టెంబర్ 22వ తేదీన మహాత్మా గాంధీ ఓ నిర్ణయం తీసుకున్నారు. "ఇక నుంచి నేను కొల్లాయి మాత్రమే కట్టుకుంటాను" అని గట్టిగా నిశ్చయించుకున్నారు. గుజరాతీ శైలిలో ఓ ధోతి, శాలువాను మాత్రమే ధరించాలని భావించారు. మదురైలో ఈ నిర్ణయం తీసుకున్న గాంధీజీ అప్పటి నుంచి అదే అనుసరించారు. పేద ప్రజల కోసం, వారి స్వేచ్ఛ కోసం కచ్చితంగా పోరాడాలి అని అనుకున్న మరుక్షణమే ఇలా తన వస్త్రధారణను మార్చుకున్నారు. అప్పట్లో ప్రజలు ఇదే వస్త్రధారణతో ఉండే వారు. సామాన్యులలో సామాన్యుడిగా కలిసిపోవాలంటే ఇదొక్కటే మార్గమని భావించారు. విదేశాలకు వెళ్లినా సరే అదే వస్త్రధారణతో వెళ్లేవాడు. ఇలా తిరిగినందుకు ఎప్పుడూ సిగ్గు పడలేదు బాపూజీ. కొంత మంది హేళన చేసినా..వాటిని పట్టించుకోలేదు. 

"నాకు ఎదురైన అనుభవాల వల్లే, నాకు నేనుగా నా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకున్నాను. ఎంతో ఆలోచించాక మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకున్నాను. ఈ విషయంలో నేను ఎప్పటికీ బాధ పడను. వస్త్రధారణ విషయంలోనూ ఇంతే కఠినంగా నిర్ణయం తీసుకున్నాను" -మహాత్మా గాంధీ. 

ఆ ఘటనే మార్పు తీసుకొచ్చింది..

నిజానికి ఇదేమీ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నో సంఘటనలు, సందర్భాలు చూసిన తరవాత ఆయన తన వస్త్రధారణను మార్చుకోవాలని అనుకున్నారు. చివరకు తమిళనాడులోని మదురై అందుకు వేదికగా మారింది. అందుకే ఎన్నో సందర్భాల్లో గాంధీజీ...మదురై గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే వారు. "అంతకు ముందు నేను నా వస్త్రధారణను మార్చుకునేందుకు ఎంతో ప్రయత్నించినా ఎందుకో కుదరలేదు. మదురైకి రాగానే ఆ సంకల్పం నెరవేరింది" అని చెబుతుండేవారు. ఇలా మార్చుకోవటానికి ప్రేరేపించిన సంఘటనలనూ వివరించారు. 

"మద్రాస్ నుంచి మదురైకి రైళ్లో వెళ్తున్నాను. బోగీ అంతా కిక్కిరిసిపోయింది. చాలా సేపటి తరవాత నేనో విషయం గ్రహించాను. అందరూ విదేశీ దుస్తులే ధరించారు. అది చూసి గుండె చివుక్కుమంది. వెంటనే వాళ్ల దగ్గరకు వెళ్లి "ఖాదీ దుస్తులు ధరించండి" అని బతిమాలాను. వారు దానికి ఖాదీని కొనుగోలు చేసేంత డబ్బు మా దగ్గర లేదు. మేము బీదవాళ్లం అని సమాధానమిచ్చారు. అప్పుడు కానీ అర్థం కాలేదు. ప్రజలు ఎందుకు ఖాదీ ధరించటం లేదో. అప్పుడు నేను చొక్కా, టోపీ, ధోతీతో ఉన్నాను. వాళ్ల మాటల్లో నిజం లేకపోలేదు. కానీ...అప్పటికే లక్షలాది మంది ప్రజలు ఖాదీనే వినియోగించాలనే ఉద్దేశంతో అర్ధనగ్నంగానే జీవనం సాగిస్తున్నారు. నాలుగు అంగుళాల వెడల్పున్న కొల్లాయి కట్టుకుంటున్నారు. నేను నిండుగా దుస్తులు ధరించి... దేశ ప్రజలందరూ విదేశీ దుస్తులను విడిచిపెట్టి, ఖాదీ ధరించాలని నేనేలాచెప్పగలను..? తరవాత మదురైకి వెళ్లాను. అక్కడ సమావేశం జరిగిన మరుసటి రోజు ఉదయమే నా వస్త్రధారణ మార్చుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాను" అని చెప్పారు గాంధీజీ. అయితే తన అనుచరులు, తన సన్నిహితులు అందరూ ఇదే వస్త్రధారణలో ఉండాలన్న నియమం ఆయన ఎప్పుడూ పెట్టలేదు. విదేశీ దుస్తుల్ని బహిష్కరించి, ఖాదీ ధరించాలని మాత్రమే పిలుపునిచ్చారు.

మార్చుకునేదే లేదు..

మహాత్మా గాంధీ తన వస్త్రధారణ మార్చుకోవటంపై రకరకాల విమర్శలు వచ్చాయి. ఓసారి బంకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ జార్జ్‌తో సమావేశానికి హాజరయ్యారు గాంధీజీ. ఆ మీటింగ్‌కి కూడా కొల్లాయితోనే వెళ్లారు. ఇలా రాకూడదని అక్కడి బ్రిటీష్ అధికారులు ఆయనను నిరాకరించారు. గాంధీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దుస్తులు మార్చుకునేది లేదు అని తేల్చి చెప్పారు. బ్రిటీష్ వారి వల్లే భారతీయులు ఇలా అర్ధనగ్నంగా జీవించాల్సి వస్తుందన్న తన ఆవేదనను చాలా బలంగా చెప్పారు. "కింగ్ జార్జ్‌ను కలిసినప్పుడైనా నిండుగా దుస్తులు ధరించి వెళ్లాల్సింది కదా" అని కొందరు అధికారులు ప్రశ్నిస్తే "మా ఇద్దరికీ సరిపడా దుస్తులను, మీ రాజు ఒక్కడే వేసుకున్నాడులే" అని సమాధానమిచ్చారట గాంధీ. 

Also Read: దసరా మూవీ షూటింగ్‌లో నానికి తప్పిన ప్రమాదం, చిత్రీకరణకు కాసేపు విరామం

Also Read: Friendship Day: ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ అవసరం కోసం మాత్రమే కాదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Cyclone Compensation : తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
Power Restoration in AP :మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
Minister Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
Tamilnadu ED: క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
Advertisement

వీడియోలు

Montha Effect | అర్థరాత్రి కుప్పకూలిన వీరబ్రహ్మేంద్రస్వామి చారిత్రక గృహం | ABP Desam
Hurricane Melissa batters Jamaica | జ‌మైకాను నాశనం చేసిన మెలిసా హరికేన్ | ABP Desam
US Airforce Records Inside Hurricane Melissa | హరికేన్ మెలిస్సా ఎంత ఉద్ధృతంగా ఉందో చూడండి | ABP Desam
Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Cyclone Compensation : తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
Power Restoration in AP :మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
Minister Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
Tamilnadu ED: క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
Alert for train passengers: రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ -  తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ - తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
New districts in AP: ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది  దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
Amazon layoff: ఉద్యోగుల్ని విచ్చలవిడిగా  తీసేస్తున్న అమెజాన్ - ఏఐనే కారణమా?
ఉద్యోగుల్ని విచ్చలవిడిగా తీసేస్తున్న అమెజాన్ - ఏఐనే కారణమా?
Hero Splendor Price : హీరో స్ప్లెండర్ ఢిల్లీలో కొనడం మంచిదా? హైదరాబాద్‌లో కొనడం బెటరా? ఎక్కడ చౌకగా లభిస్తుంది?
హీరో స్ప్లెండర్ ఢిల్లీలో కొనడం మంచిదా? హైదరాబాద్‌లో కొనడం బెటరా? ఎక్కడ చౌకగా లభిస్తుంది?
Embed widget