Voter ID Cleanup : SIR వచ్చేసింది - తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లూ.. ఇక జాగ్రత్త పడండి !
Election Commission SIR: భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన SIR మూడో దశకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ , తెలంగాణలోనూ ఈ సారి జరుగుతుంది.

Election Commission Orders Sir Phase 3: భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించే లక్ష్యంతో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఇప్పుడు మూడో దశకు చేరుకుంది. గురువారం నాడు ఈసీ వెలువరించిన తాజా ఆదేశాల ప్రకారం.. పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, హర్యానాతో పాటు తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం 16 రాష్ట్రాలు , 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. గతేడాది బీహార్లో ప్రారంభమైన ఈ స్పెషల్ రివిజన్, ఇప్పుడు దేశంలోని మెజారిటీ రాష్ట్రాలకు విస్తరించింది.
36.73 కోట్ల మంది ఓటర్ల కవరేజ్
ఈ మూడో దశలో దాదాపు 36.73 కోట్ల మంది ఓటర్ల డేటాను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇందుకోసం సుమారు 3.94 లక్షల మంది బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామాలు మారిన వారి వివరాలను సరిచేయడం, కొత్త ఓటర్లను చేర్చడం, డూప్లికేట్ ఎంట్రీలను ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉన్న వాటిని తొలగించడం ఈ డ్రైవ్ ప్రధాన ఉద్దేశ్యం. రాజకీయ పార్టీలు కూడా తమ తరపున 3.42 లక్షల మంది బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి ఈ ప్రక్రియను పర్యవేక్షించవచ్చు.
జనగణనతో అనుసంధానం
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సెన్సస్ హౌస్ లిస్టింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని, ఈ SIR షెడ్యూల్ను ఈసీ ఖరారు చేసింది. రెండింటికీ ఒకే రకమైన యంత్రాంగం అందుబాటులో ఉండటం వల్ల పనులు వేగంగా పూర్తవుతాయని కమిషన్ భావిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ , లడఖ్ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు, సెన్సస్ ఫేజ్-2 పనుల దృష్ట్యా, అక్కడ షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని ఈసీ స్పష్టం చేసింది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ మే నెలాఖరు నాటికి ముమ్మరం కానుంది.
Special Intensive Revision – Phase III
— Election Commission of India (@ECISVEEP) May 14, 2026
SIR to be conducted in phased manner in 16 States and 3 UTs
Read more : https://t.co/gAv53Frppn pic.twitter.com/bXMC7rjLj7
తొలి రెండు దశల ప్రస్థానం
ఇప్పటికే మొదటి రెండు దశల్లో భాగంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రత్యేక ప్రక్షాళన పూర్తయింది. అక్కడ సుమారు 59 కోట్ల మంది ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. తాజా మూడో దశతో కలిపి దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది. ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ లింకింగ్ వంటి అంశాలపై కూడా ఈ సమయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
పారదర్శకతే లక్ష్యం
ఓటర్ల జాబితాలో ఎటువంటి అవకతవకలు జరగకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే తమ ప్రాధాన్యతని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొని, బూత్ స్థాయిలో సహకరించాలని ఈసీ కోరింది. 2027లో జరగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందే లోప రహిత ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలనే పట్టుదలతో కమిషన్ ఈ భారీ కసరత్తును నిర్వహిస్తోంది.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















