అన్వేషించండి

J&K Assembly Polls: ఆర్టికల్ 370 రద్దు తరవాత జమ్ముకశ్మీర్‌లో తొలి అసెంబ్లీ ఎన్నికలు, కసరత్తు మొదలు పెట్టిన ఈసీ

J&K Assembly Polls 2024: జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 20లోగా తుది ఓటరు జాబితాని ప్రకటించనుంది.

J&K Assembly Elections 2024: జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. జమ్ముకశ్మీర్‌తో పాటు హరియాణా, ఝార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకూ రంగం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 20 నాటికి ఓటరు జాబితాని విడుదల చేసేందుకు ప్లాన్‌ రెడీ చేసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు లేఖలు రాసింది. ఈ మేరకు ఓటరు జాబితాని రివిజన్ చేసుకోవాలని స్పష్టం చేసింది. పోలింగ్ స్టేషన్‌లను గుర్తించడం, వాటిని పోలింగ్‌కి అనుగుణంగా మార్చడం లాంటి ప్రక్రియని జూన్ 25 నుంచి మొదలు పెట్టాలని ఆదేశించింది. హరియాణా, ఝార్ఖండ్‌, జమ్ముకశ్మీర్, మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నందున ఓటరు జాబితాని జులై 1వ తేదీలోగా ఫైనల్ చేయాలని స్పష్టం చేసింది. జులై 25న ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ని విడుదల చేయనున్నారు. ఆ తరవాత ఆగస్టు 9వ తేదీ వరకూ అందులో మార్పులు చేర్పులకు అవకాశముంటుంది. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా, మరింకే సమస్య తలెత్తినా ఆలోగా పరిష్కరిస్తారు. ఆ తరవాత ఆగస్టు 20వ తేదీన తుది జాబితా అధికారికంగా విడుదల చేస్తారు. చివరిసారి జమ్ముకశ్మీర్‌లో 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో బీజేపీ పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. తరవాత 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. 

జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికల ప్రణాళికను ఫైనల్ చేయాలని ఆదేశించింది. ఇక హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీల గడువు నవంబర్‌తో ముగియనుంది. ఝార్ఖండ్‌ అసెంబ్లీ గడువు 2025 జనవరితో ముగుస్తుంది. ఈ లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్‌లో ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదైంది. 35 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఓటు శాతం నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget