![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kaushal Kishore: ప్లీజ్, దయచేసి తాగుబోతుకు పిల్లనివ్వకండి: కేంద్రమంత్రి
Kaushal Kishore: మద్యం సేవించేవారికి దయచేసి పిల్లనివ్వొద్దని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
![Kaushal Kishore: ప్లీజ్, దయచేసి తాగుబోతుకు పిల్లనివ్వకండి: కేంద్రమంత్రి Don't Marry Off Your Daughters To Alcoholics, Says Kaushal Kishore While Recalling His Son's Death Kaushal Kishore: ప్లీజ్, దయచేసి తాగుబోతుకు పిల్లనివ్వకండి: కేంద్రమంత్రి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/8870f9738b29b587cd9f1f4a96c672c81671964964298432_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kaushal Kishore: మద్యం సేవించే అధికారికి పిల్లనివ్వడం కంటే రిక్షా పుల్లర్ లేదా కూలీకి ఇవ్వడం ఎంతో మేలని కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ అన్మారు. ఆడపిల్లలను మద్యపానం చేసేవారికి కట్టబెట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉత్తర్ప్రదేశ్ లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన డి-అడిక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తాను ఎంపీగా తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా తమ కుమారుడి ప్రాణాలను కాపాడలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సామాన్య ప్రజలను ఎలా కాపాడగలనంటూ భావోద్వేగానికి గురయ్యారు.
नशामुक्त समाज आंदोलन 'अभियान कौशल का' के तहत आयोजित प्रतियोगिता में नशे के खिलाफ जागरूक करते हुए छोटे छोटे बच्चों द्वारा जागरूकता पेंटिंग की कुछ झलक-
— Kaushal Kishore (@mp_kaushal) December 24, 2022
आप सभी अपने और परिवार के बच्चों की परवाह करें व नशामुक्त रहें, उन्हे भी नशामुक्त रखे।
बच्चे बूढ़े और जवान,
नशामुक्त हो हिंदुस्तान। pic.twitter.com/9SVJk4JQXB
80 శాతం క్యాన్సర్ మరణాలు పొగాకు, సిగరెట్లు, బీడీల వ్యసనానికి కారణమని ఆయన అన్నారు. డీ-అడిక్షన్ కార్యక్రమంలో ఇతర సంస్థలు కూడా భాగస్వాములు కావాలని, వారి కుటుంబాలను రక్షించాలని ఆయన కోరారు.
జిల్లాను వ్యసనా రహితంగా మార్చేందుకు డీ అడిక్షన్ క్యాంపెయిన్ను అన్ని పాఠశాలలకు తీసుకెళ్లాలని, ఉదయం ప్రార్థన సమయంలోనే పిల్లలకు దీనిపై సలహాలు ఇవ్వాలని మంత్రి సూచించారు. ఉత్తర్ప్రదేశ్లోని మోహన్లాల్గంజ్ లోక్సభ నియోజకవర్గానికి కిశోర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ములాయం సింగ్ యాదవ్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. 2013లో భారతీయ జనతా పార్టీలో చేరి 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా తరపున పోటీ చేసి తొలిసారి మోహన్లాల్గంజ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో రెండోసారి ఎంపీగా ఎన్నికై నరేంద్ర మోదీ మంత్రివర్గంలో గృహ, పట్టణ వ్యవహారాల శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Also Read: China Covid Surge: చైనాలో అల్లకల్లోలం- 20 రోజుల్లో 25 కోట్ల మందికి కొవిడ్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)