అన్వేషించండి

Bengal assembly: బెంగాల్ అసెంబ్లీలో కొట్టుకున్న బీజేపీ, తృణమూల్ ఎమ్మెల్యేలు - మమతా బెనర్జీ కామెంట్సే కారణం !

TMC vs BJP: బెంగాల్ అసెంబ్లీలో తృణమూల్, బీజేపీ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. బీజేపీపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు.

Chaos in Bengal assembly: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో గురువారం (సెప్టెంబర్ 4, 2025) జరిగిన సమావేశం రణరంగాన్ని తలపించింది. బెంగాలీ మాట్లాడే వలస కార్మికులపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులను ఖండిస్తూ తీర్మానంపై చర్చ సందర్భంగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఆమె ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కేకలు, నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు. స్పీకర్ బిమన్ బెనర్జీ ఆదేశాల మేరకు మార్షల్స్ బీజేపీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుండి బయటకు తీసుకెళ్లారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ చర్చ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతుండగా, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి సస్పెన్షన్‌ను ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. ఈ గందరగోళంలో బీజేపీ చీఫ్ విప్ శంకర్ ఘోష్‌ను స్పీకర్ బిమన్ బెనర్జీ ఆ రోజు మిగిలిన సమావేశం నుండి సస్పెండ్ చేశారు. ఘోష్ సభ నుండి వెళ్లడానికి నిరాకరించడంతో, మార్షల్స్ అతన్ని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో శంకర్ ఘోష్ గాయపడ్డారని బీజేపీ ఆరోపించింది.

తర్వాత నినాదాలు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్రా పాల్‌ను కూడా సస్పెండ్ చేశారు.  మహిళా మార్షల్స్ ద్వారా బయటకు తీసుకెళ్లారు. తర్వాత ఎమ్మెల్యేలు మిహిర్ గోస్వామి, అశోక్ దిండా, బంకిమ్ ఘోష్‌లను కూడా సస్పెండ్ చేశారు. ఈ సంఘటనలతో అసెంబ్లీ దాదాపు 15 నిమిషాల పాటు గందరగోళంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నీటి సీసాలు విసిరారని, టీఎంసీ ఎమ్మెల్యేలు కూడా ప్రతిగా నినాదాలు చేశారని పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.  

మమతా బెనర్జీ తన ప్రసంగంలో బీజేపీని బెంగాల్ వ్యతిరేక, అవినీతిపరులు, ఓటు చోరీలో నిమగ్నమైన పార్టీగా విమర్శించారు. "బీజేపీ బెంగాలీ భాష, పేదలు, ఎస్సీలు, హిందువులకు వ్యతిరేకం. వారు అతి పెద్ద దొంగల ముఠాలు  , ఓటు చోరీలో నిమగ్నమైన పార్టీ," అని ఆమె ఆరోపించారు. బీజేపీ బెంగాలీలపై  వివక్ష చూపిస్తోందని  దీనివల్ల బెంగాల్‌లో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా గెలవకుండా ప్రజలే నిర్ణయిస్తారని ఆమె అన్నారు.  "బీజేపీ ఢిల్లీ నుండి రిమోట్ కంట్రోల్‌తో బెంగాల్‌ను తమ కాలనీగా మార్చాలని కోరుకుంటోంది. వారు పార్లమెంట్‌లో మా ఎంపీలను సీఐఎస్‌ఎఫ్‌తో వేధించారు, ఇప్పుడు బెంగాల్‌లో కూడా మా గొంతును అణచివేయాలని చూస్తున్నారు," అని విమర్శించారు.  

సభలో జరిగిన సంఘటనలను "బెంగాల్‌లో ప్రజాస్వామ్య హత్య"గా బీజేపీ అభివర్ణించింది.  బీజేపీ చీఫ్ విప్ శంకర్ ఘోష్‌పై మార్షల్స్ దాడి చేశారని.. ఆరోపిస్తున్నారు.  2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బెంగాలీ గుర్తింపు, ఓటరు జాబితాల తారుమారు,   బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు వంటి అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
Chandrababu Naidu CII meeting: మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
Hydra Ayudha Puja: హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
Advertisement

వీడియోలు

West Indies Cricket | ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో వెస్ట్ ఇండీస్ ఓ విచిత్రం | ABP Desam
Adilabad Seasonal Fruits : ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ గా లభించే పండ్లు.. ఉపాధి పొందుతున్న ఆదివాసీలు
నేటి నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్..  47 ఏళ్ల భారత నిరీక్షణ తీరేనా?
మరి కొద్ది రోజుల్లో భారత్‌తో టెస్టు సిరీస్.. కీలక ప్లేయర్ దూరం
అంతర్జాతీయ క్రికెట్‌కి క్రిస్ వోక్స్ వీడ్కోలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
Chandrababu Naidu CII meeting: మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
Hydra Ayudha Puja: హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
Kantara Ticket Price In AP: ఏపీలో 'కాంతార'కు టికెట్ రేట్స్ పెరిగాయ్... విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని ప్రభుత్వం
ఏపీలో 'కాంతార'కు టికెట్ రేట్స్ పెరిగాయ్... విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని ప్రభుత్వం
New GST Rates: GST మార్పుల తర్వాత పప్పు నుంచి షాంపు వరకు అన్నింటిపై నిఘా పెట్టిన కేంద్రం
GST మార్పుల తర్వాత పప్పు నుంచి షాంపు వరకు అన్నింటిపై నిఘా పెట్టిన కేంద్రం
Women ODI World Cup 2025: సూర్య అనుకున్నది చేశాడు! హర్మన్‌ప్రీత్ ఏం చేస్తుంది? పాక్ కెప్టెన్‌తో చేయి కలపాలా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
సూర్య అనుకున్నది చేశాడు! హర్మన్‌ప్రీత్ ఏం చేస్తుంది? పాక్ కెప్టెన్‌తో చేయి కలపాలా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Konaseema News:కోనసీమలో విషాదం: కిరాణా కొట్టులో పేలుడు, భార్యాభర్తలు మృతి, దీపావళి బాణాసంచా కారణం?
కోనసీమలో విషాదం: కిరాణా కొట్టులో పేలుడు, భార్యాభర్తలు మృతి, దీపావళి బాణాసంచా కారణం?
Embed widget