అన్వేషించండి

OBC Census : "జనాభా లెక్కలు" సరైన వేదిక కాదు .. ఓబీసీ కులగణనకు 'నో' చెప్పిన కేంద్రం !

ఓబీసీ కులగణనకు "జనాభా లెక్కలు" సరైన వేదిక కాదని కేంద్రం తెలిపింది. జనాభా లెక్కలతో పాటు కులగణన చేయడం సాధ్యం కాదని తెలిపింది. ఓబీసీ కులగణనకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ క్లారిటీ ఇచ్చింది.


జనాభా లెక్కల్లో ఈ సారి ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు చెందిన కులాల జనాభాను కూడా లెక్కించాలని దేశవ్యాప్తంగా వస్తున్న డిమాండ్లను కేంద్రం తిరసేకరించింది.  వెనుకబడిన కులాల జనాభా గణనకు జనాభా లెక్కల సేకరణ సరైన సాధనం కాదని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన జనాభాను మినహా కులాలవారీగా జనాభా లెక్కలను సేకరించలేదని కేంద్రమంత్రి స్పష్టం చేసారు. 

Also Read : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఊరట.. ఇక ప్రతి శుక్రవారం ఆ అవసరం లేదు!

దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి ఓబీసీ జనగణన చేపట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ప్రత్యేకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపుతున్నారు. ఢిల్లీలో బీసీ సంఘాలు ధర్నా కూడా చేశాయి. దీనికి అన్ని పార్టీల నేతలూ మద్దతిచ్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు ఓబీసీ జనగణన చేయడం సాధ్యం కాదని తేల్చేయడం ఆసక్తి రేపుతోంది. 

Also Read: Lakhimpur Kheri Case: 'మైక్ బంద్ కరో బే..' ABP రిపోర్టర్‌పై కేంద్ర మంత్రి ఫైర్.. వీడియో వైరల్

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపి జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం షెడ్యూలును రూపొందిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో జనాభా సంఖ్యను లేదా ఏదైనా సామాజిక వర్గానికి సంబంధించిన జనాభాను లెక్కించడం నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఉద్దేశం కాదని మంత్రి స్పష్టం చేశారు. వర్గీకరణ అవసరాల కోసమే ఎన్‌ఎస్‌ఎస్‌ ఇంటింటి సర్వే చేపడుతుందని తెలిపారు.  

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదు, 247 మంది మృతి

ఓబీసీ కులగణన చేపట్టలేమని కేంద్రం చెప్పడం లేదు. అయితే జనాభా లెక్కల్లో భాగంగా చేపట్టడం సాధ్యం కాదని కేంద్రం చెబుతోంది. అయితే జనాభా లెక్కలతో పాటే ఆయా బలహీనవర్గాల ప్రజల్ని  గుర్తిస్తే సామాజిక న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని దేశవ్యాప్తంగా  అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం స్పందనపై ఓబీసీ జనగణనకు మద్దతిస్తున్న వారి స్పందన ఎలా ఉంటుందన్న దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తి ఏర్పడింది. 

Also Read: Captain Varun Singh Death: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదిశ్వాస వరకూ పోరాటమే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Enquiry On Erravalli Farmhouse: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్
CM Revanth Reddy: ధరణి పేరుతో బీఆర్ఎస్ భారీ కుట్ర.. విదేశాల్లోని మాఫియా చేతికి భూముల వివరాలు: సీఎం రేవంత్
ధరణి పేరుతో బీఆర్ఎస్ భారీ కుట్ర.. విదేశాల్లోని మాఫియా చేతికి భూముల వివరాలు: సీఎం రేవంత్
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
తెలంగాణలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు సింగపూర్ నిర్ణయం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డితో భేటీ
తెలంగాణలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు సింగపూర్ నిర్ణయం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డితో భేటీ

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
Embed widget