అన్వేషించండి

Apple : రూల్స్ ప్రకారం యాప్ స్టోర్ డేటా ఇవ్వని యాపిల్ - ఇండియాలో రూ. 3,800 కోట్ల జరిమానా గండం?

Apple fine: యాప్ స్టోర్ నిబంధనల ఉల్లంఘన కేసులో అడిగిన ఆర్థిక వివరాలను సమర్పించకపోవడంతో ఇండియాలో యాపిల్‌కు రూ. 3,800 కోట్ల జరిమానా గండం పొంచి ఉంది.

Apple to face Rs 3800 crore fine: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు  కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి గట్టి సెగ తగులుతోంది. యాప్ స్టోర్ నిబంధనల ఉల్లంఘన కేసులో అడిగిన ఆర్థిక వివరాలను సమర్పించకపోవడంతో, యాపిల్‌పై సుమారు రూ. 3,800 కోట్ల భారీ పెనాల్టీ పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారత మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, యాప్ డెవలపర్లను తన సొంత పేమెంట్ వ్యవస్థనే వాడాలని ఒత్తిడి చేస్తోందన్న ఆరోపణలపై గత కొంతకాలంగా విచారణ సాగుతోంది. తాజాగా ఈ విచారణ తుది దశకు చేరుకోవడంతో యాపిల్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.                           
 
భారత మార్కెట్లో తమది చాలా చిన్న పాత్ర అని, తాము ప్రధాన ప్లేయర్లం కాదని యాపిల్ వాదిస్తోంది. అయితే యాపిల్ వాదనను సిసిఐ కొట్టివేస్తోంది. గణాంకాల ప్రకారం.. రెండేళ్ల క్రితం భారత్‌లో 4 శాతంగా ఉన్న ఐఫోన్ల మార్కెట్ వాటా ప్రస్తుతం 9 శాతానికి పైగా పెరిగింది. ఈ వేగవంతమైన వృద్ధిని చూస్తుంటే, యాపిల్ తన మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని సిసిఐ 2024 నివేదికలో స్పష్టం చేసింది. తన వ్యాపారం పెరుగుతున్న కొద్దీ, పాత వాదనలతో తప్పించుకోవడం యాపిల్‌కు ఇప్పుడు కష్టతరంగా మారింది.                
 
అక్టోబర్ 2024 నుండి యాపిల్ తన ఆర్థిక వివరాలను సమర్పించకుండా కాలయాపన చేస్తోందని నియంత్రణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జరిమానా మొత్తాన్ని నిర్ణయించడానికి ఈ డేటా అత్యంత కీలకమని సిసిఐ స్పష్టం చేసింది. అయితే, యాపిల్ మాత్రం ఈ వ్యవహారాన్ని ఢిల్లీ హైకోర్టుకు తీసుకెళ్లింది. జరిమానాల లెక్కింపుపై ఉన్న నిబంధనలను సవాల్ చేస్తూ, విచారణను నిలిపివేయాలని కోరినప్పటికీ సిసిఐ అందుకు నిరాకరించింది. గ్లోబల్ టర్నోవర్ ఆధారంగా జరిమానా వేస్తే అది అన్యాయమని యాపిల్ వాదిస్తోంది.                     
 
యాపిల్ అభ్యర్థనలను తోసిపుచ్చిన సిసిఐ, వివరణ ఇవ్వడానికి మరో రెండు వారాల గడువు మాత్రమే ఇచ్చింది. ఈ కేసుపై మే 21వ తేదీని తుది విచారణా దినంగా ఖరారు చేసింది. ఒకవేళ ఆ లోపు సరైన డేటా ఇవ్వకపోతే, లభించిన సమాచారం ఆధారంగానే భారీ పెనాల్టీ విధిస్తామని హెచ్చరించింది. ఈ కేసులో వెలువడే తీర్పు భవిష్యత్తులో భారత్‌లో ఇతర అంతర్జాతీయ టెక్ కంపెనీల పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.                        
 
భారత్‌ను తన తదుపరి అతిపెద్ద తయారీ కేంద్రంగా మార్చుకోవాలని చూస్తున్న యాపిల్‌కు, ఈ చట్టపరమైన సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఒకవైపు ఐఫోన్ల విక్రయాలు పెరుగుతున్నా, మరోవైపు నియంత్రణ సంస్థల కొరడా దెబ్బ యాపిల్ లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మే 21న జరగబోయే విచారణలో యాపిల్ ఎలాంటి అస్త్రాలను ప్రయోగిస్తుందోనని టెక్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్- విచారణ 13కి వాయిదా!
ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్- విచారణ 13కి వాయిదా!
Jagadish Reddy: పంప్ ఆన్ చేసి నీళ్లివ్వండి.. ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటాం: జగదీష్ రెడ్డి
పంప్ ఆన్ చేసి నీళ్లివ్వండి.. ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటాం: జగదీష్ రెడ్డి
Warangal Crime News: భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sugali Parvathi Devi On Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Aha Series OTT : కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Warangal Crime News: భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Embed widget