అన్వేషించండి

CM Jagan Vizag Visit: నేడు విశాఖకు సీఎం జగన్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

CM Jagan Vizag Visit: ఏపీ సీఎం జగన్ గురు నేడు వారం రోజు విశాఖలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

CM Jagan Vizag Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నేడు విశాఖకు రాబోతున్నందును ముఖ్యమంత్రి జగన్ టూర్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 2.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా పీఎం పాలెంలోని వైఎస్సార్ స్టేడియం బి గ్రౌండ్ కు జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించ నున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో ఏపీ సీఎం జగన్ పాల్గొంటారు. 

ఎండాడ వద్ద కాపు భవనానికి శంకుస్థాపన, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు భూమిపూజ

సాయంత్రం 4.30 నుంచి 4.50 గంటల మధ్య భీమిలి నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశం అవుతారు. సమావేశం ముగిసిన అనంతరం 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి సీఎం జగన్ వెళ్తారు. 5.05 గంటలకు అపోలో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అనంతరం ఫోటో సెషన్, రేడియేషన్ ఎక్విప్మెంట్ వీక్షణ ఉంటుంది. తర్వాత 5.35 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ఆరిలోవ అపోలో ఆసుపత్రి నుండి సీ హేరియర్ మ్యూజియానికి బయలుదేరి వెళ్తారు. 6 గంటల వరకు బీచ్ రోడ్డులోని సీ హేరియర్ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత రామ్ నగర్ లోని కమర్షియల్ కాంప్లెక్స్, ఎంవీపీ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా ఫౌండేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత ఎండాడ వద్ద కాపు భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం భీమిలి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భూమి పూజా చేస్తారు.

పీఎం పాలంలోని ఏసీఏ-వీడీసీఏ వద్ద 50 అడుగులు భారీ హోర్డింగ్

వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వైజాగ్ స్టాండ్స్ విత్ యూ.. థాంక్యూ సీఎం సార్ అంటూ నినదిస్తున్నారు. ఆయన ఈరోజు విశాఖకు వస్తున్నందున పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వద్ద సీఎం కార్యక్రమం ప్రాంతంలో దాదాపు 50 అడుగుల భారీ హోర్డింగ్ ను కొందరు ప్రజలు స్వచ్ఛద్ధంగా ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే ఈరోజు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లలో పాల్గొంటారు. 

మే 24న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టూర్

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5వ తేదీన జరగాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన వాయిదా పడినట్లు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ఇదే నెల 24వ తేదీన సీఎం జగన్ పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించారు. అలాగే ' వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం కార్యక్రమాన్ని మే 24వ తేదీన కొవ్వూరులో నిర్వహిస్తామని మంత్రి తానేటి వనిత వివరించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs RR Match Highlights | లాస్ట్ ఓవర్ థ్రిల్లర్..KKR పై రాజస్థాన్ సూపర్ విక్టరీ | IPL 2024 | ABPCivils Ranker Sahana Interview | యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ యువతి సత్తా | ABP DesamCivils Ranker Arpitha Khola Interview | IPS అవుతున్నారుగా.. ఏం మార్చగలరు..! | ABP DesamCivils Ranker Dheeraj Reddy Interview | ప్లాన్ 'B' నమ్ముకున్నా.. అందుకే సివిల్స్ సాధించా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Nidhhi Agerwal: 'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Embed widget