Breaking News Telugu Live Updates: Kamareddy News: హాస్టల్లో విద్యార్థి మృతి.. వార్డెన్ సస్పెండ్
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం

Background
హైదరాబాద్లోని ఎంజే మార్కెట్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దాదాపుగా భౌతిక దూకుడినే పరిస్థితి తలెత్తిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అది కూడా Z+ సెక్యూరిటీ ఉండే వ్యక్తికి సెక్యూరిటీ లోపం తలెత్తిందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం నివేదిక అందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనిపై త్వరలోనే రాతపూర్వకంగా వివరణ ఇవ్వనున్నారు. గతంలోనూ అసోం ప్రభుత్వం, సీఆర్పీఎఫ్ సైతం ఇదే విషయమై తెలంగాణ హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. హైదరాబాద్ ఎంజే మార్కెట్ వద్ద గణేశ్ నిమజ్జనం వేదికపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రసంగించేందుకు సిద్ధం కాగా, టీఆర్ఎస్ కార్యకర్త మైక్ లాక్కునేందుకు ప్రయత్నించడం ఉద్రికత్తలకు దారితీసింది.
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. ఈ అల్పపీడనం క్రమంగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరానికి చేరుకుని మరికొన్ని గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నేడు (సెప్టెంబర్ 10న) నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సెప్టెంబర్ 10న ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో విస్తారంగా వర్షాలు పడతాయి. మిగతా చోట్ల చల్లని గాలులు వేగంగా వీస్తాయి. భారీ వర్ష సూచనతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనుండగా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గుంటూరు, ప్రకాశం క్రిష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
గద్వాల జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు దుర్మరణం, రొకరి పరిస్థితి విషమం
జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోని గోశాల వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. డీసీఎంను ఓవర్ టేక్ చేయబోయిన బైక్ అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
జీఎస్టీ నుండి అన్ని అంశాల్లో కేసీఆర్ అండగా నిలిచిండు: పొన్నం ప్రభాకర్
కేసీఆర్ ముచ్చట.. అక్బర్ బీర్బల్ కథలా వుంది.
వంకాయ కూర బాగుందంటే బాగుందని భజన బ్యాచ్ అంటున్నారు
కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే ఆయన భజన మండలి ఆహా హోహో అంటున్నారు
బిజెపికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే
మొదటి నుండి బిజెపికి మద్దతిచ్చిన పార్టీ టీఆరెస్
జీఎస్టీ నుండి అన్ని అంశాల్లో కేసీఆర్ అండగా నిలిచిండు
80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఒక్కసారి మీ పాలన వెనక్కి తిరిగి చూసుకోండి
ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరలేదు
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఏమైంది.
ఇక ఉద్యోగుల జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు
తెలంగాణ పబ్లిక్ కు ఇచ్చిన హామీలు అమలు చేసి దేశ రాజకీయాల గురించి మాట్లాడు
త్రీడి షో తప్పా ఏమి లేదు
కాంగ్రెస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినం
ఇప్పుడు ఒక్కటి అమలు కావడం లేదు
కొత్త బిచ్చగాళ్లుగా టీఆరెస్, బిజెపి నేతలు కొట్లాడుకుంటున్నారు
రేషన్ షాపుల వద్ద, మరుగు దొడ్ల వద్ద మా ఫోటోలు లేవంటే మా ఫోటోలు లేవని కొట్లాడుకుంటున్నారు.
జాతీయ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి
కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు
మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది
ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో మా సీటు కాదు
మునుగోడు మా సీటు.. మేము దక్కించుకుంటాం
నేను కూడా ప్రచారానికి వెళ్తా
నాకు సీనియార్టీ వచ్చినప్పుడు గాంధీ భవన్ మీటింగ్ లో, ప్రియాంక గాంధీ వద్ద మీటింగ్ లో హాజరవుతా
అప్పటి వరకు నా నియోజకవర్గంలో నే ఉంటా..





















