అన్వేషించండి

Budvel TDP : బద్వేలు ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థి ఖరారు .. వైఎస్ఆర్‌సీపీ తరపున ఎవరంటే..!?

ఆంధ్రప్రదేశ్‌లో బద్వేలు ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఉపఎన్నికకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో టీడీపీ అభ్యర్థిని చంద్రబాబు ఖరారు చేశారు. వైసీపీ అభ్యర్థిగా మహిళా డాక్టర్ పేరును పరిశీలిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాన్సిచ్చారు. ఆయనే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు. ఆయనపై వైసీపీ తరపున పోటీ చేసిన గుంతోటి వెంకట సుబ్బయ్య 44వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. అయితే కరోనా కారణంగా అనారోగ్యానికి గురైన వెంకట సుబ్బయ్య గత మార్చి 26న కన్నుమూశారు. ఈ కారణంగా ఉపఎన్నిక అని వార్యమయింది. నిబంధనల ప్రకారం అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లోపు ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఎన్నికల సంఘం వాయిదా వేయడంతో ఆలస్యం అయింది. ఇంకా షెడ్యూల్ రాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా స్పష్టత లేదు. అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్థిని ఖరారు చేశారు. 

Also Read: తెలుగు రాష్ట్రాలకు రాని పెట్టుబడిదారులు

వైసీపీ తరపున ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. వైసీపీ తరుపున దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధకే టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే ఉపఎన్నికలు కాబట్టి అక్కడ అభివృద్ధి పనులకు సీఎం జగన్ నిధులు మంజూరు చేస్తున్నారు. పలు అభివృద్ధిపనులకు గతంలోనే శంకుస్తాపన చేశారు. తాజాగా బద్వేలును రెవిన్యూ డివిజన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం వచ్చినా తమ ప్రాంతానికి ఏమీ జరగలేదన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఏర్పడకుండా సీఎం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

Also Read : డ్రగ్స్ కేసులో పూనం కౌర్‌కు తెలిసిన సీక్రెట్స్ ఏంటి..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లా కంచుకోట లాంటిది. బద్వేలు నియోజకవర్గంలో ఇటీవలి కాలంలో  టీడీపీ గెలవలేదు. రిజర్వుడు నియోజకవర్గం కాక ముందు టీడీపీకి ప్రధాన నేతగా బిజివేముల వీరారెడ్డి ఉండేవారు.  ఆయన తెలుగుదేశం పార్టీ తరపున అప్రతిహతంగా గెలుస్తూ వచ్చారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితి మారింది.  ఆయన మరణంతో 2001లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమార్తె విజయమ్మ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2004లో ఆమె పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గం రిజర్వుడు కేటగిరిలోకి వెళ్లింది. అయినప్పటికీ పార్టీ బాధ్యతలు ఆమే చూసుకుంటూ వచ్చారు. ఆ కుటుంబం చెప్పిన వారికే టిక్కెట్ ఇస్తూ వచ్చారు. అయితే రెండేళ్లుగా ఆమె పెద్దగా రాజకీయాల్లో వేలు పెట్టడం లేదు. దీంతో బద్వేలు టీడీపీలో పరిస్థితి స్తబ్దుగా మారింది. 
  Also Read : 2 కేజీల బంగారం కొట్టేసి..దాచుకోలేక దొరికిపోయాడు..!
విజయమ్మ ఆశీస్సులతోనే గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓబుళాపురం రాజశేఖర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఆయనకు పార్టీపై ఉన్న పట్టు తక్కువ. ఈ సారి కూడా అభ్యర్థిని ఖరారు చేసే సమావేశాలకు విజయమ్మ రాలేదు. కానీ చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడి తన అంగీకారం తెలిపారు. దీంతో టీడీపీ అధినేత అభ్యర్థిని ఖరారు చేశారు. మరో వైపు పొత్తులో ఉన్న బీజేపీ,, జనసేన ఈ ఉపఎన్నిక గురించి ఆలోచించడం లేదు. గతంలో తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి పోటీ పడిన  ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఆసక్తి చూపే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే బద్వేలులో ఎవరెవరు పోటీ చేస్తారన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Israel Strike On Iran: ప్లీజ్ మమ్మల్ని కాపాడండి.. భారత ప్రభుత్వాన్ని కోరిన టెహ్రాన్‌లో చిక్కుకున్న విద్యార్థి
ప్లీజ్ మమ్మల్ని కాపాడండి.. భారత ప్రభుత్వాన్ని కోరిన టెహ్రాన్‌లో చిక్కుకున్న విద్యార్థి
AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget