అన్వేషించండి

Weddig Vibes: అంబానీ ఇంట పెళ్లి విందు, సామాన్యలకు కొసరి కొసరి వడ్డించిన ముకేష్‌ అండ్ ఫ్యామిలీ

Anath Ambani Wedding: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లివేడుకలు ఘనంగా సాగుతున్నారు. అనంత్ పెళ్లి సందర్భంగా జామ్‌నగర్ చుట్టుపక్కల గ్రామస్తులకు విందు ఏర్పాటు చేశారు. ముఖేష్ కొసరికొసరి వడ్డించారు

Mukesh Ambani: కోట్లాది రూపాయలతో సెట్టింగ్‌లు, వేలాది రకాల వంటలతో అతిథులకు విందు భోజనాలు...వారం, పదిరోజుల పాటు గానాభజానాలతో  పెళ్లివేడుకలు నిర్వహిస్తున్నారు. ఓ మోస్తరు కలిగిన కుటుంబాల్లో పెళ్లిళ్లకు ఖర్చు వంద కోట్లుకు పైగా దాటిపోతుంది. ఆ వేడుకల వైపు కాదుకదా..కనీసం వాళ్లి ఇంటి గోడలవైపు కూడా సామాన్యులు చూసే సాహసం చేయరు. ఆ దరిదాపుల్లోకి కూడా ఎవ్వరిని రానివ్వరు. కానీ ఆసియా అపర కుభేరుడిగా పేరుగాంచిన రిలయన్స్(Reliance) ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) ఇంటి పెళ్లి వేడుకలకు సామాన్య ప్రజలను ఆహ్వానించడమే కాదు...స్వయంగా ముఖేశ్ అంబానీనే కొసరి కొసరి వడ్డించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పల్లెప్రజలతో కలిసి పాల్గొని పెద్దమనసు చాటుకున్నారు.

Image

Image

Image
Weddig Vibes: అంబానీ ఇంట పెళ్లి విందు, సామాన్యలకు కొసరి కొసరి వడ్డించిన ముకేష్‌ అండ్ ఫ్యామిలీ
ముఖేష్అంబానీ పెద్దమనసు   
రిలయన్స్(Reliance) ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్అంబానీ(Mukesh Ambani) ఇంట పెళ్లివేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధికమార్చంట్ వివాహం జులైలో జరగనుండగా....మార్చి 1 నుంచి మూడు రోజులపాటు ముందస్తు పెళ్లివేడుకలు నిర్వహించనున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌(Jamnagar)లో దీనికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవిదేశాల నుంచి తరలిరానున్న అతిథుల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.ఫైవ్‌స్టార్ హోటల్ సౌకర్యాలతో వసతి సౌకర్యాలు, 2500 రకాల వంటలతో విందు భోజనాలు పెట్టనున్నారు.  జామ్‌నగర్‌కు సమీపంలోని రిలయన్స్‌ టౌన్ షిప్ వద్ద నెలరోజుల నుంచే వీటికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న తంతు గురించి చుట్టు పక్కల ప్రాంతాల వారు కథలు, కథలుగా చెప్పుకుంటున్నవారు కొందరైతే...ఏం చేసినా, ఎంతఖర్చు పెట్టినా మనల్ని ఏమైనా పిలుస్తారా ఏంటీ అని విమర్శించిన వాళ్లు ఉన్నారు. కనీసనం మనల్ని  ఆ చుట్టుపక్కలకు కూడా రానివ్వరని విసుక్కునే వారు ఉన్నారు. కానీ ముఖేష్ అంబానీ(Mukesh Ambani) చాలా పెద్దమనసు  చాటుకున్నారు. తన కుమారుడి వివాహ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల వారందరినీ ఆహ్వానించారు. పెళ్లికి ముందే వారందరికీ అన్నసేవా కార్యక్రమంలో భాగంగా విందు భోజనాలు వడ్డించారు. రిలయన్స్ టౌన్‌షిప్‌కు సమీపంలోని జోగ్‌వాడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖేశ్ అంబానీతోపాటు వధూవరులు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్యులకు స్వయంగా ముఖేశ్ అంబానీనే కొసరికొసరి వడ్డించారు. తమ బిడ్డను ఆశీర్వదించాల్సిందిగా అందిరినీ కోరారు. గుజరాతీ సంప్రదాయ వంటకాలను విందుభోజనంలో చేర్చారు. అందరికీ స్వీట్లు వడ్డించిన ముఖేష్అంబానీ వారి కళ్లల్లో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూశారు. నూతన వధూవరులను ఆయన గ్రామస్తులకు పరిచయం చేశారు.
Weddig Vibes: అంబానీ ఇంట పెళ్లి విందు, సామాన్యలకు కొసరి కొసరి వడ్డించిన ముకేష్‌ అండ్ ఫ్యామిలీ
విందు, వినోదం 
విందు భోజనం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గ్రామస్తులతో కలిసి ముఖేష్అంబానీ కుటుంబం పాల్గొంది. వారితో కలిసి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో వధువు కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు. తమ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పదార్థాల రుచి చూడలేదని స్థానికులు తెలిపారు. లక్షల కోట్ల అధిపతి అయిన ఆయన మాకు స్వయంగా వడ్డించడాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. ఆయన విలువైన సమయాన్ని మాతో గడపడం ఆనందంగా ఉందన్నారు. మొత్తం 51 వేలమంది గ్రామాస్తులకు విందు భోజనం వడ్డించనున్నారు. వీరందరికీ ఒకేరోజు కాకుండా కొన్నిరోజుల పాటు ఈ అన్నసేవా కార్యక్రమం కొనసాగనుంది. పెళ్లి వేడుకలకు సామాన్యలను పిలిచి విందు భోజనం పెట్టడంపై ముఖేశ్‌ గొప్పతనాన్ని పలువురు ప్రసంసిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

KTR News: కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
MLC Shambhipur Raju: కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు తీవ్ర గాయాలు.. కిమ్స్ ఆసుపత్రికి తరలింపు!
MLC Shambhipur Raju: కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు తీవ్ర గాయాలు.. కిమ్స్ ఆసుపత్రికి తరలింపు!
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget