అన్వేషించండి

Amrit Bharat Trains: రేపటి నుంచి పట్టాలెక్కనున్న అమృత్‌ భారత్‌ రైలు- ఏపీలోని ఈ స్టేషన్‌ల మీదుగా ట్రైన్

అమృత్‌ భారత్‌ రైళ్లు రేపటి నుంచి పట్టాలెక్కనున్నాయి. రేపు ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించున్నారు. అమృత్‌ భారత్‌ రైళ్లలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ప్రయాణించనుంది.

Amrit Bharat Trains: ఇండియన్‌ రైల్వే కొత్తగా ప్రవేశపెడుతున్న 'అమృత్‌ భారత్‌'ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు(Amrit Bharat Express) రేపు(శనివారం) పట్టాలెక్కనున్నాయి. అందులో భాగంగా  పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా - బెంగళూరుల మధ్య నడిచే అమృత్‌ భారత్‌ ఎక్‌ప్రెస్‌ రైలును రేపు ప్రధాని మోడీ(PM Modi) లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు ఆంధ్ర  ప్రదేశ్‌ మీదుగా ప్రయాణించనుంది. ఏపీలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా..  ప్రయాణిస్తుంది అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు. ఈ ట్రైన్‌లో 12 స్లీపర్‌ క్లాస్‌, 8 జనరల్‌, 2 గార్డు బోగీలు ఉంటాయి. ఈ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.  గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.

పుష్-పుల్ టెక్నాలజీతో తయారయ్యాయి అమృత్ భారత్ రైళ్లు. పుష్-పుల్ టెక్నాలజీలో... రెండు ఇంజన్లను కలిగి ఉంటుంది. ఒకటి ముందు. మరొకటి వెనుక ఉంటాయి.  ముందు ఇంజిన్ రైలును లాగుతున్నప్పుడు, వెనుక ఇంజిన్ ఏకకాలంలో దాన్ని నెట్టివేస్తుంది. ఈ టెక్నాలజీ.. రైలు అత్యంత వేగాన్ని అందుకోవడానికి ఉపయోగపడుతుంది.  ఈ డిజైన్ వల్ల... ఎత్తైన వంతెనలు, భారీ మలుపులు, స్పీడ్‌ బ్రేకర్‌ విభాగాల దగ్గర సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. అమృత్ భారత్ ట్రైన్స్‌ కుంకుమ-బూడిద రంగులో  ఉంటాయి. 

అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎన్నో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. మొబైల్ హోల్డర్లు, స్లైడర్ ఆధారిత విండో గ్లాస్ అమర్చబడి ఉంటాయి. ఇవి ప్రయాణీకులకు మోడ్రన్  టచ్ ఇస్తాయి. స్టేషన్‌ను సమీపించే వివరాలను కూడా ట్రైన్స్‌లో ప్రదర్శిస్తారు. అందుకోసం రైలులో ప్రయాణీకుల సమాచార వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. అమృత్ భారత్  ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్, జనరల్ కోచ్‌లతో కలిపి 22 కోచ్‌లు ఉంటాయి. అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సెకండ్‌ క్లాస్‌, స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ ధరలు... మిగిలిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కంటే 15  నుంచి 17శాతం ఎక్కువగా ఉంటాయి. 50 కిలోమీటర్ల లోపు దూరానికి కనీస టికెట్ ధర రూ.35గా నిర్ణయించారు. రిజర్వేషన్‌ రుసుం, ఇతర ఛార్జీలు అదనమని రైల్వేబోర్డు  తెలిపింది. 

రేడియం ఇల్యుమినేషన్... అమృత్ భారత్ రైలు బోగీల మరో ప్రత్యేకత. రాత్రి వేళల్లో లైట్లు ఆర్పివేసి ఉన్న సమయాల్లో ప్రయాణికులకు ఈ టెక్నాలజీ సహాయకంగా ఉంటుంది. ఇండియన్ రైల్వే ఈ సాంకేతికతను రైలు బోగీల్లో తొలిసారిగా ప్రవేశపెడుతోంది. అమృత్ భారత్ రైలు బోగీల్లో సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటు దగ్గర మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌లు ఉంటాయి. అత్యవసర వేళల్లో సమాచారాన్ని అందించేందుకు ఎల్‌ఈడీ డిస్‌ప్లే వ్యవస్థ ఉంటుంది. సౌకర్యవంతంగా సీట్లు, LED లైట్లు, ఆధునిక డిజైన్లలో ఫ్యాన్లు, స్విచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో అత్యాధునిక బయో వ్యాక్యూమ్ టాయ్‌లెట్లను కూడా ఏర్పాటు చేశారు. వీటికి సెన్సార్ ట్యాప్స్ ఉంటాయి. ఈ రైలులో ఒకేసారి 1800 మంది వరకు ప్రయాణించొచ్చు. 800 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న నగరాల మధ్య ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. 

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. వాటిల్లో భాగంగానే సెమీ  హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్‌తో పాటు అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెడుతోంది. వందేభారత్ తరహాలో మరింత డైనమిక్‌గా దీనిని డిజైన్ చేశారు. దివ్యాంగ ప్రయాణికులకు,  మహిళలకు అధునాతన సౌకర్యాలు కల్పించారు. 

టాప్ హెడ్ లైన్స్

Sarfaraz Vs Jurel IND vs SL: సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget